ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా​ కేసులు

author img

By

Published : Aug 10, 2021, 10:04 AM IST

దేశంలో రోజువారీగా కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 28,204 మందికి వైరస్​ సోకింది. మరో 373 మంది ప్రాణాలు కోల్పోయారు.

India covid cases, Coronavirus deaths
కరోనా కేసులు

భారత్​లో రోజువారి నమోదవుతున్న కొవిడ్​ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 28,204 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 373 మంది మరణించారు. కొత్తగా 41,511 మంది కరోనా​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.45 శాతానికి చేరగా.. క్రియాశీలక కేసులు 1.21శాతానికి తగ్గాయి.

మొత్తం కేసులు: 31,998,158

మొత్తం మరణాలు: 4,28,682

కోలుకున్నవారు: 3,11,80,968

యాక్టివ్​ కేసులు: 3,88,508

వ్యాక్సినేషన్​

దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ నిర్విరమంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 54,91,647 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 51,45,00,268 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

కొవిడ్​ పరీక్షలు

సోమవారం ఒక్కరోజే దేశంలో 15,11,313 కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 48,32,78,545 కు చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు..

  • కేరళలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 13,049 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 105 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 4,005 మందికి కరోనా సోకింది. 7,568 మంది కోలుకోగా.. 68 మంది మృతిచెందారు.
  • తమిళనాడులో 1,929 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 23 మంది బలయ్యారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,186 కేసులు నమోదయ్యాయి. 1,776 మంది కోలుకోగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 886 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 66 మంది మృతిచెందారు.
  • హిమాచల్​ ప్రదేశ్​లో కొత్తగా 310 మందికి కరోనా సోకింది. 185 మంది కోలుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా ఒకరు చనిపోయారు.
  • బంగాల్​లో కొత్తగా 557 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 11 మంది మరణించారు.

ఇదీ చూడండి: పిడుగుపాటుకు 24 మంది మృతి

భారత్​లో రోజువారి నమోదవుతున్న కొవిడ్​ కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 28,204 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 373 మంది మరణించారు. కొత్తగా 41,511 మంది కరోనా​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.45 శాతానికి చేరగా.. క్రియాశీలక కేసులు 1.21శాతానికి తగ్గాయి.

మొత్తం కేసులు: 31,998,158

మొత్తం మరణాలు: 4,28,682

కోలుకున్నవారు: 3,11,80,968

యాక్టివ్​ కేసులు: 3,88,508

వ్యాక్సినేషన్​

దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ నిర్విరమంగా కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 54,91,647 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 51,45,00,268 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.

కొవిడ్​ పరీక్షలు

సోమవారం ఒక్కరోజే దేశంలో 15,11,313 కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 48,32,78,545 కు చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు..

  • కేరళలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 13,049 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 105 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మహారాష్ట్రలో కొత్తగా 4,005 మందికి కరోనా సోకింది. 7,568 మంది కోలుకోగా.. 68 మంది మృతిచెందారు.
  • తమిళనాడులో 1,929 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 23 మంది బలయ్యారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,186 కేసులు నమోదయ్యాయి. 1,776 మంది కోలుకోగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 886 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 66 మంది మృతిచెందారు.
  • హిమాచల్​ ప్రదేశ్​లో కొత్తగా 310 మందికి కరోనా సోకింది. 185 మంది కోలుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా ఒకరు చనిపోయారు.
  • బంగాల్​లో కొత్తగా 557 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 11 మంది మరణించారు.

ఇదీ చూడండి: పిడుగుపాటుకు 24 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.