ETV Bharat / business

Gas Prices Hike : రేట్లు పెంచిన గ్యాస్​ కంపెనీలు.. సిలిండర్​ ధర ఎంతంటే?

author img

By

Published : Jul 4, 2023, 12:33 PM IST

Updated : Jul 4, 2023, 1:01 PM IST

Commercial Gas Prices Hike : కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్ల ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​పై అదనంగా రూ.7 వరకు పెంచాయి. గృహ వినియోగ గ్యాస్​ సిలిండర్ల ధరలు ఎలా ఉన్నాయంటే?

Gas prices hike
Commercial LPG gas cylinder price increased by 7 know new price

Gas Prices Hike : ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్య ప్రజలకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్​పీజీ సిలిండర్ల ధరలను రూ.7 వరకు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనితో దిల్లీలో 19కేజీల ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.1773 నుంచి రూ.1780కు పెరిగింది. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను మాత్రం స్థిరంగానే ఉంచాయి ఆయిల్ సంస్థలు.

పెరిగిన కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్ ధరలు
Commercial LPG Cylinder Price : సామాన్యంగా ప్రతి నెల 1వ తేదీన గ్యాస్​ రేట్లలో మార్పు చేసే ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు మూడు రోజులు గ్యాప్​ ఇచ్చి అందరికీ షాక్​ ఇచ్చాయి. గ్యాస్​ సిలిండర్లపై పెంచిన ధరలు జులై 1 నుంచే అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రూ.1725 ఉన్న గ్యాస్​ సిలిండర్​ ధర ఇప్పుడు రూ.1732కు పెరిగింది. అలాగే కోల్​కతాలో గ్యాస్​ సిలిండర్ ధర రూ.1875.50 నుంచి రూ.1882.50 చేరింది. చెన్నైలో వాణిజ్య సిలిండర్​ ధర రూ. 1937 నుంచి రూ.1944కు పెరిగింది. పెరిగిన కమర్షియల్​ గ్యాస్​ ధరల వల్ల మార్కెట్​లో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా దుకాణదారులు, హోటల్​ యజమానులపై ఈ గ్యాస్​ ధరల పెరుగుదల భారం పడనుంది.

గృహ వినియోగ ఎల్​పీజీ ధరల పరిస్థితి ఏంటి?
Domestic LPG Cylinder Price : సామాన్య ప్రజలు ఇళ్లలో ఉపయోగించుకునే గ్యాస్​ సిలిండర్ల ధరల్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదు. డొమెస్టిక్​ గ్యాస్​ సిలిండర్ ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్​లో రూ.1,155గా ఉంది. దిల్లీలో గ్యాస్​ సిలిండర్​ ధర రూ.1,103, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50గా ఉంది. బెంగళూరులో రూ.1,105.0, శ్రీనగర్​లో రూ.1219లుగా గృహ వినియోగ గ్యాస్​ సిలిండర్ల ధరలు ఉన్నాయి.

పెట్రోల్ ధరల్లో మార్పు లేదు..
ఆయిల్ కంపెనీలు గత 15 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా.. డీజిల్ ధర రూ.89.62గానే ఉంది.

విమాన ఇంధన ధరలు మారలేదు..
జులై నెలలో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరల్లో స్వల్ప మార్పులు వచ్చాయి. సాధారణ ధర కంటే 1.65 శాతం విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర పెరిగింది. దీనితో ప్రస్తుతం ఏటీఎఫ్ ధర కిలోలీటర్​కు రూ. 1,476.79 పెరిగి రూ.90,779.88కు చేరింది. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్​ ఆధారంగా ఈ ధర మారుతూ ఉంటుంది. చివరిసారిగా ఈ ఏటీఎఫ్ ధర జూన్ 1న కిలోలీటరుకు రూ.6,632.25 మేర తగ్గింది.

Gas Prices Hike : ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్య ప్రజలకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్​పీజీ సిలిండర్ల ధరలను రూ.7 వరకు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనితో దిల్లీలో 19కేజీల ఎల్​పీజీ సిలిండర్ ధర రూ.1773 నుంచి రూ.1780కు పెరిగింది. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను మాత్రం స్థిరంగానే ఉంచాయి ఆయిల్ సంస్థలు.

పెరిగిన కమర్షియల్​ ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్ ధరలు
Commercial LPG Cylinder Price : సామాన్యంగా ప్రతి నెల 1వ తేదీన గ్యాస్​ రేట్లలో మార్పు చేసే ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు మూడు రోజులు గ్యాప్​ ఇచ్చి అందరికీ షాక్​ ఇచ్చాయి. గ్యాస్​ సిలిండర్లపై పెంచిన ధరలు జులై 1 నుంచే అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశాయి.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రూ.1725 ఉన్న గ్యాస్​ సిలిండర్​ ధర ఇప్పుడు రూ.1732కు పెరిగింది. అలాగే కోల్​కతాలో గ్యాస్​ సిలిండర్ ధర రూ.1875.50 నుంచి రూ.1882.50 చేరింది. చెన్నైలో వాణిజ్య సిలిండర్​ ధర రూ. 1937 నుంచి రూ.1944కు పెరిగింది. పెరిగిన కమర్షియల్​ గ్యాస్​ ధరల వల్ల మార్కెట్​లో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా దుకాణదారులు, హోటల్​ యజమానులపై ఈ గ్యాస్​ ధరల పెరుగుదల భారం పడనుంది.

గృహ వినియోగ ఎల్​పీజీ ధరల పరిస్థితి ఏంటి?
Domestic LPG Cylinder Price : సామాన్య ప్రజలు ఇళ్లలో ఉపయోగించుకునే గ్యాస్​ సిలిండర్ల ధరల్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదు. డొమెస్టిక్​ గ్యాస్​ సిలిండర్ ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్​లో రూ.1,155గా ఉంది. దిల్లీలో గ్యాస్​ సిలిండర్​ ధర రూ.1,103, ముంబైలో రూ.1,102.50, చెన్నైలో రూ.1,118.50గా ఉంది. బెంగళూరులో రూ.1,105.0, శ్రీనగర్​లో రూ.1219లుగా గృహ వినియోగ గ్యాస్​ సిలిండర్ల ధరలు ఉన్నాయి.

పెట్రోల్ ధరల్లో మార్పు లేదు..
ఆయిల్ కంపెనీలు గత 15 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 ఉండగా.. డీజిల్ ధర రూ.89.62గానే ఉంది.

విమాన ఇంధన ధరలు మారలేదు..
జులై నెలలో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరల్లో స్వల్ప మార్పులు వచ్చాయి. సాధారణ ధర కంటే 1.65 శాతం విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర పెరిగింది. దీనితో ప్రస్తుతం ఏటీఎఫ్ ధర కిలోలీటర్​కు రూ. 1,476.79 పెరిగి రూ.90,779.88కు చేరింది. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక అమ్మకపు పన్ను లేదా వ్యాట్​ ఆధారంగా ఈ ధర మారుతూ ఉంటుంది. చివరిసారిగా ఈ ఏటీఎఫ్ ధర జూన్ 1న కిలోలీటరుకు రూ.6,632.25 మేర తగ్గింది.

Last Updated : Jul 4, 2023, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.