ETV Bharat / bharat

Afghan crisis: 'భారత్ మాకు​ రెండో ఇల్లు'.. అఫ్గానీల ఆనందబాష్పాలు

author img

By

Published : Aug 22, 2021, 7:46 PM IST

Updated : Aug 22, 2021, 8:05 PM IST

అఫ్గానిస్థాన్​లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది(India Kabul evacuation). దాదాపు 400 మంది ఆదివారం భారత్​ చేరుకున్నారు. వారిలో 329 మంది భారతీయులు కాగా ఇద్దరు అఫ్గానిస్థాన్​ చట్టసభ సభ్యులున్నారు. అఫ్గాన్‌ నుంచి ఓ విమానం, కాబుల్‌ నుంచి ఖతార్‌, తజికిస్థాన్ మీదుగా మరో రెండు విమానాల్లో వీరు భారత్‌ వచ్చారు. స్వదేశం చేరుకున్న అనంతరం ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు.

Taliban
తాలిబన్

తాలిబన్ల హస్తగతమైన(Taliban takeover) తర్వాత అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు (India Kabul evacuation) కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. కాబుల్ నుంచి బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం.. భారత్‌కు చేరుకుంది. దిల్లీకి సమీపంలోని హిండన్ వైమానిక స్థావరంలో(Hindon Airbase) ఈ విమానం ల్యాండ్ అయింది. విమానంలో మొత్తం 168మంది ప్రయాణికులు ఉండగా.. 107 మంది భారతీయులు, 23 మంది అఫ్గాన్‌ సిక్కులు, హిందువులు ఉన్నారు. వీరిలో ఒక శిశువు పాస్‌పోర్టు లేకుండానే భారత్‌లో అడుగుపెట్టింది. అఫ్గానిస్థాన్​ చట్టసభ సభ్యులు అనార్కలి హోనర్యార్‌, నరేందర్ సింగ్ ఖాస్లా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు.

Taliban
భారత్​ చేరిన స్వదేశీయులు సహా అఫ్గానీలు

మరో 87మంది భారతీయులు, ఇద్దరు నేపాలీలను భారత వైమానిక దళానికి చెందిన సైనిక విమానంలో తజకిస్థాన్ తరలించగా.. అక్కడి నుంచి ఆదివారం దిల్లీకి తీసుకువచ్చారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వీరిని స్వదేశానికి చేర్చారు.

అఫ్గాన్‌లోని విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న మరో 135 మంది భారతీయ ఉద్యోగులను.. యూఎస్, నాటో విమానాల ద్వారా తొలుత దోహాకు తరలించారు. వారిని ఆదివారం భారత్‌కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

Taliban
భారత్​లో దిగగానే మహిళ భావోద్వేగం

ప్రయాణికుల భావోద్వేగం..

భారత్ చేరుకున్న అనంతరం ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు. అఫ్గాన్‌లో పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల కష్టం వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలిసి వచ్చానని తెలిపిన ఓ ప్రయాణికురాలు.. తాలిబన్లు ఆమె ఇంటికి నిప్పంటించినట్లు చెప్పారు. సాయం చేసేందుకు వచ్చిన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: Taliban Afghanistan: అంతా నాశనమైంది.. అఫ్గాన్​ ఎంపీ కంటతడి

ఏడుపు వచ్చేస్తోంది: ఎంపీ

Taliban
ఎంపీ నరేందర్‌ సింగ్‌ కన్నీటిపర్యంతం

"భారత్​.. మా రెండో ఇల్లు. ఆపన్నహస్తం అందించినందుకు చాలా కృతజ్ఞతలు. అఫ్గాన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎంపీ, సెనేటర్ సహా అందరి ఇళ్లల్లోకి తాలిబన్లు వెళ్లి వెతుకున్నారు. ఇబ్బంది పెడుతున్నారు. రోజుకు నాలుగు సార్లు వస్తున్నారు. మేమంతా ఆందోళనలో ఉన్నాం. నాకు ఏడుపు వచ్చేస్తోంది. తరతరాలుగా అఫ్గాన్‌లో ఉన్నాం. గత 20 ఏళ్లుగా పడ్డ కష్టం.. ఇప్పుడు శూన్యమైపోయింది."

-నరేందర్‌ సింగ్‌ ఖల్సా, అఫ్గాన్‌ ఎంపీ

తాలిబన్​ అంటే ఒక గుంపు కాదని ఖల్సా తెలిపారు. 10-12 బృందాలున్నాయని వెల్లడించారు. వారిలో ఎవరు తాలిబన్ అని గుర్తించడం కష్టమని చెప్పారు. ఇక తన ప్రాణాలను రక్షించినందుకు భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు హోనర్యార్‌.

Taliban
తాలిబన్ల నుంచి విముక్తి పొందిన ఆనందంలో

ఇదీ చూడండి: Afghan crisis: 'దేశం వీడి వెళ్తారా? కాల్చి పడేస్తాం!'

సజావుగా తరలిస్తున్నాం..

అఫ్గాన్​ నుంచి భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని కేంద్ర మంత్రి వి. మురళిధరన్ అన్నారు. స్వదేశానికి రావాలనుకునే ప్రతీ భారత పౌరుడిని కేంద్రం వెనక్కు తీసుకొస్తుందని తెలిపారు.

