తెలంగాణ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో చెందిన విజయ రావు- రోజ్ మేరీ దంపతుల మొదటి సంతానమైన సాగర్ స్థానిక జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించాడు. అదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉన్న తల్లి తన కొడుకు లోని ప్రతిభను అప్పుడే గుర్తించింది.. ఈల పాట పాడేలా మెలకువలు నేర్పించి ప్రోత్సహించింది. సరదాగా నేర్పిన ఈలపాట నేడు సాగర్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. సాధారణంగా పెదవులను కలుపుతూ చాలా మంది ఈల పాటలు పాడడం చూసి ఉంటాం.
కానీ సాగర్ మాత్రం అలా కాదు. ఈల పాటలు పాడుతున్నప్పుడు నాలుకను కదిలిస్తూ గాలిని వదులుతూ అచ్చం ఫ్లూట్తో పాడినట్లు ఉండటం సాగర్ ప్రత్యేకత. అంతేకాకుండా పెదవులను కదపకుండా ఈలపాట పాడుతూ తనలోని సృజనాత్మకతను చాటుతున్నారు. ప్రస్తుతం ఈ పాటలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు కాకుండా హిందీ ,భక్తి ,జానపదం పాటలు అవలీలగా పాడుతున్నాడు. అంతేకాకుండా మానవతా స్వచ్ఛంద సంస్థ ను స్థాపించి పేదలకు, వృద్ధులకు, అనాథ పిల్లలకు చేయూతను అందిస్తు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవీ చదవండి