ETV Bharat / snippets

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య - కొనసాగుతున్న గాలింపు చర్యలు

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 3:34 PM IST

Updated : Aug 5, 2024, 4:05 PM IST

Women Suicide In Bhadradri Kothagudem
Wife Suicide In Bhadradri Kothagudem (ETV Bharat)

Women Suicide In Bhadradri Kothagudem : భర్తతో గొడవపడి భార్య గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. బూర్గంపాడు మండలం నారపాకలోని గాంధీనగర్ కాలనీకి చెందిన భూక్య గణేష్, శైలజకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈరోజు ఉదయం భార్యాభర్తలు గొడవపడి భార్య శైలజ గోదావరి నది వద్దకు వెళ్లి 20వ నంబర్ పోల్ వద్ద నుంచి నదిలోకి దూకింది.

గోదావరి నది వద్దకు చేరుకున్న భర్త గణేష్, శైలజ కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు గోదావరి నదిలో గల్లంతైన వివాహిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నీటిమట్టం ఎక్కువగా ఉండటం వల్ల గల్లంతైన వివాహితను వెతకడం కష్టతరంగా మారింది.

Women Suicide In Bhadradri Kothagudem : భర్తతో గొడవపడి భార్య గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. బూర్గంపాడు మండలం నారపాకలోని గాంధీనగర్ కాలనీకి చెందిన భూక్య గణేష్, శైలజకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈరోజు ఉదయం భార్యాభర్తలు గొడవపడి భార్య శైలజ గోదావరి నది వద్దకు వెళ్లి 20వ నంబర్ పోల్ వద్ద నుంచి నదిలోకి దూకింది.

గోదావరి నది వద్దకు చేరుకున్న భర్త గణేష్, శైలజ కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు గోదావరి నదిలో గల్లంతైన వివాహిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నీటిమట్టం ఎక్కువగా ఉండటం వల్ల గల్లంతైన వివాహితను వెతకడం కష్టతరంగా మారింది.

Last Updated : Aug 5, 2024, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.