ETV Bharat / bharat

ఆ ఫొటో పోస్ట్​ చేసిన కాసేపటికే.. మింగేసిన మృత్యువు

ఆమెకు ప్రకృతి అందాలంటే ఎంతో ఇష్టం. ఆ దృశ్యాలను ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఆమెకున్న అలవాటు. అదే విధంగా.. ఆదివారం ఓ ఫొటో తీసి ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. కానీ అదే ఆమె చివరి పోస్టుగా మిగిలిపోయింది. హిమాచల్​ప్రదేశ్​ కిన్నౌర్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె రాజస్థాన్​కు చెందిన దీపా శర్మ.

author img

By

Published : Jul 26, 2021, 3:09 PM IST

last tweet of deepa sharma
దీపా శర్మ ఆఖరి ట్వీట్​

హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్ జిల్లాలో ఆదివారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. 9 మంది పర్యటకుల ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి.. అదే చివరిరోజుగా మిగిలిపోయింది. మరణించిన పర్యటకుల్లో.. రాజస్థాన్​కు చెందిన ఓ వైద్యురాలి కథ అందరికి కంటతడి పెట్టిస్తోంది. 'దేశంలో పౌరులు చేరుకునే చివరి ప్రదేశానికి వెళ్లా'నంటూ ఆమె ఫొటో ట్వీట్​ చేసిన కాసేపటికే ఆమె కన్నుమూసింది.

నెటిజన్ల భావోద్వేగం..

ఆయుర్వేద వైద్యురాలైన దీపా శర్మ.. రాజస్థాన్​ జైపుర్​వాసి​. తన 38వ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు హిమాచల్​ ప్రదేశ్​ పర్యటనకు తన స్నేహితులతో కలిసి ఆమె వెళ్లింది. అయితే ఆదివారం జరిగిన ఘటనలో.. ఆమె వాహనంపై బండరాళ్లు దూసుకువచ్చి పడగా.. ప్రాణాలు కోల్పోయింది. దీప సోదరుడు మహేశ్​ కుమార్​ శర్మ.. తన సోదరి ఎలా మరణించిందో ట్వీట్​ చేశాడు. ఆమెకు ప్రకృతిపై ఎంత ప్రేమ ఉందో వివరించాడు. ఆ ట్వీట్​ చదివిన నెటిజన్లు దీపా శర్మ మృతి పట్ల భావోద్వేగానికి లోనవుతున్నారు.

"జులై 29న తన 38వ పుట్టినరోజును జరుపుకునేందుకు స్పితి లోయ పర్యటనకు నా సోదరి దీపా శర్మ బయల్దేరింది. ఈ పర్యటనపై చాలా సంతోషపడింది. ప్రత్యేకంగా ఓ కొత్త ప్రొఫెషనల్​ కెమెరా, కొత్త స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేసింది. తనకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. కానీ, అదే ప్రకృతి నా చెల్లెలిని పొట్టనబెట్టుకుంది."

-మహేష్​ కుమార్​ శర్మ, దీపా శర్మ సోదరుడు.

దీపా శర్మ ట్విట్టర్​ ప్రొఫైల్ చూసిన వారికి.. ఆమెకు ప్రకృతి అంటే ఇష్టమో ఇట్టే తెలిసిపోతుంది. ఉదయించే సూర్యుడు వంటి ఎన్నో అందమైన ఛాయాచిత్రాలను ఆమె తీసి, పోస్ట్​ చేసింది.

  • Standing at the last point of India where civilians are allowed. Beyond this point around 80 kms ahead we have border with Tibet whom china has occupied illegally. pic.twitter.com/lQX6Ma41mG

    — Dr.Deepa Sharma (@deepadoc) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్విట్టర్​​లో.. "పౌరులకు అనుమతినిచ్చే చివరి పాయింట్​ వద్ద నిల్చున్నాను. ఈ పాయింట్​ నుంచి 80కిలో మీటర్లు దాటితే.. చైనా ఆక్రమించుకున్న టిబెట్ ప్రాంతం వస్తుంది" అని దీపా శర్మ పోస్ట్ చేసింది. అదే ఆమె ఆఖరి ట్వీట్​గా మిగిలిపోయింది.

