ETV Bharat / bharat

ప్రపంచంలోనే ఎత్తైన దేవాలయం.. 504 అడుగులతో నిర్మాణం.. ఎక్కడో తెలుసా?

author img

By

Published : Jul 10, 2023, 11:55 AM IST

World Tallest Temple : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం గుజరాత్​లో ఏర్పాటు కానుంది. 504 అడుగుల ఎత్తుతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని వచ్చే ఐదేళ్లలోనే పూర్తి చేయాలనే సంకల్పంతో పని చేస్తున్నారు.

World Tallest Temple
World Tallest Temple

World Tallest Temple : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం గుజరాత్ అహ్మదాబాద్​లో రూపొదిద్దుకుంటోంది. ఈ అత్యంత ఎత్తైన ఈ ఆలయాన్ని జస్పూర్​ గ్రామంలో నిర్మిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గుడిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పాటు ప్రపంచంలోనే రెండో పెద్ద ట్రీ మ్యూజియంను సైతం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విశ్వ ఉమియా ధామ్​ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది. ఇందుకోసం పాటీదార్​ సమాజానికి చెందిన ట్రస్టు సభ్యులు ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాలయ నిర్మాణ శైలిపై చర్చించారు.

Umiya Mata Temple Ahmedabad : సుమారు 504 అడుగుల ఎత్తుతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి ఈ గుడిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఇండో-జర్మన్​ సాంకేతికతను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాలు, వరదలను సైతం తట్టుకుని ఉండేలా దీని నిర్మాణం చేస్తున్నారు. 504 అడుగుల ఎత్తున్న ఈ ఆలయంలో 270 అడుగుల వద్ద గ్యాలరీ పాయింట్​ను ఏర్పాటు చేయనున్నారు. ఉమియా మాతాజీ సింహాసనాన్ని 51 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు. ఉమియా మాతాజీ విగ్రహంతో పాటు పరానా శివలింగాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. వృద్ధులు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకునేలా ఎస్కలేటర్​ను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ ఆలయానికి వచ్చే పర్యటకుల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 3,500 వాహనాలు ఏకకాలంలో పార్క్ చేసే సౌకర్యాన్ని కల్పించారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద పార్కింగ్​ ప్రదేశం అవుతుందని నిర్వాహకులు చెప్పారు.

World Tallest Temple
ఎత్తైన ఆలయం నమూనా చిత్రం

"ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది కేవలం పాటీదార్ సమాజానికి చెందినది మాత్రమే కాదు. ప్రతి సమాజానికి ఈ దేవాలయం చెందుతుంది. నిర్మాణం అనంతరం ఈ గుడి.. పర్యటక ప్రాంతంగా మారుతుంది. కేవలం గుజరాత్​, భారత్​లోని భక్తులే కాకుండా ప్రపంచంలో ఉన్న పర్యటకులు.. ఈ గుడిని చూసేందుకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటకులకు ఇది గమ్యం కానుంది. ఈ ఆలయం భవిష్యత్తులో కొత్త వింతగా మారినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు."
-ఆర్​పీ పటేల్, విశ్వ ఉమియా ధామ్​ అధ్యక్షుడు

ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయమూ మన దగ్గరే..
Virat Ramayan Mandir : మరోవైపు బిహార్​లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం రూపుదిద్దుకుంటోంది. దీని నిర్మాణం కూడా ప్రారంభమైంది. విరాట్ రామాయణ మందిరంగా పేర్కొంటున్న ఈ ఆలయం తూర్పు చంపారణ్ జిల్లా, కల్యాణ్​పుర్ బ్లాక్​లోని కైథవలియా గ్రామంలో నిర్మిస్తున్నారు. 2025 నాటికి ఈ ఆలయాన్ని పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు. పట్నా మహావీర్ మందిర్ న్యాస్ సమితి అధినేత ఆచార్య కిశోర్ కునాల్ నేతృత్వంలో జరిగిన పూజాకార్యక్రమాలతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. పూజాకార్యక్రమాలు నిర్వహించి.. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో నిర్మాణ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి : అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం సందర్శనకు సామాన్యులకూ అనుమతి

ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఆలయం భారత్​లోనే.. త్వరలో ప్రారంభం

World Tallest Temple : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం గుజరాత్ అహ్మదాబాద్​లో రూపొదిద్దుకుంటోంది. ఈ అత్యంత ఎత్తైన ఈ ఆలయాన్ని జస్పూర్​ గ్రామంలో నిర్మిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ గుడిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతో పాటు ప్రపంచంలోనే రెండో పెద్ద ట్రీ మ్యూజియంను సైతం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విశ్వ ఉమియా ధామ్​ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది. ఇందుకోసం పాటీదార్​ సమాజానికి చెందిన ట్రస్టు సభ్యులు ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాలయ నిర్మాణ శైలిపై చర్చించారు.

Umiya Mata Temple Ahmedabad : సుమారు 504 అడుగుల ఎత్తుతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.వెయ్యి కోట్లు వెచ్చించి ఈ గుడిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఇండో-జర్మన్​ సాంకేతికతను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాలు, వరదలను సైతం తట్టుకుని ఉండేలా దీని నిర్మాణం చేస్తున్నారు. 504 అడుగుల ఎత్తున్న ఈ ఆలయంలో 270 అడుగుల వద్ద గ్యాలరీ పాయింట్​ను ఏర్పాటు చేయనున్నారు. ఉమియా మాతాజీ సింహాసనాన్ని 51 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు. ఉమియా మాతాజీ విగ్రహంతో పాటు పరానా శివలింగాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. వృద్ధులు సైతం ఈ ఆలయాన్ని దర్శించుకునేలా ఎస్కలేటర్​ను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ ఆలయానికి వచ్చే పర్యటకుల పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 3,500 వాహనాలు ఏకకాలంలో పార్క్ చేసే సౌకర్యాన్ని కల్పించారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద్ద పార్కింగ్​ ప్రదేశం అవుతుందని నిర్వాహకులు చెప్పారు.

World Tallest Temple
ఎత్తైన ఆలయం నమూనా చిత్రం

"ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది కేవలం పాటీదార్ సమాజానికి చెందినది మాత్రమే కాదు. ప్రతి సమాజానికి ఈ దేవాలయం చెందుతుంది. నిర్మాణం అనంతరం ఈ గుడి.. పర్యటక ప్రాంతంగా మారుతుంది. కేవలం గుజరాత్​, భారత్​లోని భక్తులే కాకుండా ప్రపంచంలో ఉన్న పర్యటకులు.. ఈ గుడిని చూసేందుకు వస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యటకులకు ఇది గమ్యం కానుంది. ఈ ఆలయం భవిష్యత్తులో కొత్త వింతగా మారినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు."
-ఆర్​పీ పటేల్, విశ్వ ఉమియా ధామ్​ అధ్యక్షుడు

ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయమూ మన దగ్గరే..
Virat Ramayan Mandir : మరోవైపు బిహార్​లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం రూపుదిద్దుకుంటోంది. దీని నిర్మాణం కూడా ప్రారంభమైంది. విరాట్ రామాయణ మందిరంగా పేర్కొంటున్న ఈ ఆలయం తూర్పు చంపారణ్ జిల్లా, కల్యాణ్​పుర్ బ్లాక్​లోని కైథవలియా గ్రామంలో నిర్మిస్తున్నారు. 2025 నాటికి ఈ ఆలయాన్ని పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు. పట్నా మహావీర్ మందిర్ న్యాస్ సమితి అధినేత ఆచార్య కిశోర్ కునాల్ నేతృత్వంలో జరిగిన పూజాకార్యక్రమాలతో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. పూజాకార్యక్రమాలు నిర్వహించి.. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో నిర్మాణ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి : అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం సందర్శనకు సామాన్యులకూ అనుమతి

ప్రపంచంలో అతిపెద్ద హిందూ ఆలయం భారత్​లోనే.. త్వరలో ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.