ETV Bharat / bharat

కార్తికమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? - పండితులు ఏం చెబుతున్నారు?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 10:11 AM IST

Karthika Masam 2023 : కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే తలస్నానాలు.. పూజలు చేస్తారు. మాంసాహారం తినడం మానేస్తారు. అయితే కార్తిక మాస విశిష్టత ఏంటి? ఈ పవిత్రమైన మాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? ఎవరిని ఆరాధిస్తే.. మరింత పుణ్య ఫలం దక్కుతుందో ఇప్పుడు చూద్దాం..

Karthika Masam 2023
Karthika Masam 2023

Karthika Masam 2023 : అన్ని మాసాల్లోనూ కార్తికమాసానికి ఎంతటి ప్రత్యేకత ఉంటుందో మనకు తెలిసిందే. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాల ద్వారా.. విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలోని ప్రతిరోజునూ పుణ్యదినంగా పరిగణిస్తారు. అందుకే.. భక్తులంతా నిష్టతో పూజలు చేస్తారు. వేకువజామున చేసే పూజలతో ఆలయాలు కళకళలాడుతుంటాయి. అయితే.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ మాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? ఎవరిని ఆరాధిస్తే సరైన పుణ్యఫలం దక్కుతుంది? అనే సందేహాలు భక్తుల్లో ఉంటాయి. వీటికి సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Karthika Masam Significance in Telugu : ప్రతి ఏడాదీ దీపావళి తరువాతి రోజునుంచి ఈ కార్తికం మొదలవుతుంది. చంద్రుడు పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయి. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తికమాసంలో ప్రతిరోజూ ఓ పర్వదినమే. కార్తిక సోమవారాలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఇన్ని కారణాలతోనే.. ఆస్తిక లోకంలో ఈ మాసానికి అంతటి ప్రత్యేకత ఉంటుంది.

భక్తులకు అలర్ట్​ - కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!

ఏ దేవుళ్లను పూజించాలి..?

"'శివాయ విష్ణురూపాయ.. విష్ణురూపాయ శివాయ.." అంటారు. ఎందుకంటే.. పరమశివునికి, విష్ణువుకు ఇద్దరికీ ఈ కార్తిక మాసం ఇష్టమే. అందుకే.. ఈ నెల రోజులూ వీరిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. స్వామివార్లను దర్శించి కార్తికదీపాలు వెలిగిస్తే.. సకల దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. శివార్చనతోపాటు విష్ణు భగవానునికి ప్రీతికరమైన పూజ కార్యక్రమాలు చేయడం ద్వారా.. పూర్వ జన్మలోని దోషాలు తొలగిపోతాయట. భక్తిశ్రద్ధలతో జ్యోతిని వెలిగిస్తే.. అజ్ఞానం తొలగిపోయి.. జ్ఞానం సిద్ధిస్తుందని అర్చకులు చెబుతున్నారు.

అయ్యప్ప సేవలో..

కార్తిక మాసంలో విష్ణువు, పరమేశ్వరుడితోపాటు అయ్యప్ప స్వామిని పూజిస్తే కూడా.. ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. కార్తిక మాసం ఆరంభంతోనే.. లక్షలాదిగా భక్తులు అయ్యప్ప మాల ధరిస్తారు. కారణం ఏంటంటే.. అయ్యప్ప హరిహరసుతుడు అన్న సంగతి తెలిసిందే. మకర సంక్రమణ సమయంలో అయ్యప్పస్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భవిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే.. ఆ జ్యోతిని చూసేందుకు మండలంపాటు(41 రోజులు) దీక్షను చేపట్టి స్వామి సన్నిధానానికి చేరుకుంటారు భక్తులు.

కార్తిక సోమవారం ప్రాధాన్యత : కార్తిక మాసంలోని అన్ని రోజుల్లోనూ ఈ ముగ్గురు దేవుళ్లను అర్చించవచ్చు. అయితే.. ఈ మాసంలో వచ్చే సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం అంటే శివుడికీ ఇష్టం కాబట్టి.. ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి, శివుడిని ఆరాధించి.. సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తరువాత దీపాలను వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలూ కలుగుతాయని అంటారు.

