ETV Bharat / city

చిక్కీల ముసుగులో రూ.14 కోట్లకు టెండర్‌

author img

By

Published : Sep 12, 2020, 7:39 AM IST

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించనున్న చిక్కీ (పల్లిపట్టీలు) టెండర్ల ఖరారుపై ఆరోపణలు వినవస్తున్నాయి. వాస్తవానికి రివర్స్‌ టెండర్ల విధానంలో ప్రభుత్వానికి డబ్బులు ఆదా కావాల్సి ఉండగా.. రూ.14 కోట్లకుపైగా భారం పడుతోంది. అక్షయపాత్ర, మరో సంస్థ తక్కువ ధరకు సరఫరా చేస్తామన్నా పట్టించుకోకుండా ఎక్కువ ధరకు గుత్తేదార్లకు కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి.

mid day meal scheme
చిక్కీల ముసుగులో రూ.14 కోట్లకు టెండర్‌

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే చిక్కీ (పల్లిపట్టీలు) టెండర్ల ఖరారుపై ఆరోపణలు వినవస్తున్నాయి. వాస్తవానికి రివర్స్‌ టెండర్ల విధానంలో ప్రభుత్వానికి డబ్బులు ఆదా కావాల్సి ఉండగా.. రూ.14 కోట్లకుపైగా భారం పడుతోంది. అక్షయపాత్ర, మరో సంస్థ తక్కువ ధరకు సరఫరా చేస్తామన్నా పట్టించుకోకుండా ఎక్కువ ధరకు గుత్తేదార్లకు కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన) పథకం కింద విద్యార్థులకు పోషకాహారంలో భాగంగా వారానికి మూడు రోజులు చిక్కీలను అందిస్తున్నారు.

జులైలో టెండర్లు పిలవగా గుత్తేదారులు ముందుకు రాకపోవడం, ఇతర కారణాలతో వాటిని రద్దు చేశారు. ఆగస్టులో నాలుగు జోన్లుగా విభజించి రివర్స్‌ టెండర్‌ విధానం (రివర్స్‌ ఆక్షన్‌)లో పిలిచారు. ప్రభుత్వ అంచనా ధరగా కిలో రూ.135గా నిర్ణయించారు. దీనికన్నా తక్కువ ధరకు అనుమతించాలి. లేదా అంచనాపై 5 శాతం (రూ.141.75కు) మించకుండా ఇవ్వొచ్చు. అయితే మొత్తం 10శాతం ఎక్కువ ధరకు.. అంటే రూ.142.50 నుంచి రూ.149.20 వరకు ఖరారు చేశారు.

ప్రస్తుతం అక్షయపాత్రకు, ఇతర మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కిలో రూ.135 చొప్పునే చెల్లిస్తున్నారు. విశాఖ, విజయనగరం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు ఈ సంస్థ సరఫరా చేస్తోంది. మరో సంస్థ రూ.120కే సరఫరా చేస్తామని లేఖలు ఇచ్చినా పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లాలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్లలో కేజీ చిక్కీ రూ.135కు ఖరారు చేశారు.

* మొత్తం 18 సంస్థలు పాల్గొనగా సాంకేతిక బిడ్‌లోనే 12 అర్హత కోల్పోయాయి. మిగిలిన ఆరింటిలో నాలుగు సంస్థలు టెండర్లను దక్కించుకున్నాయి. విశాఖ, కాకినాడ జోన్లను కేజీ చిక్కీకి రూ.150కు దాఖలు చేసిన వేర్వేరు సంస్థలు రివర్స్‌ టెండరింగ్‌లో రూ.149.20కు, గుంటూరు జోన్‌ను ఓ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ రూ.147.50కు, రాయలసీమ కడప జోన్‌ను మరో సంస్థ రూ.142.50కు దక్కించుకుంది.

పారదర్శకంగా చేశాం

పారదర్శకంగా చేశాం. పన్నులు, పాఠశాల వద్దకు చేర్చేందుకు రవాణా ఛార్జీలు కలిపి చిక్కీల ధర నిర్ణయించాం. అంచనా ధర కంటే ఎక్కువకు ఇవ్వకూడదని నిబంధన ఏమీ లేదు. కొన్నిచోట్ల మహిళా, శిశు సంక్షేమ శాఖ ధరలు వీటి కంటే అధికంగానే ఉన్నాయి. అక్షయపాత్ర సరఫరా చేస్తామని ముందుకు రాలేదు. టెండర్లలో పాల్గొనలేదు.

