ETV Bharat / briefs

నాగేశ్వర్​రావుకు పగలే చుక్కలు చూపించిన సుప్రీం

కేంద్ర దర్యాప్తు సంస్థకు తాత్కాలిక డైరెక్టర్​గా పనిచేసిన నాగేశ్వరరావుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణపై లక్ష రూపాయల జరిమానా విధించింది.

author img

By

Published : Feb 12, 2019, 4:04 PM IST

సుప్రీం

కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వరరావుతో పాటు డైరెక్టర్​ ఆఫ్​ ప్రాసిక్యూషన్​ బసూరామ్​లను కోర్టు సమయం ముగిసేవరకు హాలులోనే ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు చెరో రూ.1లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. బిహార్​లోని ముజఫర్​పూర్​ వసతిగృహం అత్యాచార ఘటనల కేసు దర్యాప్తు అధికారి బదిలీ విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడటంపై ఇరువురికీ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఈ కేసులో దర్యాప్తు అధికారిని తప్పించొద్దంటూ గతంలో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ఆ కేసును విచారిస్తోన్న సీబీఐ జాయింట్​ డైరెక్టర్​ ఏకే శర్మను బదిలీ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నాగేశ్వరరావు బేషరతు క్షమాపణలు చెప్పారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ కూడా కోర్టుకు విన్నవించారు. సుప్రీం ఈ అభ్యర్థనను తిరస్కరించింది.

కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వరరావుతో పాటు డైరెక్టర్​ ఆఫ్​ ప్రాసిక్యూషన్​ బసూరామ్​లను కోర్టు సమయం ముగిసేవరకు హాలులోనే ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు చెరో రూ.1లక్ష జరిమానా చెల్లించాలని ఆదేశించింది. బిహార్​లోని ముజఫర్​పూర్​ వసతిగృహం అత్యాచార ఘటనల కేసు దర్యాప్తు అధికారి బదిలీ విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడటంపై ఇరువురికీ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

ఈ కేసులో దర్యాప్తు అధికారిని తప్పించొద్దంటూ గతంలో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ఆ కేసును విచారిస్తోన్న సీబీఐ జాయింట్​ డైరెక్టర్​ ఏకే శర్మను బదిలీ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నాగేశ్వరరావు బేషరతు క్షమాపణలు చెప్పారు. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ కూడా కోర్టుకు విన్నవించారు. సుప్రీం ఈ అభ్యర్థనను తిరస్కరించింది.


Jaipur (Rajasthan), Feb 12 (ANI): Posters of Congress president Rahul Gandhi, Congress General Secretary for Uttar Pradesh East Priyanka Gandhi and Robert Vadra were seen outside the Enforcement Directorate (ED) office in Rajasthan's Jaipur. Vadra and his mother Maureen Vadra will be questioned today by ED officials in connection with Bikaner land case probe. Priyanka also went to Jaipur to be with Vadra ahead of ED questioning.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.