ETV Bharat / briefs

దాపరికాలు లేని పాలన అందిస్తాం : రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సొంత జిల్లా తూర్పుగోదావరికి వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్​కు వైకాపా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ర్యాలీగా వెళ్లి..తమ అభిమానాన్ని చాటుకున్నారు. స్వాగతం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన...అవినీతి రహిత పాలనే సీఎం దిశానిర్దేశమని గుర్తుచేశారు.

author img

By

Published : Jun 11, 2019, 6:46 AM IST

రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్


రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా సొంత జిల్లా తూర్పుగోదావరికి వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్​కు వైకాపా అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండెపూడి చిట్టిబాబు, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం ఎంపీ చింతా అనురాధలు...జిల్లా ముఖద్వారం రావులపాలెంలో ఆయనకు స్వాగతం పలికారు.

రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి సుభాష్ చంద్రబోస్...అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెండర్ల ప్రక్రియను పారదర్శంగా మారుస్తామని హామీఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. హామీల నెరవేర్చే విషయంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని...ఆర్థికవేత్తలు, నిపుణుల సలహాలు తీసుకుంటామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో 1100 జీవోలు విడుదలయ్యాయన్న మంత్రి...వాటిని రహస్యంగా ఉంచారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం దాపరికాలు లేని పాలన అందిస్తుందన్నారు.

మీడియా సమావేశం అనంతరం మంత్రి రాజమహేంద్రవరం మీదుగా రామచంద్రపురం వెళ్లారు. వైకాపా అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా ఆయనను అనుసరించారు.

ఇవీ చూడండి : రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి రుతుపవనాలు


రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా సొంత జిల్లా తూర్పుగోదావరికి వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్​కు వైకాపా అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండెపూడి చిట్టిబాబు, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం ఎంపీ చింతా అనురాధలు...జిల్లా ముఖద్వారం రావులపాలెంలో ఆయనకు స్వాగతం పలికారు.

రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి సుభాష్ చంద్రబోస్...అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెండర్ల ప్రక్రియను పారదర్శంగా మారుస్తామని హామీఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. హామీల నెరవేర్చే విషయంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని...ఆర్థికవేత్తలు, నిపుణుల సలహాలు తీసుకుంటామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో 1100 జీవోలు విడుదలయ్యాయన్న మంత్రి...వాటిని రహస్యంగా ఉంచారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం దాపరికాలు లేని పాలన అందిస్తుందన్నారు.

మీడియా సమావేశం అనంతరం మంత్రి రాజమహేంద్రవరం మీదుగా రామచంద్రపురం వెళ్లారు. వైకాపా అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా ఆయనను అనుసరించారు.

ఇవీ చూడండి : రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి రుతుపవనాలు

Intro:ATP:- అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో భ్రూణ హత్య జరిగిందన్న అంశంపై వివాదం రేగింది. పెద్దపప్పూరు మండలం, సోమనేపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణీ మహిళ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చింది. అయితే ఆమెకు అప్పటికే ఒక కూతురు ఉంది. లింగ నిర్ధారణ అనంతరం కడుపులో ఉన్నది ఆడ బిడ్డగా తేలింది. అయితే అప్పటికే ఆడపిల్ల ఉన్నదన్న కారణంతో అబార్షన్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.


Body: ఈ విషయం బయటకు తెలియడంతో ప్రభుత్వ అధికారులు ఆస్పత్రి వద్దకు వచ్చారు. జిల్లా వైద్య అధికారి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అబార్షన్ అయిన మాట వాస్తవమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే బాధితురాలి ఆరోగ్యం సరిగా లేక రక్తస్రావం కావడంతో ఆమెకి అబార్షన్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు.


Conclusion:కానీ రెండవ సారి ఆడపిల్ల అన్న కారణంగానే బృన హత్యకు పాల్పడినట్లు పలువురు ఆరోపించారు. ఆసుపత్రిలో లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదు నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ నగరంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా నేను లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఈ సంఘటన ఆరోపణలకు బలం చేకూరుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, అనంతరం తగు చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అనిల్ కుమార్ తెలిపారు.

బైట్స్....1. అనిల్ కుమార్, జిల్లా వైద్యాధికారి, అనంతపురం జిల్లా.
2.... రాజ్యలక్ష్మి , వైద్యురాలు కార్పొరేట్ ఆసుపత్రి అనంతపురం.


అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.