ఈ ఏడాది ప్రవేశాలు పొందిన పీజీ వైద్య విద్యార్థులు కళాశాలలో చేరే గడువును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పెంచింది. ఇప్పటికే ఓ సారి గడువు పెంచినా ఫీజుల తగ్గింపు వల్ల విద్యార్థులను చేర్చుకునేది లేదని కళాశాలలు తేల్చి చెప్పాయి. ఇదే విషయాన్ని విశ్వవిద్యాలయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. విద్యార్థులు ప్రవేశాలు పొందిన కళాశాలలు ఎదుట ఆందోళన బాటపడుతున్నారు. దీంతో కళాశాలలో చేరేందుకు బధవారం వరకు ఉన్న గడవును ఈ నెల 18వ తేదీ వరకు పొడిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: