విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యుల నియామకానికి సంబంధించిన అధికారం ఎవరిది, అందుకు సంబంధించిన విధానాలేమిటో చెప్పాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం నియామకం చేపట్టడంపై సందేహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో కార్యనిర్వాహక కౌన్సిల్ (క్లాస్-2) సభ్యుల నియామకానికి సంబంధించిన జోవోలను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మిగ్రెస్ హైకోర్టులో పిల్ వేశారు.
సభ్యుల నియామకానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 23న జారీచేసిన 14 జీవోలను రద్దు చేయాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ .. రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు, ఎంపీ , ఎమ్మెల్యే , మంత్రులు , బ్యూరోక్రాట్లు చేసిన సిఫారసుల ఆధారంగా కార్యనిర్వాహక కౌన్సిల్ సభ్యులను లాక్ డౌన్ సమయంలో హడావుడిగా నియమించారన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ... రాజకీయ సిఫారసులతో నియామకాలు ప్రతి చోట సహజమైందని వ్యాఖ్యానించింది. సభ్యుల నియామకం విషయంలో గతంలో అనుసరించిన విధానం , నియమించే అధికారం వివరాల్ని అధ్యయనం చేసి చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది .
ఇదీ చదవండి
స్టేటస్ కో ఉండగానే రైతు భరోసా కేంద్రం నిర్మిస్తారా..?: హైకోర్టు