- జగనన్న గోరుముద్ద పథక సంచాలకులు దివాన్‌ మైదీన్‌, సహాయ సంచాలకులు సుబ్బారెడ్డి

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే చిక్కీ (పల్లిపట్టీలు) టెండర్ల ఖరారుపై ఆరోపణలు వినవస్తున్నాయి. వాస్తవానికి రివర్స్‌ టెండర్ల విధానంలో ప్రభుత్వానికి డబ్బులు ఆదా కావాల్సి ఉండగా.. రూ.14 కోట్లకుపైగా భారం పడుతోంది. అక్షయపాత్ర, మరో సంస్థ తక్కువ ధరకు సరఫరా చేస్తామన్నా పట్టించుకోకుండా ఎక్కువ ధరకు గుత్తేదార్లకు కట్టబెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన) పథకం కింద విద్యార్థులకు పోషకాహారంలో భాగంగా వారానికి మూడు రోజులు చిక్కీలను అందిస్తున్నారు.

జులైలో టెండర్లు పిలవగా గుత్తేదారులు ముందుకు రాకపోవడం, ఇతర కారణాలతో వాటిని రద్దు చేశారు. ఆగస్టులో నాలుగు జోన్లుగా విభజించి రివర్స్‌ టెండర్‌ విధానం (రివర్స్‌ ఆక్షన్‌)లో పిలిచారు. ప్రభుత్వ అంచనా ధరగా కిలో రూ.135గా నిర్ణయించారు. దీనికన్నా తక్కువ ధరకు అనుమతించాలి. లేదా అంచనాపై 5 శాతం (రూ.141.75కు) మించకుండా ఇవ్వొచ్చు. అయితే మొత్తం 10శాతం ఎక్కువ ధరకు.. అంటే రూ.142.50 నుంచి రూ.149.20 వరకు ఖరారు చేశారు.

ప్రస్తుతం అక్షయపాత్రకు, ఇతర మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కిలో రూ.135 చొప్పునే చెల్లిస్తున్నారు. విశాఖ, విజయనగరం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు ఈ సంస్థ సరఫరా చేస్తోంది. మరో సంస్థ రూ.120కే సరఫరా చేస్తామని లేఖలు ఇచ్చినా పట్టించుకోలేదు. ప్రకాశం జిల్లాలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన టెండర్లలో కేజీ చిక్కీ రూ.135కు ఖరారు చేశారు.

* మొత్తం 18 సంస్థలు పాల్గొనగా సాంకేతిక బిడ్‌లోనే 12 అర్హత కోల్పోయాయి. మిగిలిన ఆరింటిలో నాలుగు సంస్థలు టెండర్లను దక్కించుకున్నాయి. విశాఖ, కాకినాడ జోన్లను కేజీ చిక్కీకి రూ.150కు దాఖలు చేసిన వేర్వేరు సంస్థలు రివర్స్‌ టెండరింగ్‌లో రూ.149.20కు, గుంటూరు జోన్‌ను ఓ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ రూ.147.50కు, రాయలసీమ కడప జోన్‌ను మరో సంస్థ రూ.142.50కు దక్కించుకుంది.

పారదర్శకంగా చేశాం

పారదర్శకంగా చేశాం. పన్నులు, పాఠశాల వద్దకు చేర్చేందుకు రవాణా ఛార్జీలు కలిపి చిక్కీల ధర నిర్ణయించాం. అంచనా ధర కంటే ఎక్కువకు ఇవ్వకూడదని నిబంధన ఏమీ లేదు. కొన్నిచోట్ల మహిళా, శిశు సంక్షేమ శాఖ ధరలు వీటి కంటే అధికంగానే ఉన్నాయి. అక్షయపాత్ర సరఫరా చేస్తామని ముందుకు రాలేదు. టెండర్లలో పాల్గొనలేదు.

- జగనన్న గోరుముద్ద పథక సంచాలకులు దివాన్‌ మైదీన్‌, సహాయ సంచాలకులు సుబ్బారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.