ETV Bharat / snippets

సూర్యాపేటలో విషాదం - క్వారీ గుంతలో పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సహా ముగ్గురి మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 11:43 AM IST

Updated : Jul 17, 2024, 12:32 PM IST

Three died after going swimming
Three Died After Swimming in Quarry Pits (ETV Bharat)

Three People Died After Falling into the Quarry Pit : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం బొప్పారంలో విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తండ్రి రాజు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శ్రీపాల్‌రెడ్డి, రాజు స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్‌రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

మంగళవారం రోజున బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి ఇరు కుటుంబాలతో కలిసి వెళ్లారు. ఇవాళ ఉదయం శ్రీపాల్‌రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) కలిసి క్వారీ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలోకి జారిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్‌రెడ్డి అందులోకి దిగారు. కానీ ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Three People Died After Falling into the Quarry Pit : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం బొప్పారంలో విషాదం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తండ్రి రాజు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. శ్రీపాల్‌రెడ్డి, రాజు స్నేహితులు. వీరిద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. శ్రీపాల్‌రెడ్డి బిల్డర్‌గా, రాజు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

మంగళవారం రోజున బొప్పారంలో ఓ విందు కార్యక్రమానికి ఇరు కుటుంబాలతో కలిసి వెళ్లారు. ఇవాళ ఉదయం శ్రీపాల్‌రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) కలిసి క్వారీ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలోకి జారిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్‌రెడ్డి అందులోకి దిగారు. కానీ ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jul 17, 2024, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.