ETV Bharat / briefs

విద్యుత్​ కొనుగోళ్లపై 9మందితో ఉన్నతస్థాయి కమిటీ

రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేందుకు ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక మంత్రి బుగ్గన, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని సహా మొత్తం 9 మంది సభ్యులుగా ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెదేపా హయాంలో సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం వాటిని సమీక్షించి సిఫార్సులు చేసేందుకుగానూ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

author img

By

Published : Jul 1, 2019, 1:47 PM IST

Updated : Jul 2, 2019, 2:59 AM IST

గత ప్రభుత్వ విద్యుత్తు కొనుగోలుపై ఉన్నతస్థాయి కమిటీ
విద్యుత్​ కొనుగోళ్లపై 9మందితో ఉన్నతస్థాయి కమిటీ

సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని భావిస్తున్న ప్రభుత్వం.. వాటిని అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఓ ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు మంత్రులు సహా 9 మందితో ఓ ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీ నియమిస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీ సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితోపాటు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ , ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ , ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ఏపీ ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్ రెడ్డి, ఏపీ ట్రాన్స్ కో సీఎండీలు కన్వీనర్లుగా ఈ కమిటీని నియమించారు. మార్కెట్‌లో తక్కువ ధరకు సౌర, పవన విద్యుత్ లభిస్తున్నా ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకోవటంపై సమీక్ష చేసి ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనుంది. రాష్ట్రంలోని 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు సౌర, పవన విద్యుత్‌లను విక్రయిస్తున్న కంపెనీలతో సంప్రదించి తక్కువ ధర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడటంతోపాటు సమీప భవిష్యత్తులో విద్యుత్ ధరలు, ఒప్పందాలకు సంబంధించి మెరుగైన సిఫార్సులను చేసేలా ఈ కమిటీ కార్యాచరణ ఉండనుంది. దేశంలో ఎక్కడెక్కడ సౌర, పవన విద్యుత్ ధరలు తక్కువగా ఉన్నాయో పరిశీలించి వాటిన ప్రామాణికంగా తీసుకుని పీపీఏలను సమీక్షించాలని ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి కమిటీకి సూచించింది. అదే సమయంలో ఏపీ జెన్‌కో ఉత్పత్తి కేంద్రాలు, రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు యూనిట్ ధరకు ఎంత ఖర్చు అవుతోందన్న అంశాలనూ ఈ కమిటీ పరిశీలించి తదుపరి సిఫార్సులు చేయనుంది

ఇదీ చదవండి : రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

విద్యుత్​ కొనుగోళ్లపై 9మందితో ఉన్నతస్థాయి కమిటీ

సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని భావిస్తున్న ప్రభుత్వం.. వాటిని అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఓ ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు మంత్రులు సహా 9 మందితో ఓ ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీ నియమిస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీ సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితోపాటు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ , ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ , ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ఏపీ ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్ రెడ్డి, ఏపీ ట్రాన్స్ కో సీఎండీలు కన్వీనర్లుగా ఈ కమిటీని నియమించారు. మార్కెట్‌లో తక్కువ ధరకు సౌర, పవన విద్యుత్ లభిస్తున్నా ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకోవటంపై సమీక్ష చేసి ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనుంది. రాష్ట్రంలోని 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు సౌర, పవన విద్యుత్‌లను విక్రయిస్తున్న కంపెనీలతో సంప్రదించి తక్కువ ధర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడటంతోపాటు సమీప భవిష్యత్తులో విద్యుత్ ధరలు, ఒప్పందాలకు సంబంధించి మెరుగైన సిఫార్సులను చేసేలా ఈ కమిటీ కార్యాచరణ ఉండనుంది. దేశంలో ఎక్కడెక్కడ సౌర, పవన విద్యుత్ ధరలు తక్కువగా ఉన్నాయో పరిశీలించి వాటిన ప్రామాణికంగా తీసుకుని పీపీఏలను సమీక్షించాలని ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి కమిటీకి సూచించింది. అదే సమయంలో ఏపీ జెన్‌కో ఉత్పత్తి కేంద్రాలు, రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు యూనిట్ ధరకు ఎంత ఖర్చు అవుతోందన్న అంశాలనూ ఈ కమిటీ పరిశీలించి తదుపరి సిఫార్సులు చేయనుంది

