ETV Bharat / briefs

ఎలుకల మందు రుచి చూసి..చనిపోయాడు..! - ap latest ap news

ఎలుకల నివారణ మందు పనిచేస్తుందో లేదోనని నిర్లక్ష్యంతో నాలుకపై వేసుకుని రుచి చూసిన యువకుడు మృతి  చెందాడు.  ఈ విషాద ఘటన ముసునూరు  చర్చిలో శనివారం జరిగింది.

ఎలుకల మందు రుచి చూసి..చనిపోయాడు..!
author img

By

Published : Jun 17, 2019, 4:20 AM IST

కృష్ణా జిల్లా ముసునూరులో విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జాస్‌పూర్‌ జిల్లా పాతల్‌గో మండలంలోని ఈకెరా గ్రామానికి చెందిన రాబర్ట్‌ కిస్పోటా... గత కొంతకాలంగా ముసునూరు చర్చిలో పాస్టర్‌గా శిక్షణ పొందుతున్నాడు. ఇక్కడ ఎలుకల బెడద నివారణకు మందు తీసుకొచ్చారు. అది కొత్తగా ఉందని ..పనిచేస్తుందో లేదోనని ఈనెల 9వ తేదీన కొద్దిగా నాలుకపై రాసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే దాన్ని ఉమ్మేసి.. ముఖం కడుక్కుని ఏమీ కాదనే ధీమాతో ఉన్నాడు...రాబర్ట్​.
మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్న యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నూజివీడు అమెరికన్‌ ఆసుపత్రికి అటునుంచి మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరి రంజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

కృష్ణా జిల్లా ముసునూరులో విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జాస్‌పూర్‌ జిల్లా పాతల్‌గో మండలంలోని ఈకెరా గ్రామానికి చెందిన రాబర్ట్‌ కిస్పోటా... గత కొంతకాలంగా ముసునూరు చర్చిలో పాస్టర్‌గా శిక్షణ పొందుతున్నాడు. ఇక్కడ ఎలుకల బెడద నివారణకు మందు తీసుకొచ్చారు. అది కొత్తగా ఉందని ..పనిచేస్తుందో లేదోనని ఈనెల 9వ తేదీన కొద్దిగా నాలుకపై రాసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వెంటనే దాన్ని ఉమ్మేసి.. ముఖం కడుక్కుని ఏమీ కాదనే ధీమాతో ఉన్నాడు...రాబర్ట్​.
మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్న యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నూజివీడు అమెరికన్‌ ఆసుపత్రికి అటునుంచి మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతుడి సోదరి రంజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

ఎలుకల మందు రుచి చూసి..!

ఇవీ చదవండి..ఆరునెలల గర్భిణీకి నిప్పు... అనుమానంతో భర్త దాష్టికం

Intro:AP_RJY_57_16_AMMAVARI_JATARA_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్:ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఉబలంక లోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది






Body:చిన్నారుల చేత కాగడాలు వెలిగించి అమ్మవారి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ఆయురారోగ్యాలతో సుఖ సంతోషం గా ఉంటారని భక్తుల నమ్మకం. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ అమ్మవారి జాతర కు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి తమ చిన్నారి చేత కాగడాలు వెలిగించారు.



Conclusion:అమ్మవారి గరగ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి జాతర సందర్భంగా ఏర్పాటుచేసిన అఘోరాల వేషధారణ, డప్పు వాయిద్యాలు, కాళికాదేవి వేష దారణలు,బాణసంచా కాల్పు లతో జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా కాల్చిన బాణసంచా కాల్పులు ఎంతో ఆకట్టుకున్నాయి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.