ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి.. ఆ స్కామే కారణమా?

author img

By

Published : Mar 20, 2023, 8:05 AM IST

ఒకే కుటుంబంలో నలుగురు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనాస్థలిలో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. ఆత్మహత్యా? లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది.

four-of-family-found-mysterious-dead
అనుమానస్పద స్థితిలో కుటుంబం మృతి

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన బంగాల్​లోని దుర్గాపుర్​లో జరిగింది. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఓ సూసైడ్​ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీచర్​ ఎలిజబిలిటి టెస్ట్​ స్కామ్​లో ఉన్నవారే తమ మృతికి కారణమని ఉంది. ఈ దారుణ ఘటన దుర్గాపుర్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను అమిత్ కుమార్ మొండల్ (35), రూపా మొండల్ (31).. దంపతుల పిల్లలు నిమిత్ కుమార్ మొండల్ (6), నిఖితా మొండల్​(ఏడాదిన్నర వయసు)గా పోలీసులు గుర్తించారు. అమిత్​ మృతదేహం సీలింగ్​ ఫ్యాన్​కు వేలాడుతూ ఉంది. రూపా, ఆమె ఇద్దరి పిల్లలు మృతదేహాలు కింద పడి ఉన్నాయి. మృతుల మొబైల్​లో ఓ సూసైడ్​ నోట్ పోలీసులకు​ లభ్యమైంది. టీఈటీ కుంభకోణంలో పాల్గొన్నవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో​ ఓ మెసేజ్​​ ఉంది. స్థానికులు మాత్రం ఇది అత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ విషయంలోనే వీరిని హత్య చేశారని ఉంటారని చెబుతున్నారు.

అమిత్​ తల్లిపై పోలీసులకు స్థానికుల ఫిర్యాదు..
అమిత్ కుటుంబం​ మృతికి అతడి తల్లే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే అమిత్ తల్లి, కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఆస్తి వివాదం కారణంగానే అమిత్ కుటుంబాన్ని హత్య చేశారు. అమిత్​ మెడపై గాయాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదు.. కచ్చికంగా హత్యే. అందరి చేతులు కట్టేసి ఉన్నాయి. సీసీ కెమెరా పాలిథీన్​ కవర్​తో మూసేసి ఉంది. అమిత్​ తల్లి, మిగతా కుటుంబసభ్యులే వారిని హత్య చేశారు.' అమిత్ భార్య రూప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

'అమిత్​ తండ్రి.. నరేశ్​ మొండల్ చాలా ఏళ్ల క్రితం మృతి చెందారు. అతను చాలా ఆస్తులు సంపాదించాడు. ఆ ఆస్తుల కోసమే వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.' అని స్థానికులు తెలిపారని డీసీపీ గౌతమ్​ కుమార్​ తెలిపారు. అమిత్ కుటుంబ సభ్యుల మృతికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

కుక్కపై అత్యాచారం..
బిహార్​ పట్నాలో అమానవీయ ఘటన జరిగింది. కుక్కపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మార్చి 8న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫుల్వారీ షరీఫ్‌లోని ఫైసల్ కాలనీలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కుక్కపై అత్యాచారం చేశాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డైయ్యాయి. ఘటనపై ఓ ఎన్​జీఓ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన బంగాల్​లోని దుర్గాపుర్​లో జరిగింది. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ ఓ సూసైడ్​ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీచర్​ ఎలిజబిలిటి టెస్ట్​ స్కామ్​లో ఉన్నవారే తమ మృతికి కారణమని ఉంది. ఈ దారుణ ఘటన దుర్గాపుర్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతులను అమిత్ కుమార్ మొండల్ (35), రూపా మొండల్ (31).. దంపతుల పిల్లలు నిమిత్ కుమార్ మొండల్ (6), నిఖితా మొండల్​(ఏడాదిన్నర వయసు)గా పోలీసులు గుర్తించారు. అమిత్​ మృతదేహం సీలింగ్​ ఫ్యాన్​కు వేలాడుతూ ఉంది. రూపా, ఆమె ఇద్దరి పిల్లలు మృతదేహాలు కింద పడి ఉన్నాయి. మృతుల మొబైల్​లో ఓ సూసైడ్​ నోట్ పోలీసులకు​ లభ్యమైంది. టీఈటీ కుంభకోణంలో పాల్గొన్నవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో​ ఓ మెసేజ్​​ ఉంది. స్థానికులు మాత్రం ఇది అత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ విషయంలోనే వీరిని హత్య చేశారని ఉంటారని చెబుతున్నారు.

అమిత్​ తల్లిపై పోలీసులకు స్థానికుల ఫిర్యాదు..
అమిత్ కుటుంబం​ మృతికి అతడి తల్లే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే అమిత్ తల్లి, కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'ఆస్తి వివాదం కారణంగానే అమిత్ కుటుంబాన్ని హత్య చేశారు. అమిత్​ మెడపై గాయాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదు.. కచ్చికంగా హత్యే. అందరి చేతులు కట్టేసి ఉన్నాయి. సీసీ కెమెరా పాలిథీన్​ కవర్​తో మూసేసి ఉంది. అమిత్​ తల్లి, మిగతా కుటుంబసభ్యులే వారిని హత్య చేశారు.' అమిత్ భార్య రూప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

'అమిత్​ తండ్రి.. నరేశ్​ మొండల్ చాలా ఏళ్ల క్రితం మృతి చెందారు. అతను చాలా ఆస్తులు సంపాదించాడు. ఆ ఆస్తుల కోసమే వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.' అని స్థానికులు తెలిపారని డీసీపీ గౌతమ్​ కుమార్​ తెలిపారు. అమిత్ కుటుంబ సభ్యుల మృతికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

కుక్కపై అత్యాచారం..
బిహార్​ పట్నాలో అమానవీయ ఘటన జరిగింది. కుక్కపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మార్చి 8న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫుల్వారీ షరీఫ్‌లోని ఫైసల్ కాలనీలో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కుక్కపై అత్యాచారం చేశాడు. సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డైయ్యాయి. ఘటనపై ఓ ఎన్​జీఓ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.