అత్యవసర సమయాల్లో జలాంతర్గామి నుంచి సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఈ తరహా ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుంది. డీస్ సబ్ మెర్జన్స్ రెస్క్యూ వెహికల్ విశాఖ కేంద్రంగా నౌకాదళం సమకూర్చుకుంది. సముద్ర గర్భంలో లోతున ఉన్న జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధుధవజ్ నుంచి ఈ ప్రత్యేక నౌక ద్వారా సిబ్బందిని బదిలీ చేయగలిగారు. ఈ ఆపరేషన్ మొత్తం పూర్తిగా దేశీయ నిపుణుల పర్యవేక్షణలోనే జరగడం విశేషం. హిందూ మహాసముద్రం ప్రాంతంలో పెరుగుతున్న నౌకాదళ అవసరాల దృష్ట్యా ఈ తరహా అపరేషన్ అవసరం ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నందున దానికి సన్నద్దతగా చేసిన ప్రక్రియ విజయవంతం కావడంతో అధికార వర్గాలు సంతృప్తి ప్రకటించాయి. తూర్పు తీరంలో ఈ రకమైన శిక్షణ కార్యక్రమం నౌకాదళ సిబ్బంది, ప్రత్యేకించి జలాంతర్గామి సిబ్బంది ధైర్యం మరింతగా పెంచుతోంది. ఈ కొత్త సామర్ధ్యాన్ని భారత నౌకాదళం సమకూర్చుకోవడంతో మరో హంగు నౌకాదళానికి చేరినట్టయింది.
![submarine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3484016_giridhar.png)