మహారాష్ట్ర కొల్హాపురీ తోలు చెప్పులంటే తెలియని వారుండరు. ఆ ఖ్యాతికి మరింత పేరు తెచ్చేలా ఓ వ్యాపారి ఆవు పేడతో చెప్పులు తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
టోటల్ డ్రీమ్ సర్వీసెస్ చెప్పుల పరిశ్రమ యజమాని కిరణ్ మాలీ.. ఆవు పేడతో చెప్పులు తయారు చేస్తున్నాడు. వినూత్నంగా కనిపించే ఈ చెప్పులు పర్యావరణహితమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నాడు.
"మన శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు ఈ ఆవు పేడ చెప్పులు ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ చెప్పులు నీటిలో తడిచినా పాడవ్వవు."
-కిరణ్ మాలీ, పరిశ్రమ యజమాని
పేడను జల్లెడ పట్టి, అందులో సహజ నూనెలు కలిపి తయారు చేసిన ఈ చెప్పులకు 'గోమాత చరణ పాదుకాలు'గా నామకరణం చేశారు. ఒక్క జత సుమారు రూ.500 నుంచి రూ. 700 ధర పలుకుతున్నాయి. ఈ ఆవుపేడ చెప్పులకు భారత్లోనే కాదు.. విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉంది. అందుకే త్వరలో వీటిని ఎగుమతి చేసే యోచనలో ఉన్నాడు కిరణ్.
ఇదీ చదవండి: పిడుగు పడిందని పేడలో మహిళ సజీవ సమాధి!