ETV Bharat / city

అమరావతి: మోకాళ్లపై మహిళల నిరసన

author img

By

Published : Dec 13, 2020, 6:19 PM IST

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా అమరావతి రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంకటపాలెంలో మహిళలు వన దేవతలకు మోకాళ్లపై కూర్చొని పూజలు చేశారు. తమ ఉద్యమం ప్రారంభించి ఏడాది అవుతున్నా... ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని అన్నారు.

amaravati farmers agitation
amaravati farmers agitation

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు 362వ రోజు ఆందోళన చేశారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.

ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ వెంకటపాలెంలో మహిళలు వన దేవతలకు మోకాళ్లపై కూర్చొని పూజలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు దీక్షా శిబిరాలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. మరో నాలుగు రోజుల్లో తమ ఉద్యమం ప్రారంభించి ఏడాది అవుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని మహిళలు దుయ్యబట్టారు. అమరావతికి మద్దతుగా నిర్ణయం తీసుకోకపోతే వైకాపా అధికారంలో ఉన్నన్ని రోజులు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు 362వ రోజు ఆందోళన చేశారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.

ఏకైక రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ వెంకటపాలెంలో మహిళలు వన దేవతలకు మోకాళ్లపై కూర్చొని పూజలు చేశారు. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు దీక్షా శిబిరాలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. మరో నాలుగు రోజుల్లో తమ ఉద్యమం ప్రారంభించి ఏడాది అవుతున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదని మహిళలు దుయ్యబట్టారు. అమరావతికి మద్దతుగా నిర్ణయం తీసుకోకపోతే వైకాపా అధికారంలో ఉన్నన్ని రోజులు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి

'పన్నుల పెంపుపై బహిరంగ చర్చకు మంత్రి బొత్స సిద్ధమా!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.