ETV Bharat / bharat

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్​ ఫెర్నాండెజ్ కన్నుమూత

author img

By

Published : Sep 13, 2021, 2:47 PM IST

Updated : Sep 13, 2021, 3:14 PM IST

OSCAR FERNANDES
ఆస్కార్​ ఫెర్నాండెజ్ కన్నుమూత

14:41 September 13

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్​ ఫెర్నాండెజ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్​ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన... సోమవారం తుది శ్వాస విడిచారు.

జులై 18న ఉదయం యోగా చేస్తుండగా.. ఆసనంలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు ఫెర్నాండెజ్​. ఆ సమయంలో భౌతికంగా ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన నిర్లక్ష్యం చేశారు. కానీ రోజువారీ చెకప్​లో భాగంగా ఆసుపత్రికి వెళ్లగా.. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. 

వ్యక్తిగత జీవితం...

80ఏళ్ల ఆస్కార్​ ఫెర్నాండెజ్​.. 1941 మార్చి 27న ఉడిపిలో జన్మించారు. 12మంది సంతానంలో ఆయన ఒకరు. చిన్నప్పటి నుంచి క్యాథలిక్​ ఆచారాల మధ్య పెరిగారు. ఆయనకు బ్లాసమ్​ ఫెర్నాండెజ్​తో వివాహమైంది. ఆయనకు ఇద్దరు సంతానం.

కీలక నేత.. కీలక బాధ్యతలు..

కాంగ్రెస్​లో చేరిన ఫెర్నాండెజ్​ అనతికాలంలోనే కీలక​ నేతగా ఎదిగారు. ముఖ్యమైన బాధ్యతలు ఎన్నో చేపట్టారు. 1984, 1989, 1991, 1996లో ఉడిపి నుంచే పోటీ చేసి లోక్​సభలో అడుగుపెట్టారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో రోడ్డు-రవాణా, కార్మికశాఖ మంత్రిగా పాటు అనేక పదవులు చేపట్టారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ ఫెర్నాండెజ్​ సేవలు చేశారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఫెర్నాండెజ్​ గుర్తింపుపొందారు. పార్టీ తీసుకునే నిర్ణయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించేవారు.

14:41 September 13

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్​ ఫెర్నాండెజ్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్​ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన... సోమవారం తుది శ్వాస విడిచారు.

జులై 18న ఉదయం యోగా చేస్తుండగా.. ఆసనంలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు ఫెర్నాండెజ్​. ఆ సమయంలో భౌతికంగా ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన నిర్లక్ష్యం చేశారు. కానీ రోజువారీ చెకప్​లో భాగంగా ఆసుపత్రికి వెళ్లగా.. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. 

వ్యక్తిగత జీవితం...

80ఏళ్ల ఆస్కార్​ ఫెర్నాండెజ్​.. 1941 మార్చి 27న ఉడిపిలో జన్మించారు. 12మంది సంతానంలో ఆయన ఒకరు. చిన్నప్పటి నుంచి క్యాథలిక్​ ఆచారాల మధ్య పెరిగారు. ఆయనకు బ్లాసమ్​ ఫెర్నాండెజ్​తో వివాహమైంది. ఆయనకు ఇద్దరు సంతానం.

కీలక నేత.. కీలక బాధ్యతలు..

కాంగ్రెస్​లో చేరిన ఫెర్నాండెజ్​ అనతికాలంలోనే కీలక​ నేతగా ఎదిగారు. ముఖ్యమైన బాధ్యతలు ఎన్నో చేపట్టారు. 1984, 1989, 1991, 1996లో ఉడిపి నుంచే పోటీ చేసి లోక్​సభలో అడుగుపెట్టారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో రోడ్డు-రవాణా, కార్మికశాఖ మంత్రిగా పాటు అనేక పదవులు చేపట్టారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ ఫెర్నాండెజ్​ సేవలు చేశారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఫెర్నాండెజ్​ గుర్తింపుపొందారు. పార్టీ తీసుకునే నిర్ణయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించేవారు.

Last Updated : Sep 13, 2021, 3:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.