ETV Bharat / city

తెలంగాణ: హైదరాబాద్, మహబూబ్​నగర్‌లలో 7 కేంద్రాల్లో డ్రైరన్

author img

By

Published : Jan 2, 2021, 9:31 AM IST

దాదాపు 10 నెలలుగా ప్రజలను భయపెడుతోన్న మహమ్మారి కొవిడ్‌ని ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా.. వ్యాక్సిన్ సరఫరా చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలన్న లక్ష్యంతో.. దేశ వ్యాప్తంగా నేడు డ్రై రన్​కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని 2 జిల్లాల్లో.. డ్రై రన్ జరగనుంది. ఇందుకోసం సర్కారు ఏర్పాట్లను పూర్తి చేసింది.

DRY RUN
DRY RUN

కొవిడ్‌ వ్యాక్సిన్ పంపిణీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో.. నేడు దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలు కనీసం 3 కేంద్రాల్లో డ్రైరన్ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు... హైదరాబాద్, మహబూబ్ నగర్​లలో కలిపి 7 కేంద్రాల్లో డ్రైరన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్​సీ.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇక మహబూబ్ నగర్​కి సంబంధించి జానంపేట పీహెచ్​సీ, మహబూబ్​నగర్ జీజీహెచ్, ప్రైవేట్ సెక్టార్​లో నేహా షైన్ హాస్పిటల్​లలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

డ్రైరన్​ అంటే..

వ్యాక్సిన్ డ్రైరన్​లో భాగంగా ఆయా కేంద్రాల్లో టీకా ఇచ్చే సమయంలో.. ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలు, సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు. సాధారణంగా వాక్సినేషన్ సమయంలో కొవిన్ సైట్​లో రిజిస్టర్ చేసుకున్న వారు ముందుగా తమ ధ్రువపత్రాలతో వ్యాక్సిన్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి వివరాలను సరిపోల్చుకున్న అనంతరం అధికారులు లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారు దాదాపు అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలో వేచి ఉండాలని.. ఆ సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులను అధికారులు గుర్తించి వివరాలను ఆన్​లైన్​లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎంత సేపు తీసుకుంటోంది.. వ్యాక్సిన్ అమలులో వుండే సమస్యలను గుర్తించి పరిష్కరించి... అసలైన వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ డ్రైరన్ ప్రధాన లక్ష్యం. అయితే డ్రైరన్​లో ఎక్కడా వ్యాక్సిన్​ ని వినియోగించరు. కేవలం ఆ ప్రక్రియను ఒక ట్రయల్​గా మాత్రమే చేసి చూస్తారు. అనంతరం ఆయా వివరాలను కొవిన్ సైట్​లో అధికారులు పొందుపరచనున్నారు.

మహబూబ్​నగర్​లో సర్వం సిద్ధం

మహబూబ్ నగర్ జిల్లాలో కొవిడ్ వాక్సినేషన్ డ్రైరన్​కు సర్వం సిద్ధమైంది. డ్రైరన్​లో పాల్గొనే 25మంది సమాచారాన్ని ఇప్పటికే టీకా ఆప్​లో నిక్షిప్తం చేసి ఉంచారు. డ్రైరన్​ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు సహా.. కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి వచ్చే బృందాలు కూడా పర్యవేక్షించనున్నారు.

కొవిడ్​ నిబంధనలు తప్పనిసరి

అన్ని కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల అమలును.. డ్రైరన్‌లో తప్పనిసరి చేశారు. మాస్క్ ధరించడంతో పాటు, ఆరడుగుల దూరాన్ని అందరూ పాటించాల్సిందే. ప్రతి కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్.. శానిటైజర్లు, మాస్కులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా.. జిల్లాకు 3 కేంద్రాల చొప్పున..!

కొవిడ్‌ వ్యాక్సిన్ పంపిణీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుందన్న అంచనాల నేపథ్యంలో.. నేడు దేశవ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలు కనీసం 3 కేంద్రాల్లో డ్రైరన్ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు... హైదరాబాద్, మహబూబ్ నగర్​లలో కలిపి 7 కేంద్రాల్లో డ్రైరన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో గాంధీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ యూపీహెచ్​సీ.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఇక మహబూబ్ నగర్​కి సంబంధించి జానంపేట పీహెచ్​సీ, మహబూబ్​నగర్ జీజీహెచ్, ప్రైవేట్ సెక్టార్​లో నేహా షైన్ హాస్పిటల్​లలో డ్రైరన్ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

డ్రైరన్​ అంటే..

వ్యాక్సిన్ డ్రైరన్​లో భాగంగా ఆయా కేంద్రాల్లో టీకా ఇచ్చే సమయంలో.. ఎదురయ్యే క్షేత్రస్థాయి సమస్యలు, సాంకేతిక సమస్యలను పరిశీలించనున్నారు. సాధారణంగా వాక్సినేషన్ సమయంలో కొవిన్ సైట్​లో రిజిస్టర్ చేసుకున్న వారు ముందుగా తమ ధ్రువపత్రాలతో వ్యాక్సిన్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి వివరాలను సరిపోల్చుకున్న అనంతరం అధికారులు లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఇస్తారు. ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వారు దాదాపు అరగంట సేపు వ్యాక్సిన్ కేంద్రంలో వేచి ఉండాలని.. ఆ సమయంలో వారి శరీరంలో వచ్చే మార్పులను అధికారులు గుర్తించి వివరాలను ఆన్​లైన్​లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎంత సేపు తీసుకుంటోంది.. వ్యాక్సిన్ అమలులో వుండే సమస్యలను గుర్తించి పరిష్కరించి... అసలైన వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ఈ డ్రైరన్ ప్రధాన లక్ష్యం. అయితే డ్రైరన్​లో ఎక్కడా వ్యాక్సిన్​ ని వినియోగించరు. కేవలం ఆ ప్రక్రియను ఒక ట్రయల్​గా మాత్రమే చేసి చూస్తారు. అనంతరం ఆయా వివరాలను కొవిన్ సైట్​లో అధికారులు పొందుపరచనున్నారు.

మహబూబ్​నగర్​లో సర్వం సిద్ధం

మహబూబ్ నగర్ జిల్లాలో కొవిడ్ వాక్సినేషన్ డ్రైరన్​కు సర్వం సిద్ధమైంది. డ్రైరన్​లో పాల్గొనే 25మంది సమాచారాన్ని ఇప్పటికే టీకా ఆప్​లో నిక్షిప్తం చేసి ఉంచారు. డ్రైరన్​ను జిల్లా కలెక్టర్ వెంకట్రావు సహా.. కేంద్ర, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నుంచి వచ్చే బృందాలు కూడా పర్యవేక్షించనున్నారు.

కొవిడ్​ నిబంధనలు తప్పనిసరి

అన్ని కేంద్రాల్లో కొవిడ్ నిబంధనల అమలును.. డ్రైరన్‌లో తప్పనిసరి చేశారు. మాస్క్ ధరించడంతో పాటు, ఆరడుగుల దూరాన్ని అందరూ పాటించాల్సిందే. ప్రతి కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్.. శానిటైజర్లు, మాస్కులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా.. జిల్లాకు 3 కేంద్రాల చొప్పున..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.