ETV Bharat / bharat

'శివుడే మా సీఎం- కరోనాతో మాకు భయమేంటి?'

author img

By

Published : Aug 9, 2021, 3:38 PM IST

ముఖ్యమంత్రిగా 'శివుడు', రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా 'విష్ణువు' ఉన్నప్పుడు.. మధ్యప్రదేశ్​కు కరోనా వైరస్ ఎలాంటి నష్టం చేయలేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్​ వ్యాఖ్యానించారు. ఈ​ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్.. మధ్యప్రదేశ్​లో కొవిడ్​ విజృంభించిన సమయంలో 'వాళ్లు నిద్రపోయారా?' అని విమర్శించింది.

tarun chug about madhyapradesh corona
తరుణ్ చుగ్​, భాజపా జాతీయ ప్రధాన కాార్యదర్శి

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్​ చుగ్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్​లో ముఖ్యమంత్రిగా 'శివుడు', ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా 'విష్ణువు' ఉన్నప్పుడు.. రాష్ట్రానికి కరోనా వైరస్​ఎలాంటి హానీ చేయలేదని ట్విట్టర్​ వేదికగా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ భాజపా అధ్యక్షుడు విష్ణు దత్​ను దేవుళ్లతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా శివుడు, మధ్యప్రదేశ్​ రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగా విష్ణు ఉన్నప్పుడు... ఆ రాష్ట్రంలో కరోనా వైరస్​ ఎలా ప్రభావం చూపగలదు? డిసెంబర్​ నాటికి దేశంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు 135 కోట్ల టీకా డోసులు అందుతాయి."

-తరుణ్​ చుగ్​, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

'అప్పుడు నిద్రపోయారా?'

తరుణ్​ చుగ్​ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. పార్టీ కార్యకర్తల నుంచి ప్రశంసలు పొందేందుకు నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా విమర్శించారు.

"మధ్యప్రదేశ్​లో జనవరి-మే మధ్య 3.28 లక్షల మంది కరోనా కారణంగా కన్నుమూశారు. దేశవ్యాప్త మరణాల రేటు కంటే ఇది 24శాతం అధికం. కొవిడ్​ ధాటికి 3,500 మంది భాజపా కార్యకర్తలు చనిపోయారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో శివరాజ్​, విష్ణుదత్​ ఎక్కడున్నారో చెప్పాలి. ఆ సమయంలో వారు నిద్రపోయారా? భవిష్యత్తులో కరోనాను వారు ఎలా కట్టడి చేస్తారు?"

- భూపేంద్ర గుప్తా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి.

అయితే.. తరుణ్ చుగ్ కేవలం ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మొదటి పేర్లను మాత్రమే ఉపయోగించారని మధ్యప్రదేశ్​ భాజపా కార్యదర్శి రజ్నీశ్​ అగర్వాల్ వివరించారు. మహమ్మారి విజృంభణ సమయంలో భాజపా ప్రభుత్వం సహా తమ పార్టీ.. ప్రజలకు సేవ చేయటంలో నిమగ్నమైందని చెప్పారు.

ఇదీ చూడండి: 'అభిషేక్​ బెనర్జీపై దాడిలో అమిత్ షా హస్తం'

ఇదీ చూడండి: పెట్టుబడి సాయం విడుదల- రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్​ చుగ్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్​లో ముఖ్యమంత్రిగా 'శివుడు', ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా 'విష్ణువు' ఉన్నప్పుడు.. రాష్ట్రానికి కరోనా వైరస్​ఎలాంటి హానీ చేయలేదని ట్విట్టర్​ వేదికగా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ భాజపా అధ్యక్షుడు విష్ణు దత్​ను దేవుళ్లతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా శివుడు, మధ్యప్రదేశ్​ రాష్ట్ర భాజపా అధ్యక్షుడుగా విష్ణు ఉన్నప్పుడు... ఆ రాష్ట్రంలో కరోనా వైరస్​ ఎలా ప్రభావం చూపగలదు? డిసెంబర్​ నాటికి దేశంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు 135 కోట్ల టీకా డోసులు అందుతాయి."

-తరుణ్​ చుగ్​, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

'అప్పుడు నిద్రపోయారా?'

తరుణ్​ చుగ్​ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. పార్టీ కార్యకర్తల నుంచి ప్రశంసలు పొందేందుకు నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా విమర్శించారు.

"మధ్యప్రదేశ్​లో జనవరి-మే మధ్య 3.28 లక్షల మంది కరోనా కారణంగా కన్నుమూశారు. దేశవ్యాప్త మరణాల రేటు కంటే ఇది 24శాతం అధికం. కొవిడ్​ ధాటికి 3,500 మంది భాజపా కార్యకర్తలు చనిపోయారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో శివరాజ్​, విష్ణుదత్​ ఎక్కడున్నారో చెప్పాలి. ఆ సమయంలో వారు నిద్రపోయారా? భవిష్యత్తులో కరోనాను వారు ఎలా కట్టడి చేస్తారు?"

- భూపేంద్ర గుప్తా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి.

అయితే.. తరుణ్ చుగ్ కేవలం ముఖ్యమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మొదటి పేర్లను మాత్రమే ఉపయోగించారని మధ్యప్రదేశ్​ భాజపా కార్యదర్శి రజ్నీశ్​ అగర్వాల్ వివరించారు. మహమ్మారి విజృంభణ సమయంలో భాజపా ప్రభుత్వం సహా తమ పార్టీ.. ప్రజలకు సేవ చేయటంలో నిమగ్నమైందని చెప్పారు.

ఇదీ చూడండి: 'అభిషేక్​ బెనర్జీపై దాడిలో అమిత్ షా హస్తం'

ఇదీ చూడండి: పెట్టుబడి సాయం విడుదల- రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.