ఇదీ చదవండి : రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Intro:ap_vzm_36_01_vutchita_vyadyam_avb_ap10085 70 పరమావధిగా వైద్యరంగం సాగుతున్న తరుణంలో ఆయన ఉచితంగా సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు చదువుకున్న చదువుకు సార్ దగ్గర చేకూర్చాలని విశ్రాంత సమయంలోనూ పేదలు వృద్ధులు దివ్యాంగులకు పూర్తి సేవలందిస్తూ మానసిక సంతృప్తిని ఆస్వాదిస్తున్నారు


Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ప్రధాన రహదారిలో తన సొంత ఇంటిలో ఆసుపత్రి నడుపుతూ ఉచిత సేవలు అందిస్తున్నారు డాక్టర్ కె వి రామారావు వైద్య సేవలకు దూరం కాకూడదు అన్న ఆలోచనతో అప్పట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పదోన్నతి లభించినప్పటికీ అందుకు సమ్మతి తెలపకుండా వైద్యుని గానే ఉండిపోయి సేవలతో తరలించారు 1961లో లో శ్రీ కాకుళం లోని పెద్దాసుపత్రిలో వైద్యునిగా సేవలు ప్రారంభించారు ఆ జిల్లాలోని సోంపేట ఇచ్ఛాపురం తో పాటు విజయనగరం జిల్లాలో బొబ్బిలి పార్వతీపురం కురుపాం ప్రాంతాల్లో సేవలందించారు ప్రాంతీయ ఆస్పత్రిలో పదేళ్లపాటు సూపరింటెండెంట గా గా బాధ్యతలు నిర్వర్తించారు ఆ సమయంలో లో dm&ho గా పదోన్నతి లభించింది అడ్మినిస్ట్రేషన్ విభాగానికి వెళితే తే దూరం కావాల్సి వస్తుందని వద్దనుకున్నారు పదవీ విరమణ చేశాక గ్రామాలకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించడం ప్రారంభించారు ప్రతి ఆదివారం పార్వతీపురం సమీపంలోని దాలి నాయుడు వలస గ్రామానికి వెళ్లి ఉచితంగా వైద్యం అందించే వాళ్ళు 80 ఏళ్లు పైబడి డంతో ఇంటి వద్దే ఉంటూ ప్రతి ఆదివారం ఉచిత సేవలు అందిస్తున్నారు దివ్యాంగులు వృద్ధులకు ఎప్పుడు వచ్చినా ఉచిత సేవలు సేవ చేయాలనే ఆలోచనతో వైద్య విద్య చదివామని ఆ బాటలో సాగితే మానసిక సంతృప్తి లభిస్తుందని డాక్టర్ రామారావు అంటున్నారు సేవలో వచ్చే సంతృప్తి మరి దేని లోనూ రాదని తనకు తోచిన ఉచిత సేవలు అందిస్తున్నట్లు చెబుతున్నారు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా లైన్స్ క్లబ్ అయినను ఘనంగా సన్మానించింది ఉచిత సేవలు అందిస్తున్నందుకు అనేక సంస్థలు ఆయనను అభినందించాయి ఆయనకు కు ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతురు వైద్యురాలిగా స్థిరపడ్డారు కొడుకులు అమెరికాలో లో సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు


Conclusion:డాక్టర్ రామారావు సేవలందిస్తున్న ఆసుపత్రి ఉచిత సేవలు పొందేందుకు వచ్చిన రోగులు రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ రామారావు ఆయన సేవలకు గుర్తింపుగా దక్కిన మెమొంటోలు మాట్లాడుతున్న డాక్టర్ రామారావు మాట్లాడుతున్న రోగులు
Last Updated : Jul 2, 2019, 2:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.