భారత్కు వియత్నాం అత్యంత కీలక భాగస్వామి అని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల మధ్య దృఢమైన భాగస్వామ్యం అత్యంత ముఖ్యమన్నారు. వియత్నాం ప్రధాని నుగుయెన్ జువాన్తో వర్చువల్గా భేటీ అయ్యారు మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగైనట్లు చెప్పారు.
భారత సులభ విధానంలో వియత్నాం మూల స్తంభమని మోదీ అన్నారు. ఆ దేశంతో సుదీర్ఘ, వ్యూహాత్మక బంధాలు కొనసాగించాలని భారత్ భావిస్తోందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటమే రెండు దేశాల ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. వియత్నాం ప్రభుత్వం కరోనాను కట్టడి చేసిన తీరును కొనియాడారు.
7 కొత్త ఒప్పందాలు..
వియత్నాంతో శాస్త్రీయ పరిశోధన, అణు, పునరుత్పాదక శక్తి, పెట్రోరసాయనాలు, రక్షణ, క్యాన్సర్ చికిత్స సహా ఆయా రంగాల్లో మొత్తం ఏడు కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మోదీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య సామాజిక-సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రెండు దేశాలు సభ్యులుగా అవుతాయని, అంతర్జాతీయ ప్రయోజనాలకు అనుగణంగా రెండు దేశాల మధ్య పరస్పర సహకారం కీలకమన్నారు.