ETV Bharat / bharat

భారత్​పై 'కరోనా' ప్రతాపం.. 13వేలకు చేరువలో కేసులు

author img

By

Published : Apr 17, 2020, 5:10 AM IST

భారత్​లో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 13 వేలకు చేరువైంది. ఇప్పటికే 420 మంది మృతి చెందారు. గత 24 గంటల్లోనే 28 మంది ప్రాణాలు కోల్పోగా.. కొత్తగా 826 మంది బాధితులయ్యారు.

india
భారత్​లో 13వేలకు చేరువలో వైరస్ బాధితులు.. 420మంది మృతి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 28 మంది ప్రాణాలు కోల్పోగా.. 826 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 12,759కు చేరింది.

కరోనాలో 'మహా'..రాష్ట్ర

వైరస్ ప్రభావిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందంజలో ఉంది. అక్కడ కొత్తగా 286 మందికి వైరస్ సోకగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తంగా 3,401 మంది వైరస్ బాధితులు ఉన్నారు. 187 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా చనిపోయిన వారిలో 45 శాతం, కేసుల్లో దాదాపు 24 శాతం ఈ రాష్ట్రం వారే ఉన్నారు.

ఒక్క ముంబయి మహానగరంలోనే 2,073 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆరు రోజుల్లోనే కేసులు రెట్టింపవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడి ధారావి మురికివాడ ప్రాంతంలోనే ఒకే రోజు 26 కొత్త కేసులు వచ్చాయి. పుణెలో 4,19 మందికి పాజిటివ్​ ఫలితాలు వచ్చాయి. పాల్​ఘర్ జిల్లాలో 20 ప్రదేశాలను వైరస్ హాట్​స్పాట్​లుగా గుర్తించారు. ఈ రాష్ట్రంలో మొత్తం వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 295కు చేరింది.

దిల్లీలో ఆసుపత్రి సిబ్బంది నిర్బంధం..

దిల్లీలోని ఓ ఆసుపత్రికి చెందిన వైద్యులు, నర్సులు సహా 68 మంది వైద్య సిబ్బందిని స్వీయ నిర్బంధానికి పంపించారు. ఓ గర్భిణీ మహిళ కరోనాతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం. మొత్తంగా దిల్లీలో 1,652 మంది వైరస్ బారిన పడ్డారు. 32 మంది మరణించారు.

మధ్యప్రదేశ్​లో..

మధ్యప్రదేశ్​లో కొత్తగా 361మందికి వైరస్ పాజిటివ్​ ఫలితాలు వచ్చాయి. మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 1,299కి చేరింది. గత 24 గంటల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ మరణాల సంఖ్య 63కు పెరిగింది. మొత్తం 52 జిల్లాలు ఉండగా.. 26 జిల్లాల్లో వైరస్​ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన ఇండోర్​లో 47 మంది వైరస్​కు బలయ్యారు.

బిహార్​లో రెండేళ్ల చిన్నారికి..

బిహార్​లో ఓ రెండేళ్ల చిన్నారి సహా కొత్తగా పదిమందికి కరోనా సోకింది. ముంగేర్ జిల్లాకు చెందిన ఆ పసిపాప ఇంట్లోని ఐదుగురు సభ్యులు వైరస్ బారినపడ్డారు. కుటుంబంలోని వృద్ధుడికి కొవిడ్​-19 ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలో మొత్తంగా 80 కేసులు నమోదవగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఒడిశాలో విస్తృత పరీక్షలు..

ఒడిశాలో పెద్ద ఎత్తున కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే ఎనిమిది నుంచి పది రోజుల్లో వైరస్​ వ్యాప్తి నియంత్రణే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. మొత్తంగా ఒడిశాలో 60 కేసులు నమోదవగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

కశ్మీర్​లో 58 వేల మందిపై పర్యవేక్షణ..

