Young Man Died while Making a Reel : రీల్స్ చేయాలనే పిచ్చి ఆ యువకుడి ప్రాణాలనే తీసుకుంది. మెడకు ఉరి వేసుకొని సెల్ఫోన్లో చిత్రీకరించే క్రమంలో మెడకు తాడు బిగుసుకుపోవడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి జరిగింది. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.
నర్సంపేటకు చెందిన యువకుడు అజయ్ ఓ హోటల్లో పని చేస్తున్నాడు. మంగళవారం తన చిన్నక్క ఇంటికి వెళ్లి రీల్ చేసే క్రమంలో సెల్ఫోన్ను ఫ్రిజ్పై ఉంచి దూలానికి ఉరి వేసుకుంటూ దానిని చిత్రీకరించాలనుకున్నాడు. ఈ క్రమంలో తాడు బిగుసుకుపోవడంతో మృతి చెందాడు. కుమారుడి మృతిపై తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.