ETV Bharat / bharat

జమ్మూ​, పాక్ మధ్య సొరంగం- 'అమర్​నాథ్​ యాత్ర'పై కుట్ర!

author img

By

Published : May 5, 2022, 8:09 AM IST

Updated : May 5, 2022, 11:58 AM IST

BSF Detects Tunnel: జమ్ముకశ్మీర్​ సాంబా ప్రాంతంలో ఓ సొరంగం బయటపడింది. పాకిస్థాన్​ సరిహద్దుకు అత్యంత సమీపంలోనే ఉన్న కారణంగా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల ఇద్దరు జైషే మహ్మద్​ సూసైడ్​ బాంబర్లు.. ఈ సొరంగం గుండానే భారత్​లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు. పాక్​ నుంచి సొరంగం దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Cross-border tunnel used by JeM suicide bombers detected in J-K's Samba
Cross-border tunnel used by JeM suicide bombers detected in J-K's Samba

BSF Detects Tunnel: జమ్ముకశ్మీర్​ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి.. భారీ సొరంగాన్ని గుర్తించింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​). పాకిస్థాన్​ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దీనిగుండా భారత్​లోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. అమర్​నాథ్​ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాక్​ ముష్కరుల కుట్రలో భాగంగానే సొరంగం తవ్వారని భావిస్తున్నారు. ఇటీవలే తవ్విన ఈ సొరంగం.. పాక్​ వైపు నుంచి దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఏప్రిల్​ 22న సుంజ్వాన్​ ప్రాంతంలో ఇద్దరు సూసైడ్​ బాంబర్లు.. పుల్వామా తరహా దాడికి తెగబడ్డారు. సీఐఎస్​ఎఫ్​ బలగాలు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడగా.. ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు బలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది జరిగిన 14 రోజులకు ఇప్పుడు సొరంగాన్ని గుర్తించారు.

Cross-border tunnel used by JeM suicide bombers detected in J-K's Samba
బయటపడిన సొరంగం

అంతర్జాతీయ సరిహద్దులో సొరంగం బయటపడడం.. గత 16 నెలల్లో ఇదే తొలిసారి అని బీఎస్​ఎఫ్​ అధికారులు వెల్లడించారు. మొత్తంగా గత దశాబ్దకాలంలో ఇది 11వ సారి అని తెలిపారు. పాకిస్థాన్​ పోస్ట్​ ఛమన్​ ఖుర్ద్​ నుంచి సొరంగం కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉందని, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పేర్కొన్నారు.

Cross-border tunnel used by JeM suicide bombers detected in J-K's Samba
సొరంగాన్ని గుర్తించిన బీఎస్​ఎఫ్​ సిబ్బంది

కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది అమర్‌నాథ్ యాత్ర చేపడుతారు. అయితే, ఈ యాత్రకు ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉన్నట్లు ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉంటాయి. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్‌ 30న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది.

ఇవీ చూడండి: 'ఆజాద్'​ సేన కోసం అంతా ఏకమై.. నల్లకోటుతో కోర్టుకు నెహ్రూ!

రూ.15 కోట్ల హెరాయిన్ సీజ్​.. ఆఫ్రికా మహిళ శరీరంలో 70 డ్రగ్​ క్యాప్సుల్స్​

BSF Detects Tunnel: జమ్ముకశ్మీర్​ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి.. భారీ సొరంగాన్ని గుర్తించింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​). పాకిస్థాన్​ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దీనిగుండా భారత్​లోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు అధికారులు. అమర్​నాథ్​ యాత్రకు అంతరాయం కలిగించేందుకు పాక్​ ముష్కరుల కుట్రలో భాగంగానే సొరంగం తవ్వారని భావిస్తున్నారు. ఇటీవలే తవ్విన ఈ సొరంగం.. పాక్​ వైపు నుంచి దాదాపు 150 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఏప్రిల్​ 22న సుంజ్వాన్​ ప్రాంతంలో ఇద్దరు సూసైడ్​ బాంబర్లు.. పుల్వామా తరహా దాడికి తెగబడ్డారు. సీఐఎస్​ఎఫ్​ బలగాలు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడగా.. ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు బలగాలు జరిపిన ఎన్​కౌంటర్​లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది జరిగిన 14 రోజులకు ఇప్పుడు సొరంగాన్ని గుర్తించారు.

Cross-border tunnel used by JeM suicide bombers detected in J-K's Samba
బయటపడిన సొరంగం

అంతర్జాతీయ సరిహద్దులో సొరంగం బయటపడడం.. గత 16 నెలల్లో ఇదే తొలిసారి అని బీఎస్​ఎఫ్​ అధికారులు వెల్లడించారు. మొత్తంగా గత దశాబ్దకాలంలో ఇది 11వ సారి అని తెలిపారు. పాకిస్థాన్​ పోస్ట్​ ఛమన్​ ఖుర్ద్​ నుంచి సొరంగం కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉందని, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్లు పేర్కొన్నారు.

Cross-border tunnel used by JeM suicide bombers detected in J-K's Samba
సొరంగాన్ని గుర్తించిన బీఎస్​ఎఫ్​ సిబ్బంది

కశ్మీర్‌లోని హిమాలయాల్లో ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది అమర్‌నాథ్ యాత్ర చేపడుతారు. అయితే, ఈ యాత్రకు ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉన్నట్లు ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు హెచ్చరిస్తూనే ఉంటాయి. 2017లో అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది జూన్‌ 30న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుంది.

ఇవీ చూడండి: 'ఆజాద్'​ సేన కోసం అంతా ఏకమై.. నల్లకోటుతో కోర్టుకు నెహ్రూ!

రూ.15 కోట్ల హెరాయిన్ సీజ్​.. ఆఫ్రికా మహిళ శరీరంలో 70 డ్రగ్​ క్యాప్సుల్స్​

Last Updated : May 5, 2022, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.