ఉభయ సభల సభ్యులతో పలు కమిటీలు ఏర్పాటు చేస్తూ శాసనసభ కార్యదర్శి ప్రకటన జారీ చేశారు. వసతుల సౌకర్యాల కమిటీ సహా అటవీ, పర్యావరణ సంరక్షణ కమిటీ ఛైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.
- ఎస్సీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ - గొల్ల బాబురావు
- ఎస్టీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ - తెల్లం బాలరాజు
- మైనార్టీ సంక్షేమం కమిటీ ఛైర్మన్ -షేక్ మహ్మద్ ముస్తఫా
- స్త్రీ శిశు సంక్షేమ, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమ కమిటీ ఛైర్మన్ - విశ్వసరాయి కళావతి
- బీసీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ -జంగా కృష్ణమూర్తి
- లైబ్రరీ కమిటీ ఛైర్మన్ - అంగర రామ్మోహన్
- సబార్డినేట్ లెజిస్ట్లేషన్ కమిటీ ఛైర్మన్ - శమంతకమణి
శాసనమండలి సభ్యులతో పలు కమిటీలు
తెలుగు, సంస్కృతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గా శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ నియామకమయ్యారు.
- ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ - ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి
- పిటిషన్స్ కమిటీ ఛైర్మన్ - రెడ్డి సుబ్రమణ్యం
- పేపర్స్ లెయిడ్ ఆన్ టేబుల్ కమిటీ ఛైర్మన్ -వైవిబీ రాజేంద్ర ప్రసాద్
ఆరుగురు సభ్యులతో సభా హక్కుల కమిటీని ప్రకటించారు. ఛైర్మన్ గా దేవసాని చిన్న గోవింద రెడ్డికి అవకాశం కల్పించారు. ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్గా జి. తిప్పేస్వామి నియామితులయ్యారు.