Agriculture Market Committee Chairpersons In Telangana : రాష్ట్రంలో మరో నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాల నియామకం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా అల్లూరి అశోక్రెడ్డి, ఉపాధ్యక్షుడుగా సవపూరె విలాశ్ నియమితులయ్యారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా అంతటి రజిత, ఉపాధ్యక్షుడుగా రుసుమొల్ల వెంకటయ్య నియమితులయ్యారు.
హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా చందుపట్ల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడుగా మరపల్లి రవీందర్ నియమితులయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా ఇనాల చైతన్య, ఉపాధ్యక్షుడుగా పచిమట్ల మదర్ గౌడ్ నియమితులైనట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. తాజాగా వీటితో కలిపి మొత్తం 48 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలు నియమించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.