జమ్ముకశ్మీర్​లో కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగారన్న అనుమానంతో 58,000 మందిని పర్యవేక్షణలో ఉంచారు అధికారులు. ఇందులో 7,463 మంది నిర్బంధ కేంద్రాల్లో ఉంచారు. 29,366 మంది గృహ నిర్బంధం సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఐదువేలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించారు. ఇప్పటివరకు 400 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

హరియాణాలో ఇంటింటి పరీక్షలు..

హరియాణాలో ఇంటింటి సర్వే చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఎవరైనా వైరస్ లక్షణాలతో ఉంటే వారి నమూనాలను పరీక్షలకు పంపనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 214 వైరస్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

యూపీలో తబ్లీగీతో..

ఉత్తర్​ప్రదేశ్​లో తబ్లీగీ జమాతే కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 43 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 24 గంటల వ్యవధిలో 67 కొత్త కరోనా కేసులు నమోదవగా.. వైరస్ బాధితుల సంఖ్య 7,27కు చేరింది. మరణాల సంఖ్య 13గా ఉంది.

రాజస్థాన్​లో..

రాజస్థాన్​లో కొత్తగా 55 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కేసుల సంఖ్య 1,131కి చేరింది. ఇప్పటివరకు 11మంది చనిపోయారు.

గుజరాత్​లో..

గుజరాత్​లో కొత్తగా 163 మందికి వైరస్ సోకింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 9,29కి చేరింది. 73 మందికి వైరస్ నయం కాగా... ఇరవై వేల మందిపై పరీక్షలు నిర్వహించారు.

బంగాల్​లో..

బంగాల్​లో 231 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 144 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా 10 మంది మృతిచెందారు.

కేరళలో మరో ఏడు కేసులు..

కేరళలో తాజాగా మరో ఏడుగురికి కరోనా సోకింది. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 3,88కి చేరగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 245 మందికి వైరస్ నుంచి కోలుకున్నారు.

ఇదీ చూడండి: మోదీ లాక్​డౌన్-2​ ప్రసంగం సూపర్​హిట్​.. టీవీల్లోనే 20 కోట్ల వీక్షణలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో వైరస్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 28 మంది ప్రాణాలు కోల్పోగా.. 826 మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 12,759కు చేరింది.

కరోనాలో 'మహా'..రాష్ట్ర

వైరస్ ప్రభావిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందంజలో ఉంది. అక్కడ కొత్తగా 286 మందికి వైరస్ సోకగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తంగా 3,401 మంది వైరస్ బాధితులు ఉన్నారు. 187 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా చనిపోయిన వారిలో 45 శాతం, కేసుల్లో దాదాపు 24 శాతం ఈ రాష్ట్రం వారే ఉన్నారు.

ఒక్క ముంబయి మహానగరంలోనే 2,073 వైరస్ కేసులు నమోదయ్యాయి. ఆరు రోజుల్లోనే కేసులు రెట్టింపవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడి ధారావి మురికివాడ ప్రాంతంలోనే ఒకే రోజు 26 కొత్త కేసులు వచ్చాయి. పుణెలో 4,19 మందికి పాజిటివ్​ ఫలితాలు వచ్చాయి. పాల్​ఘర్ జిల్లాలో 20 ప్రదేశాలను వైరస్ హాట్​స్పాట్​లుగా గుర్తించారు. ఈ రాష్ట్రంలో మొత్తం వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 295కు చేరింది.

దిల్లీలో ఆసుపత్రి సిబ్బంది నిర్బంధం..

దిల్లీలోని ఓ ఆసుపత్రికి చెందిన వైద్యులు, నర్సులు సహా 68 మంది వైద్య సిబ్బందిని స్వీయ నిర్బంధానికి పంపించారు. ఓ గర్భిణీ మహిళ కరోనాతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం. మొత్తంగా దిల్లీలో 1,652 మంది వైరస్ బారిన పడ్డారు. 32 మంది మరణించారు.

