ETV Bharat / bharat

'రైతుల ఆత్మహత్యల వివరాలు ఇచ్చేందుకు వీలుకాదు'

author img

By

Published : Sep 21, 2020, 4:03 PM IST

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎంతమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై స్పష్టత ఇవ్వలేమని కేంద్రం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆ వివరాలను ప్రభుత్వానికి నివేదించకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Farmer suicide rate 'untenable' as states, UTs did not provide: Home Ministry in Rajya Sabha
రైతుల ఆత్మహత్యల వివరాలు ఇచ్చేందుకు వీలుకాదు

దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను ఈ ఏడాది అందించడం వీలుకాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ).. రైతుల బలవన్మరణానికి పాల్పడిన వివరాలను ఇప్పటివరకు తమ దృష్టకి తీసుకురాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో(ఎన్​సీఆర్బీ)​ ప్రకారం.. ఆయా రాష్ట్రాలు, యూటీలు.. రైతులు, కూలీల ఆత్మహత్యల సమాచారం 'నిల్(ఏమీ లేనట్లు)​'గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. కేవలం రైతులు కాకుండా.. ఎలాంటి మృతుల వివరాలు అందులో పొందుపరచలేదన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగంలో.. దేశవ్యాప్త రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ఇచ్చేందుకు సాధ్యపడదని రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు కిషన్​ రెడ్డి.

'ఎన్​సీఆర్బీ' లెక్కలివే..

ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలు, ఆత్మహత్యలపై.. ఎన్​సీఆర్బీ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2018లో 10,357 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడగా.. 2019లో ఆ సంఖ్య 10,281కి తగ్గింది. వీరిలో 5,957 మంది రైతులు, 4,324 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయరంగంలో ఆత్మహత్య రేటును దేశంతో పోల్చగా 7.4 శాతం ఉంది.

ఇదీ చదవండి: ఉప్పు వాడకం పెరిగితే ఇన్ని అనర్థాలా?

దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలను ఈ ఏడాది అందించడం వీలుకాదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు(యూటీ).. రైతుల బలవన్మరణానికి పాల్పడిన వివరాలను ఇప్పటివరకు తమ దృష్టకి తీసుకురాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో(ఎన్​సీఆర్బీ)​ ప్రకారం.. ఆయా రాష్ట్రాలు, యూటీలు.. రైతులు, కూలీల ఆత్మహత్యల సమాచారం 'నిల్(ఏమీ లేనట్లు)​'గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. కేవలం రైతులు కాకుండా.. ఎలాంటి మృతుల వివరాలు అందులో పొందుపరచలేదన్నారు. ఫలితంగా వ్యవసాయ రంగంలో.. దేశవ్యాప్త రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ఇచ్చేందుకు సాధ్యపడదని రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు కిషన్​ రెడ్డి.

'ఎన్​సీఆర్బీ' లెక్కలివే..

ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలు, ఆత్మహత్యలపై.. ఎన్​సీఆర్బీ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2018లో 10,357 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడగా.. 2019లో ఆ సంఖ్య 10,281కి తగ్గింది. వీరిలో 5,957 మంది రైతులు, 4,324 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. వ్యవసాయరంగంలో ఆత్మహత్య రేటును దేశంతో పోల్చగా 7.4 శాతం ఉంది.

ఇదీ చదవండి: ఉప్పు వాడకం పెరిగితే ఇన్ని అనర్థాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.