దేశంలో కరోనా కేసుల సంఖ్య 78లక్షలు దాటింది. తాజాగా 53,370మంది కరోనా బారినపడ్డారు. మరో 650మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక్కరోజే 67,549మంది కొవిడ్ను జయించారు. దీంతో రికవరీ రేటు 89.78శాతానికి చేరింది.
- మొత్తం కేసులు:- 78,14,682
- యాక్టివ్ కేసులు:- 6,80,680
- మొత్త మరణాలు:- 1,17,956
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 8.71గా ఉంది. కేస్ ఫటాలిటీ రేటు 1.51శాతానికి తగ్గినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ డేటా పేర్కొంది.

పరీక్షలు ఇలా...
శనివారం 12,69,479 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 10,13,82,564కు చేరినట్టు తెలిపింది.
ఇదీ చూడండి- రానున్న మూడు నెలలు కీలకం: హర్షవర్ధన్