మధ్యప్రదేశ్​లో..

మధ్యప్రదేశ్​లో కొత్తగా 361మందికి వైరస్ పాజిటివ్​ ఫలితాలు వచ్చాయి. మొత్తంగా వైరస్ బాధితుల సంఖ్య 1,299కి చేరింది. గత 24 గంటల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో వైరస్ మరణాల సంఖ్య 63కు పెరిగింది. మొత్తం 52 జిల్లాలు ఉండగా.. 26 జిల్లాల్లో వైరస్​ కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన ఇండోర్​లో 47 మంది వైరస్​కు బలయ్యారు.

బిహార్​లో రెండేళ్ల చిన్నారికి..

బిహార్​లో ఓ రెండేళ్ల చిన్నారి సహా కొత్తగా పదిమందికి కరోనా సోకింది. ముంగేర్ జిల్లాకు చెందిన ఆ పసిపాప ఇంట్లోని ఐదుగురు సభ్యులు వైరస్ బారినపడ్డారు. కుటుంబంలోని వృద్ధుడికి కొవిడ్​-19 ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలో మొత్తంగా 80 కేసులు నమోదవగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఒడిశాలో విస్తృత పరీక్షలు..

ఒడిశాలో పెద్ద ఎత్తున కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే ఎనిమిది నుంచి పది రోజుల్లో వైరస్​ వ్యాప్తి నియంత్రణే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. మొత్తంగా ఒడిశాలో 60 కేసులు నమోదవగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

కశ్మీర్​లో 58 వేల మందిపై పర్యవేక్షణ..

జమ్ముకశ్మీర్​లో కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగారన్న అనుమానంతో 58,000 మందిని పర్యవేక్షణలో ఉంచారు అధికారులు. ఇందులో 7,463 మంది నిర్బంధ కేంద్రాల్లో ఉంచారు. 29,366 మంది గృహ నిర్బంధం సూచించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం ఐదువేలకు పైగా కరోనా పరీక్షలను నిర్వహించారు. ఇప్పటివరకు 400 పాజిటివ్​ కేసులు నమోదు కాగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

హరియాణాలో ఇంటింటి పరీక్షలు..

హరియాణాలో ఇంటింటి సర్వే చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఎవరైనా వైరస్ లక్షణాలతో ఉంటే వారి నమూనాలను పరీక్షలకు పంపనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 214 వైరస్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

యూపీలో తబ్లీగీతో..

ఉత్తర్​ప్రదేశ్​లో తబ్లీగీ జమాతే కార్యక్రమంలో పాల్గొన్న వారిలో 43 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. 24 గంటల వ్యవధిలో 67 కొత్త కరోనా కేసులు నమోదవగా.. వైరస్ బాధితుల సంఖ్య 7,27కు చేరింది. మరణాల సంఖ్య 13గా ఉంది.

రాజస్థాన్​లో..

రాజస్థాన్​లో కొత్తగా 55 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కేసుల సంఖ్య 1,131కి చేరింది. ఇప్పటివరకు 11మంది చనిపోయారు.

గుజరాత్​లో..

గుజరాత్​లో కొత్తగా 163 మందికి వైరస్ సోకింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 9,29కి చేరింది. 73 మందికి వైరస్ నయం కాగా... ఇరవై వేల మందిపై పరీక్షలు నిర్వహించారు.

బంగాల్​లో..

బంగాల్​లో 231 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 144 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తంగా 10 మంది మృతిచెందారు.

కేరళలో మరో ఏడు కేసులు..

కేరళలో తాజాగా మరో ఏడుగురికి కరోనా సోకింది. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 3,88కి చేరగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 245 మందికి వైరస్ నుంచి కోలుకున్నారు.

ఇదీ చూడండి: మోదీ లాక్​డౌన్-2​ ప్రసంగం సూపర్​హిట్​.. టీవీల్లోనే 20 కోట్ల వీక్షణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.