ETV Bharat / bharat

రిషికేశ్​లో ముగిసిన కమలేశ్​ అంత్యక్రియలు

author img

By

Published : Apr 27, 2020, 3:41 PM IST

ఈటీవీ భారత్​ సహాయం, దిల్లీ హైకోర్టు చొరవతో.. కమలేశ్​ భట్​ అంత్యక్రియలు సోమవారం ఉత్తరాఖండ్​లోని రిషికేశ్​లో ముగిశాయి. అంత్యక్రియలకు 8మంది కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించారు. ఉపాధి కోసం అబుధాబి వెళ్లి ఈ నెల 17న గుండెపోటుతో మరణించాడు 24ఏళ్ల భట్​.

ETV Bharat Impact: Kamlesh Bhatt cremated in Rishikesh in presence of family members
ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: రిషీకేశ్​లో కమలేశ్​ అంత్యక్రియలు

ఉత్తరాఖండ్​లోని రిషికేశ్​ పూర్ణానంద ఘాట్​లో కమలేశ్​ భట్​ అంత్యక్రియలు ముగిశాయి. దేశం లాక్​డౌన్​లో ఉన్నందున కేవలం 8మంది కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతినిచ్చారు అధికారులు. కమలేశ్​ తండ్రి, సోదరుడు విమలేశ్​ భట్​ సహా మరో ఆరుగురు అంత్యక్రియలకు హాజరయ్యారు.

ETV Bharat Impact: Kamlesh Bhatt cremated in Rishikesh in presence of family members
ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: రిషీకేశ్​లో కమలేశ్​ అంత్యక్రియలు

ఈటీవీ భారత్​ సాయంతో...

ఉపాధి కోసం అబుధాబి వెళ్లి ఈనెల 17న గుండెపోటుతో మరణించిన ఉత్తరాఖండ్ తెహ్రీకి చెందిన కమలేశ్ భట్ మృతదేహం 'ఈటీవీ భారత్' చొరవతో​ పది రోజుల తర్వాత ఇల్లు చేరింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు అధికారులు.

కమలేశ్ మృతదేహం అబుధాబి నుంచి భారత్​కు రావటం ఇది రెండోసారి. ఈనెల 23న మొదటిసారి అబుధాబి ఎతిహాడ్ విమానాశ్రయం నుంచి దిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది భట్ మృతదేహం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన లాక్​డౌన్ నిబంధనల వల్ల ఎలాంటి ప్యాకేజీని స్వీకరించేందుకు అనుమతులు లేవని కార్గో సిబ్బంది స్పష్టం చేశారు. విమానాశ్రయానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు అప్పగించకుండా గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని వచ్చిన విమానంలోనే తిరిగి అబుధాబి పంపించారు.

మృతదేహాన్ని తిప్పి పంపించటంపై ఈటీవీ భారత్​తో తమ గోడు వెళ్లబోసుకున్నారు అతడి కుటుంబ సభ్యులు. ఈ హృదయ విదారక ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించింది ఈటీవీ భారత్​.

కమలేశ్ భట్ మృతదేహాన్ని తిరిగి పంపటంపై న్యాయవాదులు రితుపర్ణ యునియాల్, అభిషేక్​ కుమార్ కోర్టును ఆశ్రయించారు. అమానవీయంగా, నిర్లక్ష్యంగా సంబంధిత అధికారులు వ్యవహరించారని, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని.. వచ్చిన విమానంలోనే తిరిగి పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు.

ఈ నేపథ్యంలో విదేశాల్లోని భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. అయితే మృత దేహాల తరలింపునకు ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫెట్​ను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- ఆస్పత్రిపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

ఉత్తరాఖండ్​లోని రిషికేశ్​ పూర్ణానంద ఘాట్​లో కమలేశ్​ భట్​ అంత్యక్రియలు ముగిశాయి. దేశం లాక్​డౌన్​లో ఉన్నందున కేవలం 8మంది కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతినిచ్చారు అధికారులు. కమలేశ్​ తండ్రి, సోదరుడు విమలేశ్​ భట్​ సహా మరో ఆరుగురు అంత్యక్రియలకు హాజరయ్యారు.

ETV Bharat Impact: Kamlesh Bhatt cremated in Rishikesh in presence of family members
ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: రిషీకేశ్​లో కమలేశ్​ అంత్యక్రియలు

ఈటీవీ భారత్​ సాయంతో...

ఉపాధి కోసం అబుధాబి వెళ్లి ఈనెల 17న గుండెపోటుతో మరణించిన ఉత్తరాఖండ్ తెహ్రీకి చెందిన కమలేశ్ భట్ మృతదేహం 'ఈటీవీ భారత్' చొరవతో​ పది రోజుల తర్వాత ఇల్లు చేరింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు అధికారులు.

కమలేశ్ మృతదేహం అబుధాబి నుంచి భారత్​కు రావటం ఇది రెండోసారి. ఈనెల 23న మొదటిసారి అబుధాబి ఎతిహాడ్ విమానాశ్రయం నుంచి దిల్లీ ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది భట్ మృతదేహం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన లాక్​డౌన్ నిబంధనల వల్ల ఎలాంటి ప్యాకేజీని స్వీకరించేందుకు అనుమతులు లేవని కార్గో సిబ్బంది స్పష్టం చేశారు. విమానాశ్రయానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు అప్పగించకుండా గంటల వ్యవధిలోనే మృతదేహాన్ని వచ్చిన విమానంలోనే తిరిగి అబుధాబి పంపించారు.

మృతదేహాన్ని తిప్పి పంపించటంపై ఈటీవీ భారత్​తో తమ గోడు వెళ్లబోసుకున్నారు అతడి కుటుంబ సభ్యులు. ఈ హృదయ విదారక ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషించింది ఈటీవీ భారత్​.

కమలేశ్ భట్ మృతదేహాన్ని తిరిగి పంపటంపై న్యాయవాదులు రితుపర్ణ యునియాల్, అభిషేక్​ కుమార్ కోర్టును ఆశ్రయించారు. అమానవీయంగా, నిర్లక్ష్యంగా సంబంధిత అధికారులు వ్యవహరించారని, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని.. వచ్చిన విమానంలోనే తిరిగి పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు.

ఈ నేపథ్యంలో విదేశాల్లోని భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. అయితే మృత దేహాల తరలింపునకు ఆరోగ్య శాఖ, విదేశాంగ శాఖల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫెట్​ను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- ఆస్పత్రిపై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.