Bus out of Control Incident: సంగారెడ్డి జిల్లాలోని పిరామల్ పరిశ్రమకు చెందిన బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పింది. జహీరాబాద్లోని రాంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్పై ఉన్న రేలింగ్ను ఢీకొట్టి సగం వరకు బస్సు ముందుకు దూసుకెళ్లింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్లోని పిరామల్ పరిశ్రమకు చెందిన ఈ బస్సు గురువారం జహీరాబాద్లో 12 మంది ఉద్యోగులతో బయలుదేరింది.
రాంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి వరకు రాగానే బస్సు స్టీరింగ్ విరిగి అదుపు తప్పి, వంతెన రెయిలింగ్ను ఢీకొట్టి బస్సు ముందుభాగం కొంత వరకు దూసుకెళ్లి ఆగడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఉద్యోగులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనతో జహీరాబాద్-తాండూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది.