ETV Bharat / city

Corona Cases in Gurukul School: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 43మందికి పాజిటివ్

author img

By

Published : Nov 29, 2021, 12:19 PM IST

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో చదువుతున్న 42 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయురాలికి వైరస్‌ నిర్ధరణ అయింది.

42-students-and-one-teacher-tested-corona-positive-in-muthangi-gurukul-school-in-sangareddy
గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 43మందికి పాజిటివ్

Muthangi gurukul school Covid-19 Cases: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి వైరస్‌ నిర్ధరణ అయింది. గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉండగా.. ఆదివారం 261 మంది విద్యార్థులు.. 27 మంది సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. మిగతా విద్యార్థులకూ పరీక్షలు చేస్తున్నారు. వైరస్‌ సోకిన వారిని వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

ఇటీవల మరో గురుకుల పాఠశాలలో కేసులు

corona cases in wyra gurukul school: ఇటీవలె మరో గురుకుల పాఠశాలలోనూ కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనా కలకలం రేగింది. 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ లక్ష్మి... విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. తొలుత 13 మందికి పాజిటివ్ రాగా... ఆ తర్వాత మరో 14 మందికి సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళ్లారు.

తల్లిదండ్రుల్లో ఆందోళన

సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో కాస్త భయంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు పాఠశాలలోని వసతి గృహాలకు చేరుకున్నారు. ఇక అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. అంతేకాకుండా పాఠశాలల్లోనూ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు స్కూళ్లలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్​గా నిర్ధరణ అవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

'ఒమిక్రాన్​' డెల్టా కంటే డేంజర్ అని ఇప్పుడే చెప్పలేం'

Muthangi gurukul school Covid-19 Cases: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి వైరస్‌ నిర్ధరణ అయింది. గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉండగా.. ఆదివారం 261 మంది విద్యార్థులు.. 27 మంది సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

పాజిటివ్‌ వచ్చిన వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. మిగతా విద్యార్థులకూ పరీక్షలు చేస్తున్నారు. వైరస్‌ సోకిన వారిని వసతి గృహంలోనే క్వారంటైన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.

ఇటీవల మరో గురుకుల పాఠశాలలో కేసులు

corona cases in wyra gurukul school: ఇటీవలె మరో గురుకుల పాఠశాలలోనూ కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాలలో కరోనా కలకలం రేగింది. 27 మంది విద్యార్థులకు కరోనా వైరస్‌ సోకింది. ఇటీవల ఇంటికి వెళ్లొచ్చిన ఓ విద్యార్థినికి అస్వస్థతగా ఉండటంతో సిబ్బంది కరోనా పరీక్షలు చేయించారు. ఫలితాల్లో ఆ విద్యార్థినికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ లక్ష్మి... విద్యార్థినులందరికీ పరీక్షలు చేయించగా 27మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. తొలుత 13 మందికి పాజిటివ్ రాగా... ఆ తర్వాత మరో 14 మందికి సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారందరినీ ఇళ్లకు పంపించారు. ఈ విషయం తెలిసిన మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇళ్లకు తీసుకెళ్లారు.

తల్లిదండ్రుల్లో ఆందోళన

సెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో కాస్త భయంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు పాఠశాలలోని వసతి గృహాలకు చేరుకున్నారు. ఇక అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. అంతేకాకుండా పాఠశాలల్లోనూ కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలు స్కూళ్లలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్​గా నిర్ధరణ అవుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

'ఒమిక్రాన్​' డెల్టా కంటే డేంజర్ అని ఇప్పుడే చెప్పలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.