ETV Bharat / bharat

అంగన్​వాడీ కేంద్రాల్లోనే కొవిడ్​ టీకా పంపిణీ!

author img

By

Published : Nov 6, 2020, 10:06 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాక్సిన్​ పంపిణీకి కసరత్తు ప్రారంభించింది కేంద్రం. టీకాలు వేసేందుకు అంగన్​వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు సహా ప్రభుత్వ సముదాయాలను వినియోగించాలని నిర్ణయించింది. అవసరమైన టీకా పంపిణీ బూత్​లను గుర్తించే బాధ్యతను రాష్ట్రాలుకే అప్పగించింది. టీకా సరఫరా నుంచి పంపిణీ వరకు మొత్తం ప్రక్రియను కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్​ విభాగం 'ఈ-విన్'​ ద్వారా పర్యవేక్షించనున్నారు.

COVID-19 vaccination sites
కొవిడ్​ టీకా పంపిణీ

భారత్​లోని కరోనా మహమ్మారి టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. టీకా పంపిణీపై కసరత్తు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్​ వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాలతో పాటు అంగన్​వాడీలు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు సహా అలాంటి ప్రభుత్వ భవనాలను పెద్ద ఎత్తున వినియోగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్​ విభాగం ఈ-విన్​(ఎలక్ట్రానిక్​ వ్యాక్సిన్​ ఇంటిలిజెన్స్​ నెట్​వర్క్​) పర్యవేక్షించనుంది. లబ్ధిదారులను గుర్తించేందుకు సందేశాలు పంపటం సహా ప్రతి ఒక్కరికి క్యూఆర్​ కోడ్​ను ఇవ్వనున్నారు.

కీలక అంశాలు..

  • ప్రస్తుతం వినియోగంలో ఉన్న యూనివర్సల్​ ఇమ్యునైజేషన్​ ప్రోగ్రాం(యూఐపీ)కు సమాంతరంగా ప్రత్యేక కొవిడ్​-19 ఇమ్యునైజేషన్​ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీకా బూత్​లకు అవసరమైన భవనాలను రాష్ట్ర ప్రభుత్వాలే గుర్తిస్తాయి.
  • ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్​ ఫ్లాట్​ఫాం ఈ-విన్​ను మరింత అభివృద్ధి చేసి.. కొవిడ్​-19 టీకా పంపిణీ, సరఫరాను సమర్థవంతంగా చేపట్టేందుకు వినియోగించనున్నారు. టీకా తీసుకోవాల్సిన వారికి సరైన సమయం, తేదీ, కేంద్రం వంటి వివరాలతో సంక్షిప్త సందేశాలు పంపించనున్నారు. టీకా వేయించుకున్నవారిని గుర్తించటం, వారితో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉండేందుకు ఈ డిజిటల్​ ఫ్లాట్​ఫాం కీలకంగా మారనుంది.
  • టీకా వేయాల్సిన జాబితాలో ఉన్న ప్రతిఒక్కరి ఆధార్​ నంబర్​ను డిజిటల్​ విభాగంతో లింక్​ చేస్తారు. దీంతో అవినీతికి ఆస్కారం ఉండదు. టీకా వేసిన, వేయించుకోవాల్సిన వారిని సులభంగా గుర్తించవచ్చు. ఆధార్​ లేని వారు.. ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది.
  • ఈ-విన్​ వ్యవస్థ రియల్​టైమ్​లో దేశవ్యాప్తంగా ఉన్న కోల్డ్​ చైన్​ పాయింట్స్​లోని స్టాక్​, స్టోరేజీ ఉష్ణోగ్రత వంటి వాటిని తెలియజేస్తుంది.
  • టీకా అందుబాటులోకి రాగానే ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు, జిల్లాల నెట్​వర్క్​ల ద్వారా ఈ టీకా అందాల్సిన ప్రాధాన్యతా సమూహాలకు అందుబాటులో ఉంచటానికి.. కేంద్రమే నేరుగా కొనుగోలు చేస్తుంది. వారికి ఉచితంగా అందిస్తుంది.
  • తొలి దఫాలో వ్యాక్సిన్​ అందించాల్సిన సుమారు 30 కోట్ల మందిని గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది కేంద్రం. అందులో నాలుగు విభాగాలుగా విభజించింది. తొలి కేటగిరీలో 1 కోటి మంది ఆరోగ్య నిపుణులు, వైద్యులు, ఎంబీబీఎస్​ విద్యార్థులు, నర్సులు, ఆశా కార్యకర్తలు ఉంటారు. రెండో కేటగిరీలో 2 కోట్ల మంది పురపాలక కార్మికులు, పోలీసులు, సాయుధ దళాలు ఉంటాయి. మూడో కేటగిరీలో 50 ఏళ్లకు పైబడిన వాళ్లు, నాలుగో కేటగిరీలో ప్రత్యేక సంరక్షణ అవసరమైన 50ఏళ్ల లోపువారిని ఎంపిక చేయనున్నారు.
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 28వేల వ్యాక్సిన్​ స్టోరేజీ కోల్డ్​ చైన్​ కేంద్రాలు ఉన్నాయి. మరింత ఎక్కువ డోస్​లు స్టోరేజీ చేసేందుకు ప్రైవేటు రంగంలోని కేంద్రాలను గుర్తించే పనిలో పడింది కేంద్రం.

