ETV Bharat / bharat

అనుకోని మైత్రితో పునాది- కశ్మీర్​కు సైకిల్​పై సవారీ - Kerala to Kashmir by cycle ride news

కేరళ నుంచి కశ్మీర్‌కు సైకిల్​తో ప్రయాణమంటే.. వినేవారికి చమత్కారంగా అనిపిస్తుంది. అయితే ఎలాంటి సంబంధం లేని.. కేరళకు చెందిన ఇద్దరు యువకులు వేర్వేరు ప్రాంతాల నుంచి సైకిల్​పై కశ్మీర్​కు బయలుదేరారు. యాదృచ్ఛికంగా ఓ ప్రదేశంలో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వారెవరు? వారి కథేంటో చూద్దాం.

Two Kerala youth meet on their trip to Kashmir; embark journey together
అనుకోలేదేనాడు ఆ ఇద్దరు సైకిల్​పై కశ్మీర్​కు వెళ్లాలని!
author img

By

Published : Jan 23, 2021, 8:02 PM IST

సైకిల్​తో కేరళ నుంచి కశ్మీర్​కు

కేరళ నుంచి కశ్మీర్​కు సైకిల్​పై బయలుదేరారు ఇద్దరు యువకులు. అయితే వీరిద్దరు ఒక ప్రాంతానికి చెందినవారు కారు. అలా అని సన్నిహితులూ కారు. కానీ వారి ఆకాంక్ష మాత్రం ఒక్కటే. అదే.. సైకిల్​పై కశ్మీర్​కు ప్రయాణించడం.. దారిలో వివిధ ప్రాంతాలను సందర్శించడం. అనుకోకుండా వీరి దారులు కలిశాయి. ఆ తర్వాత వీరి ప్రయాణం ఒక్కటైంది.

కొన్ని రోజుల క్రితం పాలక్కడ్​ జిల్లా పట్టాంబి నుంచి శ్రీజిత్​, ఓ వారం కిందట తిరువునంతపురం నుంచి జిబిన్​ జార్జ్ తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ ఇద్దరూ అనుకోకుండా కొజికోడ్​ వద్ద కలుసుకున్నారు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అనంతరం గమ్యస్థానానికి కలిసే చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో భారత్​లోని వివిధ ప్రదేశాలను సందర్శించి, ప్రజలను కలుసుకోవాలని వారు భావిస్తున్నారు.

ఎన్ని రోజుల్లో తమ గమ్యాన్ని చేరుకుంటారన్న విషయంపై.. ఇద్దరిదీ ఒకటే మాట. తమకు రోజులు కాదు.. ప్రయాణాన్ని ఆస్వాదించడమే ముఖ్యమని చెప్పారు.

తాము రోజుకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలమో, ఎప్పుడు తమ సొంత ఊరుకు తిరిగి చేరుకుంటామో చెప్పలేమన్నారు. దీనిపై ఎలాంటి ప్రణాళిక లేదని పేర్కొన్నారు. అయితే కశ్మీర్​ నుంచి తిరుగు ప్రయాణంలో ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా కేరళ చేరుకుంటామని చెప్పారు.

ఇదీ చూడండి: నేతాజీ జయంతి ఉత్సవాల్లో మమత అసహనం

సైకిల్​తో కేరళ నుంచి కశ్మీర్​కు

కేరళ నుంచి కశ్మీర్​కు సైకిల్​పై బయలుదేరారు ఇద్దరు యువకులు. అయితే వీరిద్దరు ఒక ప్రాంతానికి చెందినవారు కారు. అలా అని సన్నిహితులూ కారు. కానీ వారి ఆకాంక్ష మాత్రం ఒక్కటే. అదే.. సైకిల్​పై కశ్మీర్​కు ప్రయాణించడం.. దారిలో వివిధ ప్రాంతాలను సందర్శించడం. అనుకోకుండా వీరి దారులు కలిశాయి. ఆ తర్వాత వీరి ప్రయాణం ఒక్కటైంది.

కొన్ని రోజుల క్రితం పాలక్కడ్​ జిల్లా పట్టాంబి నుంచి శ్రీజిత్​, ఓ వారం కిందట తిరువునంతపురం నుంచి జిబిన్​ జార్జ్ తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ ఇద్దరూ అనుకోకుండా కొజికోడ్​ వద్ద కలుసుకున్నారు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అనంతరం గమ్యస్థానానికి కలిసే చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో భారత్​లోని వివిధ ప్రదేశాలను సందర్శించి, ప్రజలను కలుసుకోవాలని వారు భావిస్తున్నారు.

ఎన్ని రోజుల్లో తమ గమ్యాన్ని చేరుకుంటారన్న విషయంపై.. ఇద్దరిదీ ఒకటే మాట. తమకు రోజులు కాదు.. ప్రయాణాన్ని ఆస్వాదించడమే ముఖ్యమని చెప్పారు.

తాము రోజుకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలమో, ఎప్పుడు తమ సొంత ఊరుకు తిరిగి చేరుకుంటామో చెప్పలేమన్నారు. దీనిపై ఎలాంటి ప్రణాళిక లేదని పేర్కొన్నారు. అయితే కశ్మీర్​ నుంచి తిరుగు ప్రయాణంలో ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా కేరళ చేరుకుంటామని చెప్పారు.

ఇదీ చూడండి: నేతాజీ జయంతి ఉత్సవాల్లో మమత అసహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.