ETV Bharat / city

28న హైదరాబాద్​లో కేసీఆర్​ సభ..ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు

author img

By

Published : Nov 26, 2020, 7:01 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస ప్రచారం ముమ్మరం చేసింది. విపక్షాల విమర్శలు, వ్యూహాలను తిప్పికొట్టి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హైదరాబాద్​ ఎల్బీ స్టేడియంలో ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లను గురువారం.. మంత్రులు కేటీఆర్, తలసాని పరిశీలించారు.

ministers ktr, thalasani
ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

బల్దియా పోరులో రసవత్తరంగా ప్రచారం చేస్తున్న తెరాస.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్​తో సభ నిర్వహించనుంది. విపక్షాల వ్యూహాలు తిప్పికొట్టి.. విమర్శలను ఎక్కుపెట్టి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేరుగా కేసీఆరే రంగంలోకి దిగనున్నారు.

ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ సభ ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, తలసాని పరిశీలించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఎల్బీ స్టేడియానికి వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాలమల్లు, కర్నె ప్రభాకర్​లు.. ఏర్పాట్లను పరిశీలించారు.

సామాన్యునికి ఏం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రాధాన్య అంశమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం వాస్తవికవాది అని తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని చెప్పారు. 7 వేల మెగావాట్ల నుంచి 16వేల మెగావాట్లకు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచామని వెల్లడించారు.

నిజాంక్లబ్​లో జరిగిన 'విశ్వనగరంగా హైదరాబాద్‌' సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. దుర్గంచెరువు తీగల వంతెన, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, మెట్రో రైలుపై చర్చించారు. 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన హైదరాబాద్​ను దేశంలోనే అరుదైన, అద్భుత నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ద్వితీయస్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలం కోసం కేశవాపురం రిజర్వాయర్ నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన

బల్దియా పోరులో రసవత్తరంగా ప్రచారం చేస్తున్న తెరాస.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్​తో సభ నిర్వహించనుంది. విపక్షాల వ్యూహాలు తిప్పికొట్టి.. విమర్శలను ఎక్కుపెట్టి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేరుగా కేసీఆరే రంగంలోకి దిగనున్నారు.

ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ఈ సభ ఏర్పాట్లను మంత్రులు కేటీఆర్, తలసాని పరిశీలించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఎల్బీ స్టేడియానికి వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాలమల్లు, కర్నె ప్రభాకర్​లు.. ఏర్పాట్లను పరిశీలించారు.

సామాన్యునికి ఏం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రాధాన్య అంశమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం వాస్తవికవాది అని తెలిపారు. తెరాస అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని చెప్పారు. 7 వేల మెగావాట్ల నుంచి 16వేల మెగావాట్లకు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచామని వెల్లడించారు.

నిజాంక్లబ్​లో జరిగిన 'విశ్వనగరంగా హైదరాబాద్‌' సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. దుర్గంచెరువు తీగల వంతెన, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, మెట్రో రైలుపై చర్చించారు. 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన హైదరాబాద్​ను దేశంలోనే అరుదైన, అద్భుత నగరంగా తీర్చిదిద్దామని తెలిపారు. సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ద్వితీయస్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాలం కోసం కేశవాపురం రిజర్వాయర్ నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.