అందరిని భాగస్వామ్యం చేయాలి: మోదీ

గత నెలలో నిర్వహించిన సమీక్షా సమీవేశంలో కీలక సూచనలు చేశారు మోదీ. ఎన్నికలు, విపత్తులను విజయవంతంగా నిర్వహించిన అనుభవాన్ని.. వ్యాక్సిన్​ సరఫరా, పంపిణీకి వినియోగించాలని అధికారులకు సూచించారు ప్రధాని. జిల్లాస్థాయి అధికారులు, పౌర సమాజ సంస్థలు, వలంటీర్లు, పౌరులు, అవసరమైన అన్ని విభాగల నిపుణులను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. వచ్చే ఏడాది జులై నాటికి కనీసం 25 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించే లక్ష్యంగా 50 కోట్ల డోస్​లను కొనుగోలు చేయాలనే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. ఈ ప్రక్రియ ఏడాదంతా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ సరఫరాకు వనరుల సమస్య లేదు'

భారత్​లోని కరోనా మహమ్మారి టీకా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. టీకా పంపిణీపై కసరత్తు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్​ వేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కేంద్రాలతో పాటు అంగన్​వాడీలు, పాఠశాలలు, పంచాయతీ భవనాలు సహా అలాంటి ప్రభుత్వ భవనాలను పెద్ద ఎత్తున వినియోగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్​ విభాగం ఈ-విన్​(ఎలక్ట్రానిక్​ వ్యాక్సిన్​ ఇంటిలిజెన్స్​ నెట్​వర్క్​) పర్యవేక్షించనుంది. లబ్ధిదారులను గుర్తించేందుకు సందేశాలు పంపటం సహా ప్రతి ఒక్కరికి క్యూఆర్​ కోడ్​ను ఇవ్వనున్నారు.

కీలక అంశాలు..