ఇదీ చూడండి: వరుణుడి పంజాకు 164 మంది బలి- ఊళ్లన్నీ జలమయం

హిమాచల్​ ప్రదేశ్​ కిన్నౌర్ జిల్లాలో ఆదివారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. 9 మంది పర్యటకుల ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి.. అదే చివరిరోజుగా మిగిలిపోయింది. మరణించిన పర్యటకుల్లో.. రాజస్థాన్​కు చెందిన ఓ వైద్యురాలి కథ అందరికి కంటతడి పెట్టిస్తోంది. 'దేశంలో పౌరులు చేరుకునే చివరి ప్రదేశానికి వెళ్లా'నంటూ ఆమె ఫొటో ట్వీట్​ చేసిన కాసేపటికే ఆమె కన్నుమూసింది.

నెటిజన్ల భావోద్వేగం..

ఆయుర్వేద వైద్యురాలైన దీపా శర్మ.. రాజస్థాన్​ జైపుర్​వాసి​. తన 38వ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు హిమాచల్​ ప్రదేశ్​ పర్యటనకు తన స్నేహితులతో కలిసి ఆమె వెళ్లింది. అయితే ఆదివారం జరిగిన ఘటనలో.. ఆమె వాహనంపై బండరాళ్లు దూసుకువచ్చి పడగా.. ప్రాణాలు కోల్పోయింది. దీప సోదరుడు మహేశ్​ కుమార్​ శర్మ.. తన సోదరి ఎలా మరణించిందో ట్వీట్​ చేశాడు. ఆమెకు ప్రకృతిపై ఎంత ప్రేమ ఉందో వివరించాడు. ఆ ట్వీట్​ చదివిన నెటిజన్లు దీపా శర్మ మృతి పట్ల భావోద్వేగానికి లోనవుతున్నారు.

"జులై 29న తన 38వ పుట్టినరోజును జరుపుకునేందుకు స్పితి లోయ పర్యటనకు నా సోదరి దీపా శర్మ బయల్దేరింది. ఈ పర్యటనపై చాలా సంతోషపడింది. ప్రత్యేకంగా ఓ కొత్త ప్రొఫెషనల్​ కెమెరా, కొత్త స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేసింది. తనకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. కానీ, అదే ప్రకృతి నా చెల్లెలిని పొట్టనబెట్టుకుంది."

-మహేష్​ కుమార్​ శర్మ, దీపా శర్మ సోదరుడు.

దీపా శర్మ ట్విట్టర్​ ప్రొఫైల్ చూసిన వారికి.. ఆమెకు ప్రకృతి అంటే ఇష్టమో ఇట్టే తెలిసిపోతుంది. ఉదయించే సూర్యుడు వంటి ఎన్నో అందమైన ఛాయాచిత్రాలను ఆమె తీసి, పోస్ట్​ చేసింది.

  • Standing at the last point of India where civilians are allowed. Beyond this point around 80 kms ahead we have border with Tibet whom china has occupied illegally. pic.twitter.com/lQX6Ma41mG

    — Dr.Deepa Sharma (@deepadoc) July 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్విట్టర్​​లో.. "పౌరులకు అనుమతినిచ్చే చివరి పాయింట్​ వద్ద నిల్చున్నాను. ఈ పాయింట్​ నుంచి 80కిలో మీటర్లు దాటితే.. చైనా ఆక్రమించుకున్న టిబెట్ ప్రాంతం వస్తుంది" అని దీపా శర్మ పోస్ట్ చేసింది. అదే ఆమె ఆఖరి ట్వీట్​గా మిగిలిపోయింది.

ఇదీ చూడండి: వరుణుడి పంజాకు 164 మంది బలి- ఊళ్లన్నీ జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.