ETV Bharat / city

'వర్శిటీ ఈసీ సభ్యుల భర్తీకి విధివిధానాలేంటో చెప్పండి'

లాక్ డౌన్ సమయంలో వర్శిటీల్లో ఈసీ సభ్యుల నియామకం చేపట్టడంపై హైకోర్టు సందేహం వ్యక్తం చేసింది. నియామకాలకు సంబంధించిన విధివిధానాలేంటో చెప్పాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. తదపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

author img

By

Published : Nov 10, 2020, 8:19 AM IST

ap high court
ap high court

విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల నియామకానికి సంబంధించిన అధికారం ఎవరిది, అందుకు సంబంధించిన విధానాలేమిటో చెప్పాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం నియామకం చేపట్టడంపై సందేహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ (క్లాస్-2) సభ్యుల నియామకానికి సంబంధించిన జోవోలను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రెస్ హైకోర్టులో పిల్ వేశారు.

సభ్యుల నియామకానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 23న జారీచేసిన 14 జీవోలను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు, ఎంపీ , ఎమ్మెల్యే , మంత్రులు , బ్యూరోక్రాట్లు చేసిన సిఫారసుల ఆధారంగా కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యులను లాక్ డౌన్ సమయంలో హడావుడిగా నియమించారన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ సిఫారసులతో నియామకాలు ప్రతి చోట సహజమైందని వ్యాఖ్యానించింది. సభ్యుల నియామకం విషయంలో గతంలో అనుసరించిన విధానం , నియమించే అధికారం వివరాల్ని అధ్యయనం చేసి చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది .

విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల నియామకానికి సంబంధించిన అధికారం ఎవరిది, అందుకు సంబంధించిన విధానాలేమిటో చెప్పాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం నియామకం చేపట్టడంపై సందేహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ (క్లాస్-2) సభ్యుల నియామకానికి సంబంధించిన జోవోలను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రెస్ హైకోర్టులో పిల్ వేశారు.

సభ్యుల నియామకానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 23న జారీచేసిన 14 జీవోలను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు, ఎంపీ , ఎమ్మెల్యే , మంత్రులు , బ్యూరోక్రాట్లు చేసిన సిఫారసుల ఆధారంగా కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యులను లాక్ డౌన్ సమయంలో హడావుడిగా నియమించారన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ సిఫారసులతో నియామకాలు ప్రతి చోట సహజమైందని వ్యాఖ్యానించింది. సభ్యుల నియామకం విషయంలో గతంలో అనుసరించిన విధానం , నియమించే అధికారం వివరాల్ని అధ్యయనం చేసి చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది .

ఇదీ చదవండి

స్టేటస్ కో ఉండగానే రైతు భరోసా కేంద్రం నిర్మిస్తారా..?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.