ETV Bharat / bharat

ఫోన్​ కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి

author img

By

Published : Apr 5, 2020, 10:32 AM IST

Updated : Apr 5, 2020, 10:39 AM IST

కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. నీటికుంటలో పడిపోయిన ఫోన్​ కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టకున్నారు. కరోనా వ్యాప్తి నుంచి తప్పించుకునేందుకు గ్రామానికి దూరంగా.. పొలంలో నివాసం ఏర్పరుచుకున్న ఆ కుటుంబం ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది.

Four children of single family died falling in farm pond at Belagavi in karnataka
ఫోన్​కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి!

కర్ణాటక బెలగావిలో హృదయ విదారక ఘటన జరిగింది. నలుగురు బిడ్డలతో కళకళలాడుతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఒకేరోజు ముక్కుపచ్చలారని నలుగురు చిన్నారుల మృతితో ఆ ప్రాంతమంతా కన్నీటిసంద్రమైంది.

Four children of single family died falling in farm pond at Belagavi in karnataka
ఫోన్​కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి!

కరోనా నుంచి కాపాడుకునేందుకు...

గోకాక్​ తాలూకా అజ్జనకట్టి గ్రామానికి చెందిన క్రెప్ప జక్కన్నవర, రాజశ్రీ జక్కన్నవర దంపతులకు నలుగురు సంతానం. కరోనా వ్యాప్తి నుంచి ఆ నలుగురు చిన్నారులను కాపాడుకునేందుకు కొద్దిరోజులుగా గ్రామానికి దూరంగా తమ పొలంలోనే నివాసముంటున్నారు. అక్కడ తమ బిడ్డలకు ఏ అపాయమూ కలగదని భావించారు. కానీ, విధి వారిపై కన్నెర్ర జేసింది. ఒకేసారి నలుగురు బిడ్డలను దూరం చేసింది.

మొబైల్​ ఫోన్​తో సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఫోన్​ పొలంలోని ఓ నీటిమడుగులో పడిపోయింది. ఫోన్​ను వెలికితీసే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరు ఆ నీటికుంటలోకి దిగారు చిన్నారులు. ఈ ప్రమాదంలో ఆరేళ్ల భగవవ, ఐదేళ్ల తాయమ్మ, నాలుగేళ్ల మలప్పలతోపాటు రెండేళ్ల చిన్నారి రాజశ్రీ మృతి చెందారు. గోకాక్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

four-children-of-single-family-died-falling-in-farm-pond-at-belagavi-in-karnataka
ఫోన్​ కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి
Four children of single family died falling in farm pit at Belagavi
ఫోన్​కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి!
Four children of single family died falling in farm pit at Belagavi
ఫోన్​కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి!
Four children of single family died falling in farm pit at Belagavi
ఫోన్​కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి!

ఇదీ చదవండి:ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్​

కర్ణాటక బెలగావిలో హృదయ విదారక ఘటన జరిగింది. నలుగురు బిడ్డలతో కళకళలాడుతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. ఒకేరోజు ముక్కుపచ్చలారని నలుగురు చిన్నారుల మృతితో ఆ ప్రాంతమంతా కన్నీటిసంద్రమైంది.

Four children of single family died falling in farm pond at Belagavi in karnataka
ఫోన్​కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి!

కరోనా నుంచి కాపాడుకునేందుకు...

గోకాక్​ తాలూకా అజ్జనకట్టి గ్రామానికి చెందిన క్రెప్ప జక్కన్నవర, రాజశ్రీ జక్కన్నవర దంపతులకు నలుగురు సంతానం. కరోనా వ్యాప్తి నుంచి ఆ నలుగురు చిన్నారులను కాపాడుకునేందుకు కొద్దిరోజులుగా గ్రామానికి దూరంగా తమ పొలంలోనే నివాసముంటున్నారు. అక్కడ తమ బిడ్డలకు ఏ అపాయమూ కలగదని భావించారు. కానీ, విధి వారిపై కన్నెర్ర జేసింది. ఒకేసారి నలుగురు బిడ్డలను దూరం చేసింది.

మొబైల్​ ఫోన్​తో సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఫోన్​ పొలంలోని ఓ నీటిమడుగులో పడిపోయింది. ఫోన్​ను వెలికితీసే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరు ఆ నీటికుంటలోకి దిగారు చిన్నారులు. ఈ ప్రమాదంలో ఆరేళ్ల భగవవ, ఐదేళ్ల తాయమ్మ, నాలుగేళ్ల మలప్పలతోపాటు రెండేళ్ల చిన్నారి రాజశ్రీ మృతి చెందారు. గోకాక్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

four-children-of-single-family-died-falling-in-farm-pond-at-belagavi-in-karnataka
ఫోన్​ కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి
Four children of single family died falling in farm pit at Belagavi
ఫోన్​కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి!
Four children of single family died falling in farm pit at Belagavi
ఫోన్​కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి!
Four children of single family died falling in farm pit at Belagavi
ఫోన్​కోసం మడుగులోకి దిగి నలుగురు చిన్నారులు మృతి!

ఇదీ చదవండి:ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్​

Last Updated : Apr 5, 2020, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.