కేరళలోని కున్నంకుళం ఫాస్ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు ఓ అత్యాచార నిందితుడికి 50 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.60,000 జరిమానా విధించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. 2018లో కున్నంకుళంలోని పోర్కులానికి చెందిన సయూజ్ అనే యువకుడు అదే ప్రాంతంలో ఉంటున్న ఓ బాలిక ఇంట్లోకి వెళ్లి బలవంతంగా ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చంపేస్తానని బెదిరించాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత ఆమెను తల్లిదండ్రులు ఆరా తీయగా విషయం బయటపెట్టింది.

వెంటనే బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసిన పోలీసులు సయూజ్ను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన ఫాస్ట్రాక్ స్పెషల్ పోక్సో కోర్టు అతడికి 50 ఏళ్ల జైలుశిక్ష, రూ.60,000 జరిమానా విధించింది.
ఇవీ చదవండి:గుండెపోటుతో యువ రెజ్లర్ మృతి.. వాకింగ్ చేసి వస్తుండగా అక్కడికక్కడే..