ETV Bharat / bharat

బంపర్ ఆఫర్: ఓనం లాటరీలో రూ.12 కోట్లు

author img

By

Published : Sep 24, 2020, 1:31 PM IST

కేరళ ఇడుక్కికి చెందిన అనంతు అనే యువకుడ్ని ఈ ఏడాది ఓనం లాటరీ వరించింది. ఏటా ఓనం సందర్భంగా నిర్వహించే లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న అనంతుకు.. రూ.12 కోట్లు సొంతమయ్యాయి. ఈ సొమ్ముతో మంచి ఇల్లు కట్టుకొని, తమ పిల్లలకు ఉన్నత చదువులు చెప్పిస్తాం అంటున్నారు అతని తల్లిదండ్రులు.

Rs 12 crore Kerala bumper lottery winner wants to fulfil humble dreams
ఓనం లాటరీలో రూ.12కోట్లు.. సాకారం కానున్న కలలు

కేరళలో ఈ ఏడాది ఓనం లాటరీని ఇడుక్కికి చెందిన అనంతు దక్కించుకున్నాడు. ఓ ఆలయంలో పనిచేస్తున్న అతను ఈ లాటరీ ద్వారా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.

ఓనం లాటరీలో రూ.12కోట్లు.. సాకారం కానున్న కలలు

ఎంబీఏ మానేసి ఆలయంలో చేరి..

అనంతు కుటుంబం వాలియాతోవాలలో ఓ శిథిలావస్థకు చేరిన ఇంట్లో నివాసముంటోంది. చిన్నపాటి వర్షం పడితే చాలు.. కారే ఇల్లు అది. ఇలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అనంతు.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన ఎంబీఏ కలలను విరమించుకున్నాడు. ఎర్నాకుళంలోని ఓ ఆలయంలో పనిచేస్తున్నాడు. అతని తండ్రి పెయింటర్​ కాగా.. తల్లి ఓ ప్రైవేటు వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. ఇలా చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషిస్తూ.. తమ పిల్లల్ని చదివించారు.

సాకారమవ్వనున్న కల

ఇలాంటి దీన పరిస్థితుల్లో తమ కుమారుడికి లాటరీ తగలడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది ఆ కుటుంబం. లాటరీ సొమ్ముతో తమ కలలు నిజం చేసుకుంటామని అంటున్నారు. అన్ని వసతులతో ఓ ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్​ అందిస్తామంటున్నారు.

ఇదీ చదవండి: రాత్రి వేళ విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష

కేరళలో ఈ ఏడాది ఓనం లాటరీని ఇడుక్కికి చెందిన అనంతు దక్కించుకున్నాడు. ఓ ఆలయంలో పనిచేస్తున్న అతను ఈ లాటరీ ద్వారా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.

ఓనం లాటరీలో రూ.12కోట్లు.. సాకారం కానున్న కలలు

ఎంబీఏ మానేసి ఆలయంలో చేరి..

అనంతు కుటుంబం వాలియాతోవాలలో ఓ శిథిలావస్థకు చేరిన ఇంట్లో నివాసముంటోంది. చిన్నపాటి వర్షం పడితే చాలు.. కారే ఇల్లు అది. ఇలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అనంతు.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తన ఎంబీఏ కలలను విరమించుకున్నాడు. ఎర్నాకుళంలోని ఓ ఆలయంలో పనిచేస్తున్నాడు. అతని తండ్రి పెయింటర్​ కాగా.. తల్లి ఓ ప్రైవేటు వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. ఇలా చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషిస్తూ.. తమ పిల్లల్ని చదివించారు.

సాకారమవ్వనున్న కల

ఇలాంటి దీన పరిస్థితుల్లో తమ కుమారుడికి లాటరీ తగలడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది ఆ కుటుంబం. లాటరీ సొమ్ముతో తమ కలలు నిజం చేసుకుంటామని అంటున్నారు. అన్ని వసతులతో ఓ ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మంచి భవిష్యత్​ అందిస్తామంటున్నారు.

ఇదీ చదవండి: రాత్రి వేళ విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.