బోయిన్పల్లి అపహరణ కేసులో తన పేరు ఉండటంపై ఎ.వి. సుబ్బారెడ్డి స్పందించారు. కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసులో నేను ఏ-1 ముద్దాయిని కాదని స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానన్నారు. అసలు తనకు అఖిలప్రియ వ్యవహారశైలి నచ్చదని తెలిపారు. ప్రవీణ్ రావు తమకు కుటుంబ స్నేహితుడని వెల్లడించారు. అసలు నిజాలు బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వస్తానన్నారు.
పోలీసుల అదుపులో ఎ.వి సుబ్బారెడ్డి...
కిడ్నాప్ కేసులో ఏ-1గా ఉన్న ఎ.వి. సుబ్బారెడ్డిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ-2గా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి
కిడ్నాప్ కేసులో ట్విస్ట్: ఏ-1 ఎ.వి.సుబ్బారెడ్డి, ఏ-2గా అఖిలప్రియ