ETV Bharat / bharat

దెయ్యాల భయం.. శ్మశానవాటికలో ఉత్సవాలు!

author img

By

Published : Feb 19, 2020, 10:12 PM IST

Updated : Mar 1, 2020, 9:37 PM IST

ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేంత విజ్ఞానం పెరిగినా.. ఆ ఊరు మాత్రం దెయ్యాలు, భూతాలు అనే అపోహలతో భయపడుతోంది. దెయ్యాలు లేవని గ్రామస్థులకు చెప్పేందుకు ఆ ఊర్లోని లింగాయత్​ సంఘం ఓ ఉత్సవాన్ని నిర్వహించింది. గ్రామస్థులంతా ఆ వేడుకల్లో పాల్గొని ఎలాంటి అదృశ్య శక్తులు లేవని.. మూఢ నమ్మకాలను వీడి ఆనందంగా జీవనం సాగించడం ఆరంభించారు.

Devotional ceremony in graveyard to end the superstitions
మూఢనమ్మకాలను తొలగించేందుకు ఉత్సవ వేడుకలు
దెయ్యాల భయం.. శ్మశానవాటికలో ఉత్సవాలు!

మహారాష్ట్రలో అష్టా గ్రామంలో మూఢ నమ్మకాన్ని తొలగించేందుకు.. ఆ ఊరి లింగాయత్​ సంఘం ముందుకొచ్చింది. మూడురోజుల పాటు ఉత్సవాలను నిర్వహించింది. వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొనగా.. వారిలో దెయ్యాలు ఉన్నాయన్న మూఢనమ్మకాన్ని తొలగించారు.

ఓ వ్యక్తి చొరవతో...

అష్టా గ్రామంలోని శ్మశాన వాటికలో దెయ్యాలు తిరుగుతున్నాయని గ్రామస్థులు నమ్మేవారు. ఆ అపోహను తొలగించేందుకు ప్రకాశ్​ మహాజన్​ అనే వ్యక్తి చొరవచూపారు. ఆయనతోపాటు లింగాయత్​ సంఘం ముందుకు వచ్చి దెయ్యాలు లేవని నిరూపించాలని నిర్ణయించారు. శ్మశానంలో ఉత్సవాన్ని నిర్వహించారు. గ్రామస్థులను అక్కడికి వచ్చేలా చేశారు. మూడురోజుల పాటు వేడుకలను నిర్వహించి వారిలో ఉన్న అపోహను తొలగించారు.

శ్మశాన వాటికలో పాత సమాధులను తొలగించి.. ఓ చిన్న శివాలయాన్ని నిర్మించారు.

"దేవుడి గురించి తెలుసుకోవాలంటే జీవితం ముగిసే ప్రదేశానికి వెళ్లాలి. ఎవరి జీవితమైనా శ్మశాన వాటికలోనే ముగుస్తుంది. అందుకే ఆ భగవంతుడిని ఆరాధించడానికి, జీవితాన్ని స్వీకరించడానికి ఇంతకుమించిన ప్రదేశం మరొకటి లేదు."

- ప్రకాశ్​ మహాజన్​, ఉత్సవ నిర్వాహకుడు

అయితే.. గ్రామంలో శ్మశానవాటిక కోసం రెండెకరాల స్థలాన్ని కేటాయించారని స్థానిక వ్యక్తి వివేక్​ మహాజన్ తెలిపారు. అక్కడే మొక్కలు నాటారు. ఆ ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: ప్రకృతిని ఆస్వాదించే పిల్లలకు ఆ లక్షణాలు ఎక్కువే!

దెయ్యాల భయం.. శ్మశానవాటికలో ఉత్సవాలు!

మహారాష్ట్రలో అష్టా గ్రామంలో మూఢ నమ్మకాన్ని తొలగించేందుకు.. ఆ ఊరి లింగాయత్​ సంఘం ముందుకొచ్చింది. మూడురోజుల పాటు ఉత్సవాలను నిర్వహించింది. వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొనగా.. వారిలో దెయ్యాలు ఉన్నాయన్న మూఢనమ్మకాన్ని తొలగించారు.

ఓ వ్యక్తి చొరవతో...

అష్టా గ్రామంలోని శ్మశాన వాటికలో దెయ్యాలు తిరుగుతున్నాయని గ్రామస్థులు నమ్మేవారు. ఆ అపోహను తొలగించేందుకు ప్రకాశ్​ మహాజన్​ అనే వ్యక్తి చొరవచూపారు. ఆయనతోపాటు లింగాయత్​ సంఘం ముందుకు వచ్చి దెయ్యాలు లేవని నిరూపించాలని నిర్ణయించారు. శ్మశానంలో ఉత్సవాన్ని నిర్వహించారు. గ్రామస్థులను అక్కడికి వచ్చేలా చేశారు. మూడురోజుల పాటు వేడుకలను నిర్వహించి వారిలో ఉన్న అపోహను తొలగించారు.

శ్మశాన వాటికలో పాత సమాధులను తొలగించి.. ఓ చిన్న శివాలయాన్ని నిర్మించారు.

"దేవుడి గురించి తెలుసుకోవాలంటే జీవితం ముగిసే ప్రదేశానికి వెళ్లాలి. ఎవరి జీవితమైనా శ్మశాన వాటికలోనే ముగుస్తుంది. అందుకే ఆ భగవంతుడిని ఆరాధించడానికి, జీవితాన్ని స్వీకరించడానికి ఇంతకుమించిన ప్రదేశం మరొకటి లేదు."

- ప్రకాశ్​ మహాజన్​, ఉత్సవ నిర్వాహకుడు

అయితే.. గ్రామంలో శ్మశానవాటిక కోసం రెండెకరాల స్థలాన్ని కేటాయించారని స్థానిక వ్యక్తి వివేక్​ మహాజన్ తెలిపారు. అక్కడే మొక్కలు నాటారు. ఆ ప్రదేశంలో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి: ప్రకృతిని ఆస్వాదించే పిల్లలకు ఆ లక్షణాలు ఎక్కువే!

Last Updated : Mar 1, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.