  • ప్రస్తుతం వినియోగంలో ఉన్న యూనివర్సల్​ ఇమ్యునైజేషన్​ ప్రోగ్రాం(యూఐపీ)కు సమాంతరంగా ప్రత్యేక కొవిడ్​-19 ఇమ్యునైజేషన్​ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీకా బూత్​లకు అవసరమైన భవనాలను రాష్ట్ర ప్రభుత్వాలే గుర్తిస్తాయి.
  • ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని డిజిటల్​ ఫ్లాట్​ఫాం ఈ-విన్​ను మరింత అభివృద్ధి చేసి.. కొవిడ్​-19 టీకా పంపిణీ, సరఫరాను సమర్థవంతంగా చేపట్టేందుకు వినియోగించనున్నారు. టీకా తీసుకోవాల్సిన వారికి సరైన సమయం, తేదీ, కేంద్రం వంటి వివరాలతో సంక్షిప్త సందేశాలు పంపించనున్నారు. టీకా వేయించుకున్నవారిని గుర్తించటం, వారితో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉండేందుకు ఈ డిజిటల్​ ఫ్లాట్​ఫాం కీలకంగా మారనుంది.
  • టీకా వేయాల్సిన జాబితాలో ఉన్న ప్రతిఒక్కరి ఆధార్​ నంబర్​ను డిజిటల్​ విభాగంతో లింక్​ చేస్తారు. దీంతో అవినీతికి ఆస్కారం ఉండదు. టీకా వేసిన, వేయించుకోవాల్సిన వారిని సులభంగా గుర్తించవచ్చు. ఆధార్​ లేని వారు.. ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది.
  • ఈ-విన్​ వ్యవస్థ రియల్​టైమ్​లో దేశవ్యాప్తంగా ఉన్న కోల్డ్​ చైన్​ పాయింట్స్​లోని స్టాక్​, స్టోరేజీ ఉష్ణోగ్రత వంటి వాటిని తెలియజేస్తుంది.
  • టీకా అందుబాటులోకి రాగానే ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు, జిల్లాల నెట్​వర్క్​ల ద్వారా ఈ టీకా అందాల్సిన ప్రాధాన్యతా సమూహాలకు అందుబాటులో ఉంచటానికి.. కేంద్రమే నేరుగా కొనుగోలు చేస్తుంది. వారికి ఉచితంగా అందిస్తుంది.
  • తొలి దఫాలో వ్యాక్సిన్​ అందించాల్సిన సుమారు 30 కోట్ల మందిని గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది కేంద్రం. అందులో నాలుగు విభాగాలుగా విభజించింది. తొలి కేటగిరీలో 1 కోటి మంది ఆరోగ్య నిపుణులు, వైద్యులు, ఎంబీబీఎస్​ విద్యార్థులు, నర్సులు, ఆశా కార్యకర్తలు ఉంటారు. రెండో కేటగిరీలో 2 కోట్ల మంది పురపాలక కార్మికులు, పోలీసులు, సాయుధ దళాలు ఉంటాయి. మూడో కేటగిరీలో 50 ఏళ్లకు పైబడిన వాళ్లు, నాలుగో కేటగిరీలో ప్రత్యేక సంరక్షణ అవసరమైన 50ఏళ్ల లోపువారిని ఎంపిక చేయనున్నారు.
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 28వేల వ్యాక్సిన్​ స్టోరేజీ కోల్డ్​ చైన్​ కేంద్రాలు ఉన్నాయి. మరింత ఎక్కువ డోస్​లు స్టోరేజీ చేసేందుకు ప్రైవేటు రంగంలోని కేంద్రాలను గుర్తించే పనిలో పడింది కేంద్రం.

అందరిని భాగస్వామ్యం చేయాలి: మోదీ

గత నెలలో నిర్వహించిన సమీక్షా సమీవేశంలో కీలక సూచనలు చేశారు మోదీ. ఎన్నికలు, విపత్తులను విజయవంతంగా నిర్వహించిన అనుభవాన్ని.. వ్యాక్సిన్​ సరఫరా, పంపిణీకి వినియోగించాలని అధికారులకు సూచించారు ప్రధాని. జిల్లాస్థాయి అధికారులు, పౌర సమాజ సంస్థలు, వలంటీర్లు, పౌరులు, అవసరమైన అన్ని విభాగల నిపుణులను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. వచ్చే ఏడాది జులై నాటికి కనీసం 25 కోట్ల మందికి వ్యాక్సిన్​ అందించే లక్ష్యంగా 50 కోట్ల డోస్​లను కొనుగోలు చేయాలనే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. ఈ ప్రక్రియ ఏడాదంతా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'వ్యాక్సిన్ సరఫరాకు వనరుల సమస్య లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.