కార్తికమాసం స్పెషల్​ - ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో స్వామివారికి నైవేద్యం పెట్టండి!

కార్తికమాసం-ఈ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైనా దర్శించుకోవాలట!

Karthika Masam 2023 : అన్ని మాసాల్లోనూ కార్తికమాసానికి ఎంతటి ప్రత్యేకత ఉంటుందో మనకు తెలిసిందే. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాల ద్వారా.. విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలోని ప్రతిరోజునూ పుణ్యదినంగా పరిగణిస్తారు. అందుకే.. భక్తులంతా నిష్టతో పూజలు చేస్తారు. వేకువజామున చేసే పూజలతో ఆలయాలు కళకళలాడుతుంటాయి. అయితే.. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ మాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? ఎవరిని ఆరాధిస్తే సరైన పుణ్యఫలం దక్కుతుంది? అనే సందేహాలు భక్తుల్లో ఉంటాయి. వీటికి సమాధానాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Karthika Masam Significance in Telugu : ప్రతి ఏడాదీ దీపావళి తరువాతి రోజునుంచి ఈ కార్తికం మొదలవుతుంది. చంద్రుడు పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తికమనే పేరు వచ్చింది. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీస్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలూ కలుగుతాయి. శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే కార్తికమాసంలో ప్రతిరోజూ ఓ పర్వదినమే. కార్తిక సోమవారాలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఇన్ని కారణాలతోనే.. ఆస్తిక లోకంలో ఈ మాసానికి అంతటి ప్రత్యేకత ఉంటుంది.

భక్తులకు అలర్ట్​ - కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!

ఏ దేవుళ్లను పూజించాలి..?

"'శివాయ విష్ణురూపాయ.. విష్ణురూపాయ శివాయ.." అంటారు. ఎందుకంటే.. పరమశివునికి, విష్ణువుకు ఇద్దరికీ ఈ కార్తిక మాసం ఇష్టమే. అందుకే.. ఈ నెల రోజులూ వీరిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. స్వామివార్లను దర్శించి కార్తికదీపాలు వెలిగిస్తే.. సకల దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. శివార్చనతోపాటు విష్ణు భగవానునికి ప్రీతికరమైన పూజ కార్యక్రమాలు చేయడం ద్వారా.. పూర్వ జన్మలోని దోషాలు తొలగిపోతాయట. భక్తిశ్రద్ధలతో జ్యోతిని వెలిగిస్తే.. అజ్ఞానం తొలగిపోయి.. జ్ఞానం సిద్ధిస్తుందని అర్చకులు చెబుతున్నారు.

అయ్యప్ప సేవలో..

కార్తిక మాసంలో విష్ణువు, పరమేశ్వరుడితోపాటు అయ్యప్ప స్వామిని పూజిస్తే కూడా.. ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. కార్తిక మాసం ఆరంభంతోనే.. లక్షలాదిగా భక్తులు అయ్యప్ప మాల ధరిస్తారు. కారణం ఏంటంటే.. అయ్యప్ప హరిహరసుతుడు అన్న సంగతి తెలిసిందే. మకర సంక్రమణ సమయంలో అయ్యప్పస్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భవిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే.. ఆ జ్యోతిని చూసేందుకు మండలంపాటు(41 రోజులు) దీక్షను చేపట్టి స్వామి సన్నిధానానికి చేరుకుంటారు భక్తులు.

కార్తిక సోమవారం ప్రాధాన్యత : కార్తిక మాసంలోని అన్ని రోజుల్లోనూ ఈ ముగ్గురు దేవుళ్లను అర్చించవచ్చు. అయితే.. ఈ మాసంలో వచ్చే సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం అంటే శివుడికీ ఇష్టం కాబట్టి.. ఈ నెలలో వచ్చే సోమవారాల్లో ఉపవాసం ఉండి, శివుడిని ఆరాధించి.. సాయంత్రం వేళ నక్షత్ర దర్శనం తరువాత దీపాలను వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలూ కలుగుతాయని అంటారు.

కార్తికమాసం స్పెషల్​ - ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో స్వామివారికి నైవేద్యం పెట్టండి!

కార్తికమాసం-ఈ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైనా దర్శించుకోవాలట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.