ETV Bharat / bharat

రాజ్యసభకు 55మంది వీడ్కోలు- మన్మోహన్, నడ్డా సహా 9మంది కేంద్రమంత్రులు- ఎన్నికలప్పుడే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 6:54 AM IST

Rajya Sabha Members Retiring In 2024 : వచ్చే ఏడాది ఏప్రిల్​లో 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారిలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అశ్వినీ వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ పదవీ కాలం కూడా ఏప్రిల్​తోనే ముగియనుంది.

Rajya Sabha Members Retiring In 2024
Rajya Sabha Members Retiring In 2024

Rajya Sabha Members Retiring In 2024 : 55 మంది రాజ్యసభ సభ్యులు వచ్చే ఏడాది ఏప్రిల్​లో పదవీ విరమణ చేయనున్నారు. వారిలో అత్యధికంగా 27 మంది బీజేపీకి చెందినవారు కాగా, 10 మంది కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల పార్టీలు భారాస నుంచి ముగ్గురు, తెదేపా, వైకాపాల నుంచి ఒక్కొక్కరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

ఏప్రిల్‌లో ఎగువ సభకు వీడ్కోలు పలకనున్న బీజేపీ నేతల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అశ్వినీ వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, భూపేందర్‌ యాదవ్‌, నారాయణ రాణే, పరుషోత్తమ్‌ రూపాలా, రాజీవ్‌ చంద్రశేఖర్‌, వి.మురళీధరన్‌, ఎల్‌.మురుగన్‌ తదితరులు ఉన్నారు.

మన్మోహన్ మళ్లీ పోటీ చేస్తారా?
ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కమలదళం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్‌ నరసింహారావు పదవీకాలము కూడా ఏప్రిల్‌తో పూర్తికానుంది. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. ఏప్రిల్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మళ్లీ పెద్దల సభకు పోటీ చేయకుండా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో సగం సగం!
అయితే రాజ్యసభకు మార్చిలో జరిగే ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకు ఆరు, సమాజ్‌వాదీ పార్టీకి మూడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలోని ఆరు సీట్లను కమలదళం, ప్రతిపక్షాలు ప్రస్తుతం ఉన్నట్లే సగం సగం పంచుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. బిహార్‌లో జేడీయూ, ఆర్‌జేడీ కూటమి మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడం దాదాపుగా ఖాయమే.

గుజరాత్​లో ఇలా- రాజస్థాన్​లో అలా
గుజరాత్‌లో రెండు సీట్లను కాంగ్రెస్‌ నుంచి బీజేపీ లాగేసుకునే అవకాశాలున్నాయి. కమలనాథులు రాజస్థాన్‌లో కూడా మరో సీటును అధికంగా గెలుచుకుని ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ల్లో ఇప్పుడున్న బలాన్ని నిలబెట్టుకునే వీలుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని స్థానాన్ని హస్తం పార్టీకి కమలదళం కోల్పోనుంది.

వేరే రాష్టానికి నడ్డా!
అందువల్ల ప్రస్తుతం హిమాచల్ ప్రదేశన్​ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేరే రాష్ట్రానికి మారాల్సి వస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ తన బలాన్ని నిలుపుకుని, తెలంగాణలో రెండు సీట్లు లాభపడే వీలుంది. ఇక్కడ భారాస రెండింటిని కోల్పోయి ఒక సీటును నిలబెట్టుకునే సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ఇప్పుడు ఉన్న ఒక సీటుకు అదనంగా మరో రెండు స్థానాలను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లోక్​సభ పని చేసింది 45 గంటలే.. రాజ్యసభ లెక్క ఇదీ..

రాజ్యసభ సభ్యుల్లో 12 శాతం మంది బిలియనర్లే.. తెలుగు రాష్ట్రాల ఎంపీలే టాప్!

Rajya Sabha Members Retiring In 2024 : 55 మంది రాజ్యసభ సభ్యులు వచ్చే ఏడాది ఏప్రిల్​లో పదవీ విరమణ చేయనున్నారు. వారిలో అత్యధికంగా 27 మంది బీజేపీకి చెందినవారు కాగా, 10 మంది కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల పార్టీలు భారాస నుంచి ముగ్గురు, తెదేపా, వైకాపాల నుంచి ఒక్కొక్కరు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

ఏప్రిల్‌లో ఎగువ సభకు వీడ్కోలు పలకనున్న బీజేపీ నేతల్లో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, అశ్వినీ వైష్ణవ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ, భూపేందర్‌ యాదవ్‌, నారాయణ రాణే, పరుషోత్తమ్‌ రూపాలా, రాజీవ్‌ చంద్రశేఖర్‌, వి.మురళీధరన్‌, ఎల్‌.మురుగన్‌ తదితరులు ఉన్నారు.

మన్మోహన్ మళ్లీ పోటీ చేస్తారా?
ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కమలదళం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్‌ నరసింహారావు పదవీకాలము కూడా ఏప్రిల్‌తో పూర్తికానుంది. రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ ఎంపీగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఉన్నారు. ఏప్రిల్‌తో ఆయన పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి మళ్లీ పెద్దల సభకు పోటీ చేయకుండా తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో సగం సగం!
అయితే రాజ్యసభకు మార్చిలో జరిగే ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకు ఆరు, సమాజ్‌వాదీ పార్టీకి మూడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలోని ఆరు సీట్లను కమలదళం, ప్రతిపక్షాలు ప్రస్తుతం ఉన్నట్లే సగం సగం పంచుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. బిహార్‌లో జేడీయూ, ఆర్‌జేడీ కూటమి మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడం దాదాపుగా ఖాయమే.

గుజరాత్​లో ఇలా- రాజస్థాన్​లో అలా
గుజరాత్‌లో రెండు సీట్లను కాంగ్రెస్‌ నుంచి బీజేపీ లాగేసుకునే అవకాశాలున్నాయి. కమలనాథులు రాజస్థాన్‌లో కూడా మరో సీటును అధికంగా గెలుచుకుని ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌ల్లో ఇప్పుడున్న బలాన్ని నిలబెట్టుకునే వీలుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని స్థానాన్ని హస్తం పార్టీకి కమలదళం కోల్పోనుంది.

వేరే రాష్టానికి నడ్డా!
అందువల్ల ప్రస్తుతం హిమాచల్ ప్రదేశన్​ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వేరే రాష్ట్రానికి మారాల్సి వస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ తన బలాన్ని నిలుపుకుని, తెలంగాణలో రెండు సీట్లు లాభపడే వీలుంది. ఇక్కడ భారాస రెండింటిని కోల్పోయి ఒక సీటును నిలబెట్టుకునే సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ఇప్పుడు ఉన్న ఒక సీటుకు అదనంగా మరో రెండు స్థానాలను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లోక్​సభ పని చేసింది 45 గంటలే.. రాజ్యసభ లెక్క ఇదీ..

రాజ్యసభ సభ్యుల్లో 12 శాతం మంది బిలియనర్లే.. తెలుగు రాష్ట్రాల ఎంపీలే టాప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.