ETV Bharat / bharat

దేశంలో మరో 11,502 కేసులు.. 325 మరణాలు

author img

By

Published : Jun 15, 2020, 9:32 AM IST

Updated : Jun 15, 2020, 10:02 AM IST

భారత్​లో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాలుస్తూనే ఉంది. కేసులతో సహా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతూ పదివేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,502 కేసులు బయటపడ్డాయి. మరో 325 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

Corona virus cases and death toll in India
దేశంలో ఒక్కరజులోనే 11,502 కేసులు.. 325 మంది మృతి

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 11,502 మంది వైరస్​ బారినపడగా.. మరో 325 మంది మహమ్మారితో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9520 కు పెరగ్గా.. బాధితుల సంఖ్య 3,32,424 లకు చేరింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Corona virus cases and death toll in India
దేశంలో కరోనా కేసుల వివరాలు

అత్యధిక మరణాలు గల రాష్ట్రాలివే..

మొత్తం మరణాల్లో ఎక్కువగా.. మహారాష్ట్రలో 3850 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్​లో 1477 మంది, దిల్లీలో 1327 మంది, బంగాల్​లో 475 మంది, మధ్యప్రదేశ్​లో 459 చొప్పున మృతి చెందారు.

ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట

దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 11,502 మంది వైరస్​ బారినపడగా.. మరో 325 మంది మహమ్మారితో మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 9520 కు పెరగ్గా.. బాధితుల సంఖ్య 3,32,424 లకు చేరింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న కేసుల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Corona virus cases and death toll in India
దేశంలో కరోనా కేసుల వివరాలు

అత్యధిక మరణాలు గల రాష్ట్రాలివే..

మొత్తం మరణాల్లో ఎక్కువగా.. మహారాష్ట్రలో 3850 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్​లో 1477 మంది, దిల్లీలో 1327 మంది, బంగాల్​లో 475 మంది, మధ్యప్రదేశ్​లో 459 చొప్పున మృతి చెందారు.

ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట

Last Updated : Jun 15, 2020, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.