ETV Bharat / city

నేడు మళ్లీ హస్తినకు సీఎం జగన్​.. అమిత్​ షాతో భేటీ

author img

By

Published : Feb 13, 2020, 6:49 PM IST

Updated : Feb 14, 2020, 3:27 AM IST

సీఎం జగన్ నేడు​ దిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల మంజూరుతో పాటు విభజన హామీల అమలుకు సంబంధించి చర్చలు జరపనున్నారు.

cm jagan to meet amith shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్​ భేటీ

సీఎం జగన్​ మరోమారు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవాడ నుంచి దిల్లీ బయల్దేరనున్నారు. నిన్న ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం జగన్ .. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు, మూడు రాజధానుల వ్యవహారం, పునర్విభజన చట్టంలో సవరణలు, ఏపీ శాసన మండలి రద్దుకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల మంజూరుతో పాటు విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్ర హోం మంత్రితోనూ చర్చించాలన్న ప్రధాని సూచనతో ఇవాళ అమిత్​ షాను సీఎం కలవనున్నారు. భేటీ అనంతరం దిల్లీలోనే బస చేయనున్నారు. శనివారం ఉదయం తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి విజయవాడ చేరుకోనున్నారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్​ మరోమారు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవాడ నుంచి దిల్లీ బయల్దేరనున్నారు. నిన్న ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం జగన్ .. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు, మూడు రాజధానుల వ్యవహారం, పునర్విభజన చట్టంలో సవరణలు, ఏపీ శాసన మండలి రద్దుకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల మంజూరుతో పాటు విభజన హామీల అమలుకు సంబంధించి కేంద్ర హోం మంత్రితోనూ చర్చించాలన్న ప్రధాని సూచనతో ఇవాళ అమిత్​ షాను సీఎం కలవనున్నారు. భేటీ అనంతరం దిల్లీలోనే బస చేయనున్నారు. శనివారం ఉదయం తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి విజయవాడ చేరుకోనున్నారు.

ఇదీ చదవండి:

'సెలెక్ట్ కమిటీ' విషయంలో మండలి కార్యదర్శిపై ఛైర్మన్ షరీఫ్‌ ఆగ్రహం

Last Updated : Feb 14, 2020, 3:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.