Taliban
సంతోషంలో చిన్నారులు

తాలిబన్ల వశమైన అప్గాన్ రాజధాని కాబుల్‌లో.. రోజురోజుకీ భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న వేళ.. వివిధ దేశాలు తమ ప్రజల తరలింపు ముమ్మరం చేశాయి. కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించిన అనంతరం భారత దౌత్యకార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు, భారతీయులు సహా దాదాపు 600 మందిని భారత వైమానిక దళం భారత్‌కు చేర్చింది.

ఇదీ చూడండి: Afghan refugees: దేశాన్ని వీడే అఫ్గాన్​ ప్రజల పరిస్థితేంటి?

తాలిబన్ల హస్తగతమైన(Taliban takeover) తర్వాత అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు (India Kabul evacuation) కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. కాబుల్ నుంచి బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం.. భారత్‌కు చేరుకుంది. దిల్లీకి సమీపంలోని హిండన్ వైమానిక స్థావరంలో(Hindon Airbase) ఈ విమానం ల్యాండ్ అయింది. విమానంలో మొత్తం 168మంది ప్రయాణికులు ఉండగా.. 107 మంది భారతీయులు, 23 మంది అఫ్గాన్‌ సిక్కులు, హిందువులు ఉన్నారు. వీరిలో ఒక శిశువు పాస్‌పోర్టు లేకుండానే భారత్‌లో అడుగుపెట్టింది. అఫ్గానిస్థాన్​ చట్టసభ సభ్యులు అనార్కలి హోనర్యార్‌, నరేందర్ సింగ్ ఖాస్లా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు.

Taliban
భారత్​ చేరిన స్వదేశీయులు సహా అఫ్గానీలు

మరో 87మంది భారతీయులు, ఇద్దరు నేపాలీలను భారత వైమానిక దళానికి చెందిన సైనిక విమానంలో తజకిస్థాన్ తరలించగా.. అక్కడి నుంచి ఆదివారం దిల్లీకి తీసుకువచ్చారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వీరిని స్వదేశానికి చేర్చారు.

అఫ్గాన్‌లోని విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న మరో 135 మంది భారతీయ ఉద్యోగులను.. యూఎస్, నాటో విమానాల ద్వారా తొలుత దోహాకు తరలించారు. వారిని ఆదివారం భారత్‌కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.

Taliban
భారత్​లో దిగగానే మహిళ భావోద్వేగం

ప్రయాణికుల భావోద్వేగం..

భారత్ చేరుకున్న అనంతరం ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు. అఫ్గాన్‌లో పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల కష్టం వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలిసి వచ్చానని తెలిపిన ఓ ప్రయాణికురాలు.. తాలిబన్లు ఆమె ఇంటికి నిప్పంటించినట్లు చెప్పారు. సాయం చేసేందుకు వచ్చిన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: Taliban Afghanistan: అంతా నాశనమైంది.. అఫ్గాన్​ ఎంపీ కంటతడి

ఏడుపు వచ్చేస్తోంది: ఎంపీ

Taliban
ఎంపీ నరేందర్‌ సింగ్‌ కన్నీటిపర్యంతం

"భారత్​.. మా రెండో ఇల్లు. ఆపన్నహస్తం అందించినందుకు చాలా కృతజ్ఞతలు. అఫ్గాన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఎంపీ, సెనేటర్ సహా అందరి ఇళ్లల్లోకి తాలిబన్లు వెళ్లి వెతుకున్నారు. ఇబ్బంది పెడుతున్నారు. రోజుకు నాలుగు సార్లు వస్తున్నారు. మేమంతా ఆందోళనలో ఉన్నాం. నాకు ఏడుపు వచ్చేస్తోంది. తరతరాలుగా అఫ్గాన్‌లో ఉన్నాం. గత 20 ఏళ్లుగా పడ్డ కష్టం.. ఇప్పుడు శూన్యమైపోయింది."

-నరేందర్‌ సింగ్‌ ఖల్సా, అఫ్గాన్‌ ఎంపీ

తాలిబన్​ అంటే ఒక గుంపు కాదని ఖల్సా తెలిపారు. 10-12 బృందాలున్నాయని వెల్లడించారు. వారిలో ఎవరు తాలిబన్ అని గుర్తించడం కష్టమని చెప్పారు. ఇక తన ప్రాణాలను రక్షించినందుకు భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు హోనర్యార్‌.

Taliban
తాలిబన్ల నుంచి విముక్తి పొందిన ఆనందంలో

ఇదీ చూడండి: Afghan crisis: 'దేశం వీడి వెళ్తారా? కాల్చి పడేస్తాం!'

సజావుగా తరలిస్తున్నాం..

అఫ్గాన్​ నుంచి భారతీయులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని కేంద్ర మంత్రి వి. మురళిధరన్ అన్నారు. స్వదేశానికి రావాలనుకునే ప్రతీ భారత పౌరుడిని కేంద్రం వెనక్కు తీసుకొస్తుందని తెలిపారు.

Taliban
సంతోషంలో చిన్నారులు

తాలిబన్ల వశమైన అప్గాన్ రాజధాని కాబుల్‌లో.. రోజురోజుకీ భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న వేళ.. వివిధ దేశాలు తమ ప్రజల తరలింపు ముమ్మరం చేశాయి. కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించిన అనంతరం భారత దౌత్యకార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు, భారతీయులు సహా దాదాపు 600 మందిని భారత వైమానిక దళం భారత్‌కు చేర్చింది.

ఇదీ చూడండి: Afghan refugees: దేశాన్ని వీడే అఫ్గాన్​ ప్రజల పరిస్థితేంటి?

Last Updated : Aug 22, 2021, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.