ETV Bharat / city

రాజధాని విషయంలో భాజపా జోక్యం ఉండదు: సోము వీర్రాజు

author img

By

Published : Jul 30, 2020, 8:47 PM IST

Updated : Jul 30, 2020, 11:05 PM IST

రాష్ట్రంలో భాజపా బలోపేతమే లక్ష్యంగా పని చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజధాని విషయంలో రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. తమ వైఖరిలో మార్పులేదన్నారు. కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదని చెప్పారు. ప్రాంతీయ పార్టీల రాజకీయ చదరంగంలో తాము చిక్కుకోబోమని వ్యాఖ్యానించారు. భాజపా సకల జనుల పార్టీ అన్న ఆయన... జనసేనతో కలిసి అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా ముందుకు సాగుతామన్నారు.

'2024 ఎన్నికలే లక్ష్యం.. రాజధాని విషయంలో భాజపా జోక్యం ఉండదు'
'2024 ఎన్నికలే లక్ష్యం.. రాజధాని విషయంలో భాజపా జోక్యం ఉండదు'
రాజధాని విషయంలో భాజపా జోక్యం ఉండదు: సోము వీర్రాజు

2024 ఎన్నికలే లక్ష్యంగా భాజపా ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా నియమించిన జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలోనే భాజపా జోక్యం చేసుకుంటుందని.. రాష్ట్ర రాజధాని విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తేనే.. ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారని అన్నారు. అమరావతిపై చంద్రబాబు హామీల్లో కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు.

కుటుంబ పాలన మారుస్తాం

రాష్ట్రంలో కుటుంబ పాలన మార్చేందుకు గట్టి పోరాటం చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తెదేపా, వైకాపాలు రెండూ కుటుంబ పార్టీలేనన్న ఆయన.. భాజపా మాత్రం సకల జనుల పార్టీ అని అన్నారు. ఏపీలో భాజపా జనసేన కలిస్తే 25 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ పేరుతో భూములు కొని కమీషన్లు లాక్కొంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు.

ఇదీ చూడండి..

ఈటీవీ కథనాలకు స్పందన... రష్యన్ యువతికి విరాళాలు అందజేత

రాజధాని విషయంలో భాజపా జోక్యం ఉండదు: సోము వీర్రాజు

2024 ఎన్నికలే లక్ష్యంగా భాజపా ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా నియమించిన జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలోనే భాజపా జోక్యం చేసుకుంటుందని.. రాష్ట్ర రాజధాని విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తేనే.. ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారని అన్నారు. అమరావతిపై చంద్రబాబు హామీల్లో కేంద్రం ఏనాడూ జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు.

కుటుంబ పాలన మారుస్తాం

రాష్ట్రంలో కుటుంబ పాలన మార్చేందుకు గట్టి పోరాటం చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తెదేపా, వైకాపాలు రెండూ కుటుంబ పార్టీలేనన్న ఆయన.. భాజపా మాత్రం సకల జనుల పార్టీ అని అన్నారు. ఏపీలో భాజపా జనసేన కలిస్తే 25 శాతం ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ పేరుతో భూములు కొని కమీషన్లు లాక్కొంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు.

ఇదీ చూడండి..

ఈటీవీ కథనాలకు స్పందన... రష్యన్ యువతికి విరాళాలు అందజేత

Last Updated : Jul 30, 2020, 11:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.