ETV Bharat / city

'అక్రమ కేసుల వేధింపులే... కోడెల మరణానికి కారణం'

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం కోడెల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాజకీయ వేధింపులే కోడెల ఆత్మహత్యకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెలది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యేనని చంద్రబాబు విమర్శించారు.

author img

By

Published : Sep 16, 2019, 11:59 PM IST

కోడెలది ఆత్మహత్య కాదు... ప్రభుత్వం చేసిన హత్య : చంద్రబాబు
అక్రమ కేసుల వేధింపులే... కోడెల మరణానికి కారణం : చంద్రబాబు

దివంగత నేత కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి నివాళులర్పించడానికి తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. నేరుగా హైదరాబాద్​ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లి కోడెల పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌, తెదేపా నేతలు కోడెల భౌతికదేహానికి నివాళులు అర్పించారు. కోడెల కుటుంబసభ్యులను పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... ప్రజల కోసం పని చేసిన వ్యక్తి కోడెల అని కొనియాడారు. అనేక పదవుల్లో ఉంటూ ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు అన్న చంద్రబాబు.. రాజకీయ వేధింపులే కోడెల ఆత్మహత్యకు కారణమన్నారు. పులిలాంటి వ్యక్తి కోడెల ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేశారని ఆరోపించారు. మానసికంగా కుంగిపోయేంతగా కోడెలను వేధించారని చంద్రబాబు అన్నారు. కుర్చీలు, బెంచీలు తీసుకుపోయారని కోడెలపై ఆరోపణలు చేసి వేధించారన్నారు. కోడెలది ఆత్మహత్య కాదు... ఇది ప్రభుత్వం చేసిన హత్య అన్న చంద్రబాబు.. కోడెలను వేధించి... ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకువచ్చారన్నారు.

పల్నాడును కాపాడుకోవాలని తపించిన వ్యక్తి కోడెల అన్న చంద్రబాబు... కోడెల మరణంతో ప్రజలు ఓ మంచి నాయకుడిని కోల్పోయారని ఆవేదన చెందారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోడెల ఆత్మహత్యకు పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత అన్నారు. చట్టప్రకారమే ఏ పనైనా చేయాలి... కానీ అక్రమ కేసులతో వేధించి కోడెల బలవన్మరణానికి కారణమయ్యారన్నారు. ఓ వైపు కోడెల ఆత్మహత్య చేసుకుంటే... అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వక్తం చేశారు. కోడెల కుమారుడు విదేశాల్లో ఉంటే మానవత్వం లేకుండా ఆయనపై కూడా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.కోట్ల మేర ప్రజాధనం లూటీ చేసినవారు... కోడెలపై అసత్య ప్రచారాలు చేయడం ఎద్దేవా చేశారు. కుర్చీలు, బెంచీలు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ కోడెలను వేధించారన్నారు.

ఇదీ చదవండి : 'కోడెలది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే'

అక్రమ కేసుల వేధింపులే... కోడెల మరణానికి కారణం : చంద్రబాబు

దివంగత నేత కోడెల శివప్రసాదరావు భౌతికకాయానికి నివాళులర్పించడానికి తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. నేరుగా హైదరాబాద్​ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వెళ్లి కోడెల పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌, తెదేపా నేతలు కోడెల భౌతికదేహానికి నివాళులు అర్పించారు. కోడెల కుటుంబసభ్యులను పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... ప్రజల కోసం పని చేసిన వ్యక్తి కోడెల అని కొనియాడారు. అనేక పదవుల్లో ఉంటూ ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు అన్న చంద్రబాబు.. రాజకీయ వేధింపులే కోడెల ఆత్మహత్యకు కారణమన్నారు. పులిలాంటి వ్యక్తి కోడెల ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేశారని ఆరోపించారు. మానసికంగా కుంగిపోయేంతగా కోడెలను వేధించారని చంద్రబాబు అన్నారు. కుర్చీలు, బెంచీలు తీసుకుపోయారని కోడెలపై ఆరోపణలు చేసి వేధించారన్నారు. కోడెలది ఆత్మహత్య కాదు... ఇది ప్రభుత్వం చేసిన హత్య అన్న చంద్రబాబు.. కోడెలను వేధించి... ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకువచ్చారన్నారు.

పల్నాడును కాపాడుకోవాలని తపించిన వ్యక్తి కోడెల అన్న చంద్రబాబు... కోడెల మరణంతో ప్రజలు ఓ మంచి నాయకుడిని కోల్పోయారని ఆవేదన చెందారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోడెల ఆత్మహత్యకు పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని తెదేపా అధినేత అన్నారు. చట్టప్రకారమే ఏ పనైనా చేయాలి... కానీ అక్రమ కేసులతో వేధించి కోడెల బలవన్మరణానికి కారణమయ్యారన్నారు. ఓ వైపు కోడెల ఆత్మహత్య చేసుకుంటే... అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వక్తం చేశారు. కోడెల కుమారుడు విదేశాల్లో ఉంటే మానవత్వం లేకుండా ఆయనపై కూడా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.కోట్ల మేర ప్రజాధనం లూటీ చేసినవారు... కోడెలపై అసత్య ప్రచారాలు చేయడం ఎద్దేవా చేశారు. కుర్చీలు, బెంచీలు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ కోడెలను వేధించారన్నారు.

ఇదీ చదవండి : 'కోడెలది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే'

Intro:AP_GNT_67A_16_SATTENAPALLI_LO_DEVELOPMENTS_AV_AP10036.


Body:గుంటూరు జిల్లా సత్తెనపల్లి


Conclusion:విజయ్ కుమార్ 9440750588
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.