ETV Bharat / bharat

దేశంలో మరో 40,120 మందికి కరోనా

author img

By

Published : Aug 13, 2021, 9:48 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 40,120 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 585 మంది మరణించారు.

COVID19
కరోనా కేసులు

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 40,120 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 585 మంది మరణించారు. కొత్తగా 42,295 మంది కరోనా​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.45 శాతానికి చేరగా.. క్రియాశీలక కేసులు 1.21శాతానికి తగ్గాయి.

మొత్తం కేసులు: 3,21,17,826

మొత్తం మరణాలు: 4,30,254

కోలుకున్నవారు: 3,13,02,345

యాక్టివ్​ కేసులు: 3,85,227

కొవిడ్​ పరీక్షలు

మంగళవారం ఒక్కరోజే దేశంలో 19,70,495 కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 48,94,70,779 కు చేరింది.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో కొత్తగా 6,388 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 208 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో 1,942 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 28 మంది బలయ్యారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 1,857 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 30 మంది వైరస్​ కారణంగా మృతి చెందారు.
  • మణిపుర్​లో కొత్తగా 677 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 12 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్​లో 131 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి కొత్తగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్​ కారణంగా నలుగురు మరణించారు.
  • రాజస్థాన్​లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రంలోనే.. బూస్టర్​ డోసులు కష్టం'

భారత్​లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 40,120 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 585 మంది మరణించారు. కొత్తగా 42,295 మంది కరోనా​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.45 శాతానికి చేరగా.. క్రియాశీలక కేసులు 1.21శాతానికి తగ్గాయి.

మొత్తం కేసులు: 3,21,17,826

మొత్తం మరణాలు: 4,30,254

కోలుకున్నవారు: 3,13,02,345

యాక్టివ్​ కేసులు: 3,85,227

కొవిడ్​ పరీక్షలు

మంగళవారం ఒక్కరోజే దేశంలో 19,70,495 కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 48,94,70,779 కు చేరింది.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో కొత్తగా 6,388 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 208 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో 1,942 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 28 మంది బలయ్యారు.
  • కర్ణాటకలో ఒక్కరోజే 1,857 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 30 మంది వైరస్​ కారణంగా మృతి చెందారు.
  • మణిపుర్​లో కొత్తగా 677 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 12 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్​లో 131 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి కొత్తగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్​ కారణంగా నలుగురు మరణించారు.
  • రాజస్థాన్​లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రంలోనే.. బూస్టర్​ డోసులు కష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.