- గుంటూరు జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు మృతి
గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సిమెంటు లారీ దూసుకెళ్లి అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చివరి అంకానికి చేరుకున్న తిరుపతి లోక్సభ ఉపఎన్నిక
రాష్ట్రమంతటా ఆసక్తి రేకెత్తిస్తున్న తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం గురువారం రాత్రి ఏడింటితో ముగిసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కిరాతకం: 20 నిమిషాల్లో ఆరుగురిని తెగనరికాడు
ఒక్కడినే చంపేస్తే క్షణంలో తేలిపోతుంది. కుటుంబాన్నే సమూలంగా తుడిచిపెడితే జీవితాంతం కుంగి, కృశించేలా చేయొచ్చు. విశాఖ జిల్లా జుత్తాడలో 20 నిమిషాల్లో ఆరుగురు కుటుంబసభ్యులను తెగనరికిన అప్పలరాజు అమానుష ఆలోచన ఇది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- తల్లి, తండ్రి, తమ్ముడి హత్య.. పొగ తీవ్రతకు నిందితుడి మరణం
నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని... పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చెప్పించిన తండ్రిని కన్నకొడుకే పొట్టన పెట్టుకున్నాడు. తమ్ముడినీ హతమార్చాడు. చివరకు తానూ ప్రాణాలు కోల్పోయాడు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 300 మంది దిల్లీ పోలీసులకు కరోనా
కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్న 300మంది దిల్లీ పోలీసులకు వైరస్ సోకింది. వీరిలో 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని దిల్లీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- హిందువును ముస్లిం అనుకొని ఖననం!
హిందువును ముస్లిం అనుకొని ఖననం చేశారు సౌదీ అధికారులు. అయితే.. ఆ వ్యక్తి అస్థికలను భారత్కు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం దిల్లీ హైకోర్టుకు తెలిపింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- చెన్నై ఐవీసీలో 'కొవాగ్జిన్' తయారీ!
చెన్నై సమీపంలోని ఓ ప్రాంతంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ వ్యాక్సిన్ కాంప్లెక్స్(ఐవీసీ)లో కొవాగ్జిన్ టీకాను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ బయోటెక్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కొవిడ్తోనే రక్తం గడ్డకట్టే ముప్పు అధికం!
కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్టే ముప్పు అధికంగా ఉందని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కంటే వైరస్ బారిన పడ్డవారిలోనే ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో బయటపడింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- అక్షర్ స్థానంలో దిల్లీ క్యాపిటల్స్లోకి ములాని
కరోనా కారణంగా ఐపీఎల్కు తాత్కాలికంగా దూరమైన ఆటగాడు అక్షర్ పటేల్ స్థానంలో షామ్స్ ములానికి చోటు కల్పించింది దిల్లీ క్యాపిటల్స్. అతడు కోలుకొని తిరిగి జట్టుతో కలిసే వరకు మాత్రమే ములాని అందుబాటులో ఉంటాడని ప్రకటించింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కష్టకాలంలో గతాన్ని గుర్తుచేసుకున్న బిగ్బీ
కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూపై బిగ్బీ అమితాబ్ స్పందించారు. ఈ నిబంధనల వల్ల పనులన్నీ నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి