Woman Suicide with Child in Narsingi : అనుమానాస్పద స్థితిలో మూడేళ్ల కుమార్తెతో కలిసి ఓ తల్లి బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నార్సింగి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని భీమవరానికి చెందిన మానస తన భర్త, కుమార్తెతో కలిసి నార్సింగి సమీపంలోని మై హోం అవతార్లో నివాసం ఉంటున్నారు.
భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి కుమార్తె కృషితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకి మానస ఆత్యహత్యకు పాల్పడింది. ఇందుకు అనారోగ్యమే కారణం కావొచ్చని నార్సింగి ఇన్స్పెక్టర్ హరిక్రిష్ణారెడ్డి తెలిపారు. ఆమె వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు మృతురాలి సోదరుడు